విద్యార్థులు చిన్నప్పటినుంచే చదువుతోపాటు క్రీడలను అలవర్చుకోవాలి….రాష్ట్ర హస్తకళల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్

మన న్యూస్,తిరుపతి :– విద్యార్థులు చిన్నప్పటినుండే చదువుతోపాటు క్రీడలను అలవర్చుకోవాలని రాష్ట్ర హస్తకళల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ విద్యార్థులకు సూచించారు. గురువారం ముత్యాల రెడ్డి పల్లి లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన మెగా పేరెంట్స్ మీటింగ్ కు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులను, తల్లిదండ్రులను ఉద్దేశించి మాట్లాడుతూ తల్లిదండ్రులు పిల్లల ప్రవర్తనపై నిఘా పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. పిల్లలను ఎంతసేపు చదవమని చెప్పకుండా వారికి క్రీడల పట్ల ఆసక్తి కలిగేలా చూడాలన్నారు. విద్యార్థులు గురువుల పట్ల గౌరభావంతో పాటు భక్తి భావం కలిగి ఉండాలని అప్పుడే విద్యార్థులకు చదువు వంట పడుతుందని పేర్కొన్నారు. హైస్కూల్లో విద్యార్థులకు కావలసిన అన్ని మౌలిక సదుపాయాలను ఏర్పరచాలని, మధ్యాహ్న భోజన పథకంలో మంచి నాణ్యత కలిగి ఉండాలన్నారు. పిల్లలకు తాగేందుకు అవసరమైన తాగునీరు మినరల్ వాటర్ తో పాటు మరుగుదొడ్లు పరిశుభ్రముగా ఉండేలా చూసుకోవాల్సిన బాధ్యత ఉపాధ్యాయులదేనన్నారు. కూటమి ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ బడులకు కావలసిన వసతులను సమకూరుస్తోందని, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ ల ప్రోత్సాహంతో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ను నెంబర్ వన్ గా తీసుకురావాలని ఆకాంక్షిస్తున్నారన్నారు. హై స్కూల్ లోని మౌలిక సదుపాయాలను ఆయన పరిశీలించారు.

Related Posts

చల్లగా చూడవయ్యా..కరుణను చూపవయ్యా..కావాగారవయ్య శ్రీ సాయిబాబా.!సాయిబాబా మందిరంలో ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ప్రత్యేక పూజలు.!!

వరికుంటపాడు,,మనన్యూస్: గురు పౌర్ణమిని పురస్కరించుకొని ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ మండల కేంద్రంలోని వరికుంటపాడు గ్రామంలో శ్రీ సాయిబాబా మందిరంలో ఉదయగిరి నియోజకవర్గ ప్రజలను చల్లగా చూడాలని, కరుణా కటాక్షాలు కలగాలని, వేగంగా పనులు జరగాలని ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు.…

పిల్లల బంగారు భవిష్యత్తు కోసం.. బడివైపు ఒక అడుగు..!లక్ష్యం ఉంటే పేదరికం చదువుకు అడ్డు కాదు..మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 2.0 లో ఎమ్మెల్యే కాకర్ల సురేష్..!

కలిగిరి, మన న్యూస్ : పిల్లల బంగారు భవిష్యత్తు కోసం. బడివైపు ఒక అడుగు పేరుతో రాష్ట్రవ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ 2.0 కార్యక్రమం ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో విద్యాశాఖ మంత్రి శ్రీ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

చల్లగా చూడవయ్యా..కరుణను చూపవయ్యా..కావాగారవయ్య శ్రీ సాయిబాబా.!సాయిబాబా మందిరంలో ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ప్రత్యేక పూజలు.!!

చల్లగా చూడవయ్యా..కరుణను చూపవయ్యా..కావాగారవయ్య శ్రీ సాయిబాబా.!సాయిబాబా మందిరంలో ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ప్రత్యేక పూజలు.!!

పిల్లల బంగారు భవిష్యత్తు కోసం.. బడివైపు ఒక అడుగు..!లక్ష్యం ఉంటే పేదరికం చదువుకు అడ్డు కాదు..మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 2.0 లో ఎమ్మెల్యే కాకర్ల సురేష్..!

పిల్లల బంగారు భవిష్యత్తు కోసం.. బడివైపు ఒక అడుగు..!లక్ష్యం ఉంటే పేదరికం చదువుకు అడ్డు కాదు..మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 2.0 లో ఎమ్మెల్యే  కాకర్ల సురేష్..!

ఒకే మహిళకు రెండు మరణ ధృవీకరణ పత్రాలు.. ఉరవకొండలో అధికారుల నిర్లక్ష్యం బయటపడింది

ఒకే మహిళకు రెండు మరణ ధృవీకరణ పత్రాలు.. ఉరవకొండలో అధికారుల నిర్లక్ష్యం బయటపడింది

గురువే దైవం: ఉరవకొండలో గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు

గురువే దైవం: ఉరవకొండలో గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు

రెల్లివలసలో అగ్రిఫీల్డ్స్ ఉచిత ఆరోగ్య శిబిరం మరియు పాఠశాల క్రీడా దినోత్సవాన్ని నిర్వహిస్తుంది

రెల్లివలసలో అగ్రిఫీల్డ్స్ ఉచిత ఆరోగ్య శిబిరం మరియు పాఠశాల క్రీడా దినోత్సవాన్ని నిర్వహిస్తుంది

పేరెంట్స్ డే సందర్భంగా బింగినపల్లిలో పాఠశాల అభివృద్ధి కార్యక్రమాలు

పేరెంట్స్ డే సందర్భంగా బింగినపల్లిలో పాఠశాల అభివృద్ధి కార్యక్రమాలు