మన న్యూస్ సింగరాయకొండ:-

ప్రకాశం జిల్లా పాత సింగరాయకొండలోని శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడవ రోజు (08-06-2025, ఆదివారం) రాత్రి 8 గంటలకు హంస వాహన సేవను వైభవంగా నిర్వహించారు.ఈ సందర్భంగా స్వామివారు హంస వాహనంపై భక్తులకు దివ్య దర్శనమిచ్చారు. హంస వాహనం జ్ఞానాన్ని, పవిత్రతను బలంగా సూచిస్తుంది. ఈ వాహనంపై దర్శనమిచ్చే స్వామివారు భక్తులకు జ్ఞానోదయాన్ని ప్రసాదించనున్నారన్న విశ్వాసం ఉంది.వాహనం పుష్పాలతో, విద్యుత్ అలంకరణలతో అందంగా తీర్చిదిద్దారు. మంగళవాయిద్యాలు, వేద మంత్రోచ్ఛారణల నడుమ భక్తులు స్వామివారికి ఘనంగా హారతులు సమర్పించారు. విశేషంగా హాజరైన భక్తజనం స్వామివారి హంస వాహన దర్శనంతో మంత్రముగ్ధులయ్యారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *