

మన న్యూస్,తిరుపతి :– తిరుపతి ఆధ్యాత్మిక నగరంలోని ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చేందుకు భరోసా కల్పించడానీకే ఆటోలకు ఈ డిజిటల్ నెంబర్లను పంపిణీ చేయడం జరుగుతుందని జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలిపారు. సోమవారం రిజర్వ్ పోలీస్ గ్రౌండ్ లో ట్రాఫిక్ డిఎస్పి రామకృష్ణమాచారి ఆధ్వర్యంలో నగరంలోని ఆటోలకు డిజిటల్ నెంబర్ల పంపిణీ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ వివిధ ప్రాంతాల నుంచి తిరుపతికి వచ్చే ప్రయాణికులు ఆటోలలో ఎక్కిన సమయంలో వారిని సురక్షితంగా గమనించేందుకు ఈ డిజిటల్ నెంబర్లు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయన్నారు. ప్రయాణికులు ఆటోలో ప్రయాణించేటప్పుడు ఆటోకు సంబంధించిన డ్రైవరుతో పాటు ఆటో పూర్తి వివరాలను క్యూఆర్ కోడ్ తో ఉంటుందన్నారు. ప్రయాణికుల భద్రత దృష్ట్యా క్యూఆర్ కోడ్ను స్కాన్ ఫోటో తీసుకున్న యెడల ఆటో డ్రైవర్ ఓనర్ల యొక్క పూర్తి వివరాలు అందులో తెలుసుకోవడం జరుగుతుందన్నారు. క్యూఆర్ కోడ్ గూగుల్ లెన్స్ ద్వారా స్కాన్ ద్వారా పనిచేస్తుందని ఎస్పీ చెప్పారు. ఆటోలో ప్రయాణించే ప్రయాణికులు ఒక చోట నుండి మరొక చోటికి వెళ్లే సమయంలో లొకేషన్ అత్యవసర సమయాన్ని మాత్రమే ట్రాక్ లొకేషన్ తెలుసుకోవడం జరుగుతుందన్నారు. వెంటనే ఆ సమాచారం పోలీస్ కంట్రోల్ రూమ్ కు అనుసంధానం చేయడం జరిగిందన్నారు. ఆటోలో ప్రయాణించేటప్పుడు డ్రైవర్ యొక్క ప్రవర్తన, మీ అభిప్రాయాలను రేటింగ్ ద్వారా తెలియజేయవచ్చునని చెప్పారు. ఆటోలో ప్రయాణించినప్పుడు ఎవరైనా డ్రైవర్లు ఇబ్బంది పెట్టిన అశోక్ కలిగించిన వెంటనే కంట్రోల్ రూమ్ కు ఫిర్యాదు చేయవచ్చునని పేర్కొన్నారు. ఆటో ఓనర్లు కానీ డ్రైవర్లు కానీ డిజిటల్ నెంబర్లను తీసుకోవాలంటే ఆటో ఓనర్ డ్రైవర్లు తమ వాహనం యొక్క పూర్తి వివరాలతో పాటు ఆధార్ కార్డులను డ్రైవింగ్ లైసెన్స్ ను పాస్పోర్ట్లతో ట్రాఫిక్ పోలీసులకు అందజేయాల్సి ఉంటుందని చెప్పారు. కావున నగరంలోని ఆటో యమానులు డ్రైవర్లు తమకు సహకరించి నేరాల నియంత్రణకు పాటుపడాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీలు రవి మనోహరాచారి, నాగభూషణరావు డి ఎస్ పి లు భక్తవత్సలం, శ్యామసుందర్, చంద్రశేఖర్, ట్రాఫిక్ సిఐ సంజీవ్ కుమార్, సుబ్బారెడ్డి, రమణ, ఆ రైలు రమణారెడ్డి రాజశేఖర్ రెడ్డి, ట్రాఫిక్ పోలీసులు పాల్గొన్నారు.
