ఉపాధ్యాయులకు పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించటం సరికాదు, డి టి ఎఫ్ నారాయణ పేట జిల్లా అధ్యక్ష కార్యదర్శులు హైమావతి,సూర్యచంద్ర.

మన న్యూస్, నారాయణ పేట జిల్లా : తెలంగాణ రాష్ట్రంలో ప్రాథమిక ప్రాథమికోన్నత ఉన్నత పాఠశాలల పనితీరును పర్యవేక్షించడానికి ఎస్జీటీ, ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, స్కూల్ అసిస్టెంట్ ఉపాధ్యాయులను పర్యవేక్షణ అధికారులుగా నియమించి బాధ్యతలు అప్పగించడం సరికాదని, ఇది విద్యారంగ తిరోగమన చర్య అని, మరింత విద్యారంగా సంక్షోభానికి దారితీస్తుందని వెంటనే ఈ ఉత్తర్వులను విరమించుకోవాలని,డెమొక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ నారాయణ పేట జిల్లా అధ్యక్షురాలు హైమావతి, జిల్లా ప్రధాన కార్యదర్శి సూర్యచంద్ర ఓ ప్రకటన ద్వారా డిమాండ్ చేశారు. ఈ సంధర్బంగా వారు మాట్లాడుతూ,629 మండలాలు 1, 817 క్లస్టర్ల పరిధిలో ఉన్న 24,146 పాఠశాలలను తనిఖీ చేయడానికి పది సంవత్సరాలు అనుభవం ఉన్న సుమారు రెండువేలకుపైగా ఉపాధ్యాయులకు తనిఖీ బాధ్యతలు అప్పగించి, ప్రతి సంవత్సరం, అలాగే విద్యా సంవత్సరం పొడవునా వారిని తనిఖీ బాధ్యతలలో ఉంచడంవల్ల ,వారు సేవలందిస్తున్న ఆయా పాఠశాలలలో బోధన పూర్తిగా స్తంభించిపోతుందని , దాని ఫలితంగా విద్యా ప్రమాణాలు కుంటు పడతాయనేది స్పష్టం చేశారు.ఒకవైపు ప్రభుత్వమే రాష్ట్రమంతా అన్ని పాఠశాలలో విద్యా ప్రమాణాలకు చర్యలు తీసుకుంటామని చెబుతూనే, ఇలాంటి చర్యలకు పాల్పడడం అనాలోచితమైన చర్యగా పేర్కొoటున్నామనీ అన్నారు.కామన్ సర్వీస్ రూల్స్ సమస్య పరిష్కరించి, పూర్తిస్థాయి మండల విద్యాధికారులను, ఉప విద్యాశాఖ అధికారులను, జిల్లా విద్యాశాఖాధికారులను నియమించి పాఠశాలల పర్యవేక్షణ బాధ్యతలను వారికే ఇవ్వాలి అన్నారు.తరగతికి ఒక గది, తరగతికి ఒక ఉపాధ్యాయుడిని కేటాయిస్తూ, విద్యా అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు చేపట్టాలని, ఇప్పటికే పాఠశాలల్లో వేలాది ఉపాధ్యాయ ఖాళీలు ఉండడంవల్ల బోధన స్తంభించిపోతున్నదని వెంటనే డీఎస్సీ ప్రకటించి ఉపాధ్యాయులను నియమించాలాన్నారు.ఇప్పుడే ప్రభుత్వ ఆచరణ ,ప్రభుత్వ ప్రకటనలకు పొంతన కుదురుతుందని,లేని పక్షంలో గత ప్రభుత్వపు విధానాల్లాగే, సంక్షోభo కొనసాగుతుందన్నారు.రాస్త్రంలో విద్యారంగ పరిస్థితులపై కమిషన్ వేసి, అధ్యయనఁ చేసి, అంతే కాకుండా కొత్తగా 521 పాఠశాలలను ప్రారంభిస్తామని విద్యారంగం పట్ల ఆసక్తిని కనపరుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం, తిరిగి మళ్ళీ, పర్యవేక్షణ పేరు తోటి బోధనను ప్రభావితం చేసే చర్యలకు పాల్పడటం పాఠశాలల్లో చాలా ఇబ్బందికరమైన వాతావరణాన్ని సృష్టిస్తుందని, కనుక ప్రభుత్వం ఈ విషయంలో పునరాలోచించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నామని పేర్కోన్నారు.

Related Posts

మాదకద్రవ్యాలకు బానిస కావద్దని, జీవితాన్ని నాశనం చేసుకోవద్దు, ఎస్సై

మన న్యూస్ నర్వ మండలం:- మాదక ద్రవ్యాలు నిర్మూలన వారోత్సవాల్లో కమ్యూనిటీ పోలీసింగ్ లో భాగంగా నర్వ మండలం కల్వాల్ గ్రామంలోని ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు మాదక ద్రవ్యాలు మరియు మత్తు పదార్థాలు వాటి యొక్క దుష్ఫలితాలు, నిర్మూలన పై అవేర్నెస్…

మత్తు పదార్థాలకు బానిసలై భవిష్యత్‌ను పాడుచేసుకోవద్దు: నర్వ ఎస్సై పబ్బతి రమేష్

విద్యార్థులు చెడు వ్యసనాలకు లోను కాకుండా చదువుపై దృష్టి సారించి ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలని SI రమేష్ సూచించారు. మన న్యూస్ నర్వ మండలం :- జిల్లా ఎస్పీ శ్రీ యోగేష్ గౌతమ్ IPS ఆదేశాల మేరకు మత్తు పదార్థాల వ్యతిరేక…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

రాష్ట్ర బిషప్ కౌన్సిల్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా జోసెఫ్ ఆండ్రూస్

రాష్ట్ర బిషప్ కౌన్సిల్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా జోసెఫ్ ఆండ్రూస్

సాలూరు మున్సిపల్ ఆఫీసులో ఎసిబి సోదాలు,

సాలూరు మున్సిపల్ ఆఫీసులో ఎసిబి సోదాలు,

రాజబాబు కుటుంబ సభ్యులను పరామర్శించిన జిల్లా బిజెపి నేతలు

రాజబాబు కుటుంబ సభ్యులను పరామర్శించిన జిల్లా బిజెపి నేతలు

ఘనంగా శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి వేడుకలు

ఘనంగా శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి వేడుకలు

శ్రీ శ్యాం ప్రసాద్ ముఖర్జీకి ఘన నివాళులు

శ్రీ శ్యాం ప్రసాద్ ముఖర్జీకి ఘన నివాళులు

సాగు చేస్తున్న గిరిజన రైతులు భూములు కి ప్రభుత్వము పట్టలు ఇవ్వాలి

సాగు చేస్తున్న గిరిజన రైతులు భూములు కి ప్రభుత్వము పట్టలు ఇవ్వాలి