ఉపాధ్యాయులకు పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించటం సరికాదు, డి టి ఎఫ్ నారాయణ పేట జిల్లా అధ్యక్ష కార్యదర్శులు హైమావతి,సూర్యచంద్ర.

మన న్యూస్, నారాయణ పేట జిల్లా : తెలంగాణ రాష్ట్రంలో ప్రాథమిక ప్రాథమికోన్నత ఉన్నత పాఠశాలల పనితీరును పర్యవేక్షించడానికి ఎస్జీటీ, ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, స్కూల్ అసిస్టెంట్ ఉపాధ్యాయులను పర్యవేక్షణ అధికారులుగా నియమించి బాధ్యతలు అప్పగించడం సరికాదని, ఇది విద్యారంగ తిరోగమన చర్య అని, మరింత విద్యారంగా సంక్షోభానికి దారితీస్తుందని వెంటనే ఈ ఉత్తర్వులను విరమించుకోవాలని,డెమొక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ నారాయణ పేట జిల్లా అధ్యక్షురాలు హైమావతి, జిల్లా ప్రధాన కార్యదర్శి సూర్యచంద్ర ఓ ప్రకటన ద్వారా డిమాండ్ చేశారు. ఈ సంధర్బంగా వారు మాట్లాడుతూ,629 మండలాలు 1, 817 క్లస్టర్ల పరిధిలో ఉన్న 24,146 పాఠశాలలను తనిఖీ చేయడానికి పది సంవత్సరాలు అనుభవం ఉన్న సుమారు రెండువేలకుపైగా ఉపాధ్యాయులకు తనిఖీ బాధ్యతలు అప్పగించి, ప్రతి సంవత్సరం, అలాగే విద్యా సంవత్సరం పొడవునా వారిని తనిఖీ బాధ్యతలలో ఉంచడంవల్ల ,వారు సేవలందిస్తున్న ఆయా పాఠశాలలలో బోధన పూర్తిగా స్తంభించిపోతుందని , దాని ఫలితంగా విద్యా ప్రమాణాలు కుంటు పడతాయనేది స్పష్టం చేశారు.ఒకవైపు ప్రభుత్వమే రాష్ట్రమంతా అన్ని పాఠశాలలో విద్యా ప్రమాణాలకు చర్యలు తీసుకుంటామని చెబుతూనే, ఇలాంటి చర్యలకు పాల్పడడం అనాలోచితమైన చర్యగా పేర్కొoటున్నామనీ అన్నారు.కామన్ సర్వీస్ రూల్స్ సమస్య పరిష్కరించి, పూర్తిస్థాయి మండల విద్యాధికారులను, ఉప విద్యాశాఖ అధికారులను, జిల్లా విద్యాశాఖాధికారులను నియమించి పాఠశాలల పర్యవేక్షణ బాధ్యతలను వారికే ఇవ్వాలి అన్నారు.తరగతికి ఒక గది, తరగతికి ఒక ఉపాధ్యాయుడిని కేటాయిస్తూ, విద్యా అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు చేపట్టాలని, ఇప్పటికే పాఠశాలల్లో వేలాది ఉపాధ్యాయ ఖాళీలు ఉండడంవల్ల బోధన స్తంభించిపోతున్నదని వెంటనే డీఎస్సీ ప్రకటించి ఉపాధ్యాయులను నియమించాలాన్నారు.ఇప్పుడే ప్రభుత్వ ఆచరణ ,ప్రభుత్వ ప్రకటనలకు పొంతన కుదురుతుందని,లేని పక్షంలో గత ప్రభుత్వపు విధానాల్లాగే, సంక్షోభo కొనసాగుతుందన్నారు.రాస్త్రంలో విద్యారంగ పరిస్థితులపై కమిషన్ వేసి, అధ్యయనఁ చేసి, అంతే కాకుండా కొత్తగా 521 పాఠశాలలను ప్రారంభిస్తామని విద్యారంగం పట్ల ఆసక్తిని కనపరుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం, తిరిగి మళ్ళీ, పర్యవేక్షణ పేరు తోటి బోధనను ప్రభావితం చేసే చర్యలకు పాల్పడటం పాఠశాలల్లో చాలా ఇబ్బందికరమైన వాతావరణాన్ని సృష్టిస్తుందని, కనుక ప్రభుత్వం ఈ విషయంలో పునరాలోచించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నామని పేర్కోన్నారు.

Related Posts

హసన్‌పల్లి గ్రామంలో విద్యుత్ సమస్యకు శాశ్వత పరిష్కారం: మన ధ్యాస న్యూస్ కథనానికి స్పందన

మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్):మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్‌పల్లి గ్రామంలో గత రెండు సంవత్సరాలుగా అధిక లోడు కారణంగా విద్యుత్ సరఫరాలో తీవ్రమైన సమస్యలు కొనసాగుతూ ఉండగా,మన ధ్యాస దినపత్రిక ఆదివారం ఒక కథనాన్ని ప్రచురించింది.ఇందులో ట్రాన్స్ఫార్మర్ కాలిపోయి వదిలివేయబడినట్లు, అందువల్ల…

ట్రాన్స్ఫార్మర్‌ పెట్టారు.. కాలిపోయింది వదిలేశారు..ఇది విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం..

మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్):మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్‌పల్లి గ్రామంలో గత రెండేళ్లుగా విద్యుత్ సమస్యలు తీవ్రరూపం దాల్చాయి. గ్రామంలోని మినీ ట్రాన్స్ఫార్మర్‌పై అధిక లోడు పడడం వల్ల తరచూ వైర్లు తెగిపడి కరెంటు సరఫరా నిలిచిపోతోంది.గ్రామస్థుల సమాచారం ప్రకారం,ఒకే ట్రాన్స్ఫార్మర్‌కు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

ప్రైవేటీకరణతో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో: సిపిఐ

ప్రైవేటీకరణతో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో: సిపిఐ

దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

  • By NAGARAJU
  • September 10, 2025
  • 3 views
దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్ సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

  • By NAGARAJU
  • September 10, 2025
  • 4 views
అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్  సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఒన్ సైడ్ గా గెలిపించండి

ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఒన్ సైడ్ గా గెలిపించండి

ఎన్నికల్లో హామీలు ఇచ్చాం ఎన్ని కష్టాలు వచ్చినా తీర్చాం.

ఎన్నికల్లో హామీలు ఇచ్చాం ఎన్ని కష్టాలు వచ్చినా తీర్చాం.

వాతావరణ మార్పుల ప్రభావం–ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి: శివ కిషోర్

వాతావరణ మార్పుల ప్రభావం–ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి: శివ కిషోర్