మన న్యూస్ సాలూరు జూన్10:= పార్వతిపురం మన్యం జిల్లా సాలూరు లో మాంసం చేపల దుకాణాల్లో మున్సిపల్ అధికారుల తనిఖీలు..కుళ్ళిన 10 కేజీల మాంసాన్ని, పాడైపోయిన 20 కేజీల చేపలను స్వాధీనం చేసుకొని పాతిపెట్టిన సానిటరీ ఇన్స్పెక్టర్ లావేటి బాలకృష్ణ.. నిబంధనలు పాటించని మాంసం చేపల విక్రయదారులకు పదివేల రూపాయలు అపరాధ రుసుం వేశారు. సాలూరు ఆర్టీసీ కాంప్లెక్స్ ఎదురుగా ఉన్న చేపల దుకాణాలలో నిత్యం కుల్లిన చేపలను విక్రయిస్తూ లక్షలాదిస్తున్న అధికారులు అరాకొరగా తనిఖీలు నిర్వహించడం వల్లే విక్రయదారులు చెలరేగిపోతున్నారనే ఈరోజు జరిగిన సందర్భాలను బట్టి చెప్పక తప్పదు.. ఇప్పుడున్న సానిటరీ ఇన్స్పెక్టర్ బాలకృష్ణ తరువుగా ప్రజా ఆరోగ్య కఠినంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని వినికిడి. అందులో భాగంగానే మంగళవారం మాంసం దుకాణాలు చేపల దుకాణాలలో ప్రజా ఆరోగ్య సిబ్బందితో ముమ్మర తనిఖీలు చేపట్టారు. పునర్వినియోగం కానీ ప్లాస్టిక్ కవర్లను వాడరాదని విక్రయదారులను హెచ్చరించారు. ఇకపై కూలిన మాంసాన్ని గాని చేపలను గాని అమ్మితే కఠిన చర్యలు తప్పవని వ్యాపారస్తులను హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *