ఉచిత నిర్బంధ విద్యాహక్కు చట్టం వినియోగించుకోవాలి

హైకోర్టు న్యాయవాది పంతగాని వెంకటేశ్వర్లు

మన న్యూస్ సింగరాయకొండ:-

మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ సింగరాయకొండ శాఖ వారి ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు విద్యాసామాగ్రి పంపిణీ కార్యక్రమంలో భాగంగా సోమవారం సింగరాయకొండ మండలం బింగినపల్లి పంచాయతీ పరిధిలో పెద్దన్నపాలెం, పెద్దపల్లెపాలెం మరియు బింగినిపల్లి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థులకు 30 వేల రూపాయలు విలువ చేసే నోట్ పుస్తకాలు, పలకలు, పెన్సిల్లు మరియు టి ఎల్ ఎం పంపిణీ చేశారు.ఈ సందర్భంగా మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ చైర్మన్ గుంటక రామలక్ష్మమ్మ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలను అభివృద్ధి చేయుటకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాల కృషి చేస్తుందని,దీనిలో భాగంగానే తమ పరిధిలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు విద్యాపరమైన సహకారం అందించుటకు మానవత స్వచ్చంద సంస్థ తమ వంతుగా కృషి చేస్తుందన్నారు.విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఉపాధ్యాయులకు సహకారం అందించి ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలన్నారు.విశ్రాంత మండల విద్యాశాఖ అధికారి మహంకాళి నరసింహ రావు పాఠశాల అభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం కావాలని, తమ పిల్లల విద్యా ప్రగతిని ప్రతిరోజు పరిశీలించుకోవాలని సూచించారు.కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న హైకోర్టు న్యాయవాది పంతగాని వెంకటేశ్వర్లు విద్యార్థుల తల్లిదండ్రులను ఉద్దేశించి మాట్లాడుతూ ఫస్ట్ జనరేషన్ లో విద్యను అందుకోవటంలో విఫలమైననూ,సెకండ్ జనరేషన్లో మాత్రం తప్పనిసరిగా తమ పిల్లలను ఉన్నత చదువులు చదివించి మంచి భవిష్యత్తును అందించాలన్నారు.ఉచిత నిర్బంధ విద్య హక్కు చట్టం వినియోగించుకొని ప్రభుత్వం అందించు విద్యాపరమైన అవకాశాలను అందుకోవాలనన్నారు.కార్యక్రమానికి కోటపాటి నారాయణ అధ్యక్షత వహించగా మానవత సభ్యులు ఎం వి రత్నం,జె.వి సుబ్బారావు, ప్రధానోపాధ్యాయులు అంబటి బ్రహ్మయ్య, రమణారెడ్డి, శ్రీనివాసులు మరియు ఉపాధ్యాయులు మాలిరావు విద్యార్థుల తల్లిదండ్రులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

Related Posts

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

శంఖవరం/ అన్నవరం మన ధ్యాస ప్రతినిధి (అపురూప్):-జాతీయ రహదారి పై ప్రమాదాలను నివారించేందుకు భారీ కసరత్తు చేపడుతున్నారు.శ్రీ కాకినాడ జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్ ఐపీఎస్ సూచనల మేరకు మరియు పెద్దాపురం డి.ఎస్.పి డి శ్రీహరి రాజు ఆదేశాలతో ప్రత్తిపాడు…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

శంఖవరం మన ధ్యాస ప్రతినిధి (అపురూప్):- విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణంగా బోధన జరగాలని ఉపాధ్యాయులకు సమగ్ర శిక్ష (కెజిబివి) కార్యదర్శి డి దేవానందరెడ్డి సూచించారు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం మండల కేంద్రం శంఖవరం కస్తూర్భా గాంధీ బాలికా విద్యాలయ (కెజిబివి)…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

ప్రైవేటీకరణతో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో: సిపిఐ

ప్రైవేటీకరణతో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో: సిపిఐ

దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

  • By NAGARAJU
  • September 10, 2025
  • 3 views
దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్ సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

  • By NAGARAJU
  • September 10, 2025
  • 5 views
అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్  సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///