

శ్రీకాళహస్తి, మన న్యూస్: వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి అవిశ్రాంతంగా కృషి చేసిన తొలితరం మహనీయులు, ప్రముఖ సంఘ సంస్కర్త, మహాత్మా జ్యోతిరావు పూలే నిఖార్శైన అభ్యుదయ వాది అని తెలుగుదేశం పార్టీ బిసి విభాగం నాయకులు కొనియాడారు.మహాత్మా జ్యోతీరావు పూలే జయంతిని పురస్కరించుకొని ఈరోజు తెలుగుదేశం పార్టీ బిసి విభాగం ఆధ్వర్యంలో స్ధానిక 18 వ వార్డు పరిధిలోని పూసల వీధి కూడలిలో పూలే చిత్రపటానికి పూజలు చేసి నివాళులు అర్పించి, అందరికీ స్వీట్లు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ,రాష్ట్ర అధికార ప్రతినిధి రెడ్డి వారి గురవారెడ్డి,రాష్ట్ర కార్యదర్శులు డా.జి.దశరధాచారి,గాలి చలపతి నాయుడు,వన్నియకుల క్షత్రియ సంక్షేమ మరియు అభివృద్ధి డైరెక్టర్ మిన్నల్ రవి, శ్రీకాళహస్తి పురపాలక సంఘం,18 వ వార్డు మాజీ కౌన్సిలర్ డా.నివేదిత మోరె,తెలుగుదేశం పార్టీ బిసి విభాగం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డా.యం.ఉమేష్ రావు,సాంస్కృతిక విభాగం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి నెమళ్ళూరు బుజ్జి,బిసి విభాగం నాయకులు పేట బాలాజీ రెడ్డి, దొరైరాజ్ రెడ్డి,నాగమల్లి దుర్గా ప్రసాద్,కన్నావరం హరిబాబు, మునిరాజా యాదవ్,శ్రీనివాసులు రెడ్డి,ఈశ్వర్ రెడ్డి,భాస్కర్ గౌడ్,కోట చంద్రశేఖర్,భాస్కర్, మణి,నాగరాజు,వినయ్,మురళి,సునీల్,శివ, కృష్ణమూర్తి,రామచంద్రయ్య,గురుమూర్తి, రమేష్,మురళి,వంశీ,రియాజ్,ముజీబ్, వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు.
