2026 మార్చికి తుడా టవర్స్ నిర్మాణం పూర్తి అవుతుంది…. ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు.

మన న్యూస్, తిరుపతి, మార్చి 10 :– తిరుపతి నగరంలోని ఆర్సీ రోడ్డులో నిర్మిస్తున్న తుడా టవర్స్ 2026 మార్చి నాటికి నిర్మాణం పూర్తి చేసి, అందుబాటులోకి తెస్తామని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు అన్నారు. సోమవారం ఉదయం తుడా టవర్స్ నిర్మాణ పనులను అధికారులతో కలసి ఎమ్మెల్యే పరిశీలించారు. ఇందుకు సంబంధించిన వివరాలను తుడా ఉపాధ్యక్షులు, నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్.మౌర్య వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాయల చెరువు రోడ్డులోని అన్నమయ్య కూడలి సమీపంలో 3.60 ఎకరాల్లో తుడా టవర్స్ ను 345 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్నామని అన్నారు. 2026 మార్చికి తుడా టవర్స్ నిర్మాణం పూర్తి చేస్థామని అన్నారు. 245 రెసిడెన్షియల్ ప్లాట్స్ తో పాటు కమర్షియల్ ప్లాట్స్ ను అధునాతన సాంకేతికతో నిర్మిస్తున్నామని అన్నారు. నాణ్యమైన మెటీరియల్ ను వినియోగిస్తున్నామని అన్నారు. తుడా టవర్స్ ప్లాట్స్ వేలం ఈ నెల 8వ తేది ప్రారంభమై 12 వ తేది తో ముగుస్తుందని అన్నారు. ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో మరిన్ని టవర్స్ నిర్మించేందుకు ప్రయత్నిస్తామని అన్నారు. ఉపాధ్యక్షులు మాట్లాడుతూ తుడా టవర్స్ ప్లాట్స్ కోసం చేస్తున్న వేలానికి మంచి స్పందన వస్తోందని అన్నారు. ప్రజలు వీక్షించేందుకు వీలుగా మోడల్ ప్లాట్ కూడా ఏర్పాటు చేశామని అన్నారు. నగరంలో ఈట్ స్ట్రీట్ ఏర్పాటు చేసేందుకు అనువైన స్థలాలను పరిశీలిస్తున్నామని, త్వరలోనే ఈట్ స్ట్రీట్ ఏర్పాటు చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ ఆర్.సి. మునిక్రిష్ణ, కార్పొరేటర్లు ఎస్.కె.బాబు, నారాయణ, సూపరింటెండెంట్ ఇంజినీర్లు శ్యాంసుందర్, కృష్ణారెడ్డి, ఈ.ఈ.రవీంద్ర, డి.ఈ.రాజు, తదితరులు ఉన్నారు.

Related Posts

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

చిత్తూరు,మనధ్యాస,సెప్టెంబర్11 చిత్తూరు లో ఘనంగా పెదిరెడ్డి మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు.తనను నమ్మిన వారికోసం ఎంతదాకైనా పోరాడే మా జగనన్న సైన్యాధిపతి, పెద్దాయన మానసపుత్రుడు, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి జన్మదిన వేడుకలు హరిణి రెడ్డి ఆధ్వర్యంలో 5…

విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

సైబర్ మోసాల కి గురి కావద్దు అప్రమత్తంగా ఉండాలి. ప్రతి ఒక్కరూ సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలి సంబంధం లేని వ్యక్తుల నుండి వచ్చే మెసేజ్ ల కు స్పందించవద్దు మన ధ్యాస రిపోర్టర్ పసుమర్తి జాలయ్య సింగరాయకొండ:- దేశం…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

  • By JALAIAH
  • September 11, 2025
  • 3 views
విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..