ఆటోలకు డిజిటల్ నెంబర్ల పంపిణీ…ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చాలి-ఎస్పీ హర్షవర్ధన్ రాజు…

మన న్యూస్,తిరుపతి :– తిరుపతి ఆధ్యాత్మిక నగరంలోని ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చేందుకు భరోసా కల్పించడానీకే ఆటోలకు ఈ డిజిటల్ నెంబర్లను పంపిణీ చేయడం జరుగుతుందని జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలిపారు. సోమవారం రిజర్వ్ పోలీస్ గ్రౌండ్ లో ట్రాఫిక్ డిఎస్పి రామకృష్ణమాచారి ఆధ్వర్యంలో నగరంలోని ఆటోలకు డిజిటల్ నెంబర్ల పంపిణీ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ వివిధ ప్రాంతాల నుంచి తిరుపతికి వచ్చే ప్రయాణికులు ఆటోలలో ఎక్కిన సమయంలో వారిని సురక్షితంగా గమనించేందుకు ఈ డిజిటల్ నెంబర్లు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయన్నారు. ప్రయాణికులు ఆటోలో ప్రయాణించేటప్పుడు ఆటోకు సంబంధించిన డ్రైవరుతో పాటు ఆటో పూర్తి వివరాలను క్యూఆర్ కోడ్ తో ఉంటుందన్నారు. ప్రయాణికుల భద్రత దృష్ట్యా క్యూఆర్ కోడ్ను స్కాన్ ఫోటో తీసుకున్న యెడల ఆటో డ్రైవర్ ఓనర్ల యొక్క పూర్తి వివరాలు అందులో తెలుసుకోవడం జరుగుతుందన్నారు. క్యూఆర్ కోడ్ గూగుల్ లెన్స్ ద్వారా స్కాన్ ద్వారా పనిచేస్తుందని ఎస్పీ చెప్పారు. ఆటోలో ప్రయాణించే ప్రయాణికులు ఒక చోట నుండి మరొక చోటికి వెళ్లే సమయంలో లొకేషన్ అత్యవసర సమయాన్ని మాత్రమే ట్రాక్ లొకేషన్ తెలుసుకోవడం జరుగుతుందన్నారు. వెంటనే ఆ సమాచారం పోలీస్ కంట్రోల్ రూమ్ కు అనుసంధానం చేయడం జరిగిందన్నారు. ఆటోలో ప్రయాణించేటప్పుడు డ్రైవర్ యొక్క ప్రవర్తన, మీ అభిప్రాయాలను రేటింగ్ ద్వారా తెలియజేయవచ్చునని చెప్పారు. ఆటోలో ప్రయాణించినప్పుడు ఎవరైనా డ్రైవర్లు ఇబ్బంది పెట్టిన అశోక్ కలిగించిన వెంటనే కంట్రోల్ రూమ్ కు ఫిర్యాదు చేయవచ్చునని పేర్కొన్నారు. ఆటో ఓనర్లు కానీ డ్రైవర్లు కానీ డిజిటల్ నెంబర్లను తీసుకోవాలంటే ఆటో ఓనర్ డ్రైవర్లు తమ వాహనం యొక్క పూర్తి వివరాలతో పాటు ఆధార్ కార్డులను డ్రైవింగ్ లైసెన్స్ ను పాస్పోర్ట్లతో ట్రాఫిక్ పోలీసులకు అందజేయాల్సి ఉంటుందని చెప్పారు. కావున నగరంలోని ఆటో యమానులు డ్రైవర్లు తమకు సహకరించి నేరాల నియంత్రణకు పాటుపడాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీలు రవి మనోహరాచారి, నాగభూషణరావు డి ఎస్ పి లు భక్తవత్సలం, శ్యామసుందర్, చంద్రశేఖర్, ట్రాఫిక్ సిఐ సంజీవ్ కుమార్, సుబ్బారెడ్డి, రమణ, ఆ రైలు రమణారెడ్డి రాజశేఖర్ రెడ్డి, ట్రాఫిక్ పోలీసులు పాల్గొన్నారు.

Related Posts

ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

శంఖవరం/ ప్రత్తిపాడు మన ధ్యాస ప్రతినిధి:- కాకినాడ జిల్లా కిర్లంపూడి లో గురువారం రాజమహేంద్రవరం కి చెందిన పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు మాజీ మంత్రి వైసిపి పిఏసి సభ్యులు ముద్రగడ పద్మనాభం ను మర్యాదపూర్వకంగా కలిశారు.…

ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

శంఖవరం మన ధ్యాస ప్రతినిధి:- కాకినాడ పార్లమెంట్ సభ్యులు తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ కృషితో ప్రత్తిపాడు నియోజకవర్గంలో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం ఏర్పాటు చేశారు. వివరాల్లోకెళ్తే.. శంఖవరం మండలంలో గిరిజన గ్రామాలైన వేళంగి,పెదమల్లాపురం తదితర గ్రామాలకు నిలిచిపోయిన ఆర్టీసీ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

నేపాల్ లో చిక్కుకున్న తెలుగు వారిని కాపాడటంలో లోకేష్ బాబు చొరవ చూపర్… రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వ కార్యదర్శి బొల్లినేని వెంకట రామారావు…

  • By NAGARAJU
  • September 12, 2025
  • 2 views
నేపాల్ లో చిక్కుకున్న తెలుగు వారిని కాపాడటంలో లోకేష్ బాబు చొరవ చూపర్… రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వ కార్యదర్శి బొల్లినేని వెంకట రామారావు…

కొత్త జిల్లాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం – అమరావతి కేంద్రంగా అర్బన్‌ జిల్లా..///

  • By NAGARAJU
  • September 12, 2025
  • 3 views
కొత్త జిల్లాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం – అమరావతి కేంద్రంగా అర్బన్‌ జిల్లా..///

నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//

  • By NAGARAJU
  • September 12, 2025
  • 5 views
నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//

ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు