మెగా పేరెంట్స్, టీచర్స్ మీటింగ్ కార్యక్రమంలో పాల్గోన్న చిత్తూరు ఎంపీ‌ దగ్గుమళ్ళ ప్రసాద్ రావు, ‌పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్..

మన న్యూస్ బంగారుపాళ్యం జులై-10

పూతలపట్టు నియోజకవర్గం, బంగారుపాళ్యం మండలం, కీరమంద జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మెగా పేరెంట్స్, టీచర్స్ మీటింగ్ సందర్భంగా పండుగ వాతావరణం నెలకొంది. ఈ మెగా పేరెంట్స్, టీచర్స్ మీటింగ్ కార్యక్రమానికి చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాద్ రావు మరియు పూతలపట్టు శాసనసభ్యులు డాక్టర్ కలికిరి మురళీమోహన్ ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. వీరికి అధికారులు, మండల నాయకులు, ఉపాధ్యాయులు పుష్ప గుఛ్ఛాలు అందించి ఘన స్వాగతం పలికారు. అనంతరం పాఠశాల పరిసరాలను వీరు పరిశీలించి విద్యార్ధులతో ముచ్చటించి విద్యా భోధన, సౌకర్యాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం విద్యార్ధుల తల్లిదండ్రులతో మాట్లాడారు. అనంతరం బంగారుపాళ్యం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన మెగా పేరెంట్స్, టీచర్స్ మీటింగ్ లో ఎంపీ,‌ఎమ్మెల్యే పాల్గోన్నారు. ఈ సందర్భంగా పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్ ప్రసంగిస్తూ… పిల్లల బంగారు భవిష్యత్తు కోసం చదువు ఎంతో ముఖ్యమని ఆయన సూచించారు. తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు పిల్లల చదువులపై దృష్టి సారించడం ద్వారా పిల్లలు చదువుల విషయంలో‌ మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలో మంత్రి నారా లోకేష్ ప్రభుత్వ పాఠశాలలో నూతన సంస్కరణలకు శ్రీకారం చుట్టారని, ప్రైవేటు పాఠశాలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాల విద్యార్ధులు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని తెలిపారు. కీరమంద ప్రభుత్వ పాఠశాలకు అవసరమైన క్రీడా మైదానం, పాఠశాలకు అవసరమైన టెబుల్స్ ఇతరత్రా సౌఖర్యాలను మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకెళ్ళి పరిష్కరిస్తానని ఆయన హామీ ఇచ్చారు. మీ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉందని, మీకు అందుబాటులో ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకొని, కుటుంబానికే కాదు, సమాజానికీ గౌరవం తీసుకొచ్చేలా ఎదగాలి” అని ఆకాంక్షించారు. అలాగే పేరెంట్స్ మరియు టీచర్స్ సంయుక్త సహకారంతోనే విద్యార్థులు ఉత్తమ వ్యక్తులుగా తీర్చిదిద్దబడతారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కోదండ యాదవ్, గంగాధరనెల్లూరు నియోజకవర్గం పరిశీలకులు ఎన్.పి.జయప్రకాష్ నాయుడు, మండల‌ పార్టీ అధ్యక్షులు ఎన్.పి.ధరణీ నాయుడు, మండల నాయకులు జనార్థన్ గౌడ్, అధికారులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్ధులు పాల్గోన్నారు.

Related Posts

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

చిత్తూరు,మనధ్యాస,సెప్టెంబర్11 చిత్తూరు లో ఘనంగా పెదిరెడ్డి మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు.తనను నమ్మిన వారికోసం ఎంతదాకైనా పోరాడే మా జగనన్న సైన్యాధిపతి, పెద్దాయన మానసపుత్రుడు, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి జన్మదిన వేడుకలు హరిణి రెడ్డి ఆధ్వర్యంలో 5…

విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

సైబర్ మోసాల కి గురి కావద్దు అప్రమత్తంగా ఉండాలి. ప్రతి ఒక్కరూ సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలి సంబంధం లేని వ్యక్తుల నుండి వచ్చే మెసేజ్ ల కు స్పందించవద్దు మన ధ్యాస రిపోర్టర్ పసుమర్తి జాలయ్య సింగరాయకొండ:- దేశం…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

  • By JALAIAH
  • September 11, 2025
  • 3 views
విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..