మెగా పేరెంట్స్, టీచర్స్ మీటింగ్ కార్యక్రమంలో పాల్గోన్న చిత్తూరు ఎంపీ‌ దగ్గుమళ్ళ ప్రసాద్ రావు, ‌పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్..

మన న్యూస్ బంగారుపాళ్యం జులై-10

పూతలపట్టు నియోజకవర్గం, బంగారుపాళ్యం మండలం, కీరమంద జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మెగా పేరెంట్స్, టీచర్స్ మీటింగ్ సందర్భంగా పండుగ వాతావరణం నెలకొంది. ఈ మెగా పేరెంట్స్, టీచర్స్ మీటింగ్ కార్యక్రమానికి చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాద్ రావు మరియు పూతలపట్టు శాసనసభ్యులు డాక్టర్ కలికిరి మురళీమోహన్ ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. వీరికి అధికారులు, మండల నాయకులు, ఉపాధ్యాయులు పుష్ప గుఛ్ఛాలు అందించి ఘన స్వాగతం పలికారు. అనంతరం పాఠశాల పరిసరాలను వీరు పరిశీలించి విద్యార్ధులతో ముచ్చటించి విద్యా భోధన, సౌకర్యాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం విద్యార్ధుల తల్లిదండ్రులతో మాట్లాడారు. అనంతరం బంగారుపాళ్యం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన మెగా పేరెంట్స్, టీచర్స్ మీటింగ్ లో ఎంపీ,‌ఎమ్మెల్యే పాల్గోన్నారు. ఈ సందర్భంగా పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్ ప్రసంగిస్తూ… పిల్లల బంగారు భవిష్యత్తు కోసం చదువు ఎంతో ముఖ్యమని ఆయన సూచించారు. తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు పిల్లల చదువులపై దృష్టి సారించడం ద్వారా పిల్లలు చదువుల విషయంలో‌ మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలో మంత్రి నారా లోకేష్ ప్రభుత్వ పాఠశాలలో నూతన సంస్కరణలకు శ్రీకారం చుట్టారని, ప్రైవేటు పాఠశాలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాల విద్యార్ధులు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని తెలిపారు. కీరమంద ప్రభుత్వ పాఠశాలకు అవసరమైన క్రీడా మైదానం, పాఠశాలకు అవసరమైన టెబుల్స్ ఇతరత్రా సౌఖర్యాలను మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకెళ్ళి పరిష్కరిస్తానని ఆయన హామీ ఇచ్చారు. మీ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉందని, మీకు అందుబాటులో ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకొని, కుటుంబానికే కాదు, సమాజానికీ గౌరవం తీసుకొచ్చేలా ఎదగాలి” అని ఆకాంక్షించారు. అలాగే పేరెంట్స్ మరియు టీచర్స్ సంయుక్త సహకారంతోనే విద్యార్థులు ఉత్తమ వ్యక్తులుగా తీర్చిదిద్దబడతారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కోదండ యాదవ్, గంగాధరనెల్లూరు నియోజకవర్గం పరిశీలకులు ఎన్.పి.జయప్రకాష్ నాయుడు, మండల‌ పార్టీ అధ్యక్షులు ఎన్.పి.ధరణీ నాయుడు, మండల నాయకులు జనార్థన్ గౌడ్, అధికారులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్ధులు పాల్గోన్నారు.

Related Posts

మండలంలో విద్యార్థులతో మెగా పేరెంట్స్ టీచర్స్ ఆత్మీయ సమావేశాలు…

శంఖవరం మన న్యూస్ ప్రతినిధి;- కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం శంఖవరం మండలంలోని మండల ప్రజా పరిషత్తు ప్రాధమిక పాఠశాలలు, మండల‌ పరిషత్తు ప్రాధమికోన్నత పాఠశాలలు, గిరిజన సంక్షేమ ప్రాధమిక పాఠశాలు, జిల్లా ప్రజా పరిషత్తు ఉన్నత పాఠశాలలు, గిరిజన సంక్షేమ…

ఉన్నతమైన విద్య భావితరాల భవిష్యత్తు రూపుదిద్దుకుంటుంది..

_ రెఫరల్ చైర్మన్ స్లెస్సర్ బాబు శంఖవరం మన న్యూస్ ప్రతినిధి:- విద్యార్థులకు ఉన్నతమైన విద్య భావితరాల భవిష్యత్తు రూపుదిద్దుకుంటుందని అని కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం శంఖవరం మండలం సీతయ్యమ్మపేట రూరల్ ఇండియా సెల్ఫ్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఛైర్మన్, రెఫరల్…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

దత్తాత్రేయ దేవాలయంలో ఘనంగా గురు పౌర్ణమి వేడుకలు.

దత్తాత్రేయ దేవాలయంలో ఘనంగా గురు పౌర్ణమి వేడుకలు.

మండలంలో విద్యార్థులతో మెగా పేరెంట్స్ టీచర్స్ ఆత్మీయ సమావేశాలు…

మండలంలో విద్యార్థులతో మెగా పేరెంట్స్ టీచర్స్ ఆత్మీయ సమావేశాలు…

ఉన్నతమైన విద్య భావితరాల భవిష్యత్తు రూపుదిద్దుకుంటుంది..

ఉన్నతమైన విద్య భావితరాల భవిష్యత్తు రూపుదిద్దుకుంటుంది..

భక్తిశ్రద్ధలతో గురు పౌర్ణమి వేడుకలు

భక్తిశ్రద్ధలతో గురు పౌర్ణమి వేడుకలు

గురు పౌర్ణమి వేడుకల్లో పాల్గొన్న ముద్రగడ

గురు పౌర్ణమి వేడుకల్లో పాల్గొన్న ముద్రగడ

చల్లగా చూడవయ్యా..కరుణను చూపవయ్యా..కావాగారవయ్య శ్రీ సాయిబాబా.!సాయిబాబా మందిరంలో ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ప్రత్యేక పూజలు.!!

చల్లగా చూడవయ్యా..కరుణను చూపవయ్యా..కావాగారవయ్య శ్రీ సాయిబాబా.!సాయిబాబా మందిరంలో ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ప్రత్యేక పూజలు.!!