‘బాబు ష్యూరిటీ.. మోసం గ్యారెంటీ’ అన్నట్లుగా ఉంది! – వైఎస్ జగన్

Mana News :- గవర్నర్ ప్రసంగం, బడ్జెట్‌పై మాట్లాడటం కోసం మీడియా సమావేశం ఏర్పాటు చేయటం జరిగిందని మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ చెప్పారు. అసెంబ్లీలో ప్రతిపక్షం వర్షన్ వినిపించే అవకాశం లేకపోవటంతో.. తమ వైపు నుంచి ప్రజలకు వివరించటం కోసమే ఈ సమావేశం అని తెలిపారు. సీఎం చంద్రబాబు వచ్చాక రెండు బడ్జెట్లలో ప్రజలను మోసం చేయటం ప్రస్ఫుటంగా కనిపిస్తుందన్నారు. ఎన్నికల ముందు చెప్పినట్లుగా గాక.. ‘బాబు ష్యూరిటీ.. మోసం గ్యారెంటీ’ అన్నట్లుగా ఉందని ఎద్దేవా చేశారు. ఎన్నికలప్పుడు సూపర్ సిక్స్.. సూపర్ సెవెన్ అన్నారని విమర్శించారు. చంద్రబాబు, ఆయన దత్త పుత్రుడు ప్రతీ ఇంటికి కరపత్రాలు కూడా పంచారని జగన్ పేర్కొన్నారు. ‘అన్ని శాఖల కేటాయింపులు అరకొరగానే ఉన్నాయి. రెండు బడ్జెట్లలో అలాగే ఉన్నాయి. నిరుద్యోగులకు మూడు వేల నిరుద్యోగ భృతి అన్నారు. గత ఏడాది బడ్జెట్లో కూడా దాదాపు 7200 ఇవ్వాల్సిన భృతి ప్రస్తావన లేదు. ఈ ఏడాది కూడా భృతి ప్రస్తావన లేదు. బడ్జెట్లో గవర్నర్ ప్రసంగం తెలుగు కాపీలు అందరికీ పంపిణీ చేశారు. తొమ్మిది నెలల కాలంలోనే నాలుగు లక్షల ఉద్యోగాలు ఇచ్చినట్లు ప్రింట్ చేసి మరీ అందరికీ పంపిణీ చేశారు. ఆ బుక్ లో పచ్చి అబద్ధాలు రాశారు. గవర్నర్ గారి పేరుతో ప్రచురితమైన పుస్తకం.. బడ్జెట్ జరిగేటప్పుడే రెండవ సోషియో ఎకనామిక్ సర్వే అంటూ విడుదల చేశారు. 2024 -25 లో 27,07,752 ఉద్యోగాలు ఇచ్చేశామని రాసేశారు. ఇన్ని లక్షల ఉద్యోగాలు ఇచ్చేశామని సీఎం చంద్రబాబు దారుణంగా చెబుతున్నారు’ అని వైఎస్ జగన్ మండిపడ్డారు. ‘పిల్లలకు ఇప్పటికే 72 వేల రూపాయలు ఒక్కొక్కరికీ ఇవ్వాలి. దగ, మోసం, వంచన ఇలా అన్నీ చేశారు. ఒక్క ఉద్యోగం ఇవ్వకపోగా.. ఉన్న ఉద్యోగాలు మొత్తం వరుసపెట్టి పీకేస్తున్నారు. మా ప్రభుత్వం వచ్చిన నాలుగు నెలల్లో లక్షకు పైగా ఉద్యోగాలు కల్పించాం. ఆప్కాస్ ద్వారా మరో లక్షా ముప్పై వేల ఉద్యోగాలు, రెండు లక్షల మందికి పైగా వాలంటీర్లు, మా ఐదు సంవత్సరాల కాలంలో గవర్నమెంట్ ఉద్యోగాలు 6,31,310 ఉద్యోగాలు ఇచ్చాం. మేము చెప్పేది గారడీ లెక్కలు కాదు.. వీళ్ళ ప్రకారమే సోషియో ఎకనామిక్ సర్వేలోని డేటా ఇది. మొత్తంగా మా ఐదేళ్ల పాలనలో 40,13,552 ఉద్యోగాలు ఇచ్చినట్లు ఆధార్ నంబర్ తో సహా చెప్పగలం’ అని వైఎస్ జగన్ పేర్కొన్నారు.

Related Posts

సింగరాయకొండ మండలంలో అధికారులతో సమీక్షా సమావేశం

మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ రిపోర్టర్ పసుమర్తి జాలయ్య:- సింగరాయకొండ మండల ప్రజా పరిషత్ సమావేశ హాలులో బుధవారం మధ్యాహ్నం రెండు గంటలకు మండల ప్రత్యేక అధికారి అధ్యక్షతన సమీక్షా సమావేశం జరిగింది.ఈ సమావేశానికి మండల ప్రత్యేక అధికారి మరియు మత్స్య…

పాకల జడ్పీహెచ్ఎస్‌లో మహిళాభివృద్ధి శాఖ అవగాహన కార్యక్రమం

మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ, రిపోర్టర్ పసుమర్తి జాలయ్య :- సింగరాయకొండ మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ మిషన్ శక్తి పథకం అమల్లో భాగంగా, 10 రోజులపాటు నిర్వహిస్తున్న ప్రత్యేక అవగాహన కార్యక్రమాల (సంకల్ప)లో భాగంగా పాకల గ్రామం జడ్పీహెచ్ఎస్…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

సింగరాయకొండ మండలంలో అధికారులతో సమీక్షా సమావేశం

  • By JALAIAH
  • September 10, 2025
  • 2 views
సింగరాయకొండ మండలంలో అధికారులతో సమీక్షా సమావేశం

పాకల జడ్పీహెచ్ఎస్‌లో మహిళాభివృద్ధి శాఖ అవగాహన కార్యక్రమం

  • By JALAIAH
  • September 10, 2025
  • 3 views
పాకల జడ్పీహెచ్ఎస్‌లో మహిళాభివృద్ధి శాఖ అవగాహన కార్యక్రమం

మదర్ ల్యాండ్ సొసైటీ స్వచంద సంస్థ ఆధ్వర్యం హెచ్ ఐ వి/ ఎయిడ్స్ , మత్తు పదార్దాల వినియోగం పై అవగాహన కార్యక్రమం

  • By JALAIAH
  • September 10, 2025
  • 3 views
మదర్ ల్యాండ్ సొసైటీ స్వచంద సంస్థ ఆధ్వర్యం హెచ్ ఐ వి/ ఎయిడ్స్ , మత్తు పదార్దాల వినియోగం పై అవగాహన కార్యక్రమం

రసాయనక ఎరువుల వాడకాన్ని తగ్గిద్దాం నానో యూరియా ఎరువులను అలవాటు చేసుకుందాం..!

  • By JALAIAH
  • September 10, 2025
  • 4 views
రసాయనక ఎరువుల వాడకాన్ని తగ్గిద్దాం నానో యూరియా ఎరువులను అలవాటు చేసుకుందాం..!

నాయక్ పోడు కులస్థుల రాస్తారోకో…కుల ధ్రువీకరణ పత్రాలు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్న తహసీల్దార్..

  • By RAHEEM
  • September 10, 2025
  • 8 views
నాయక్ పోడు కులస్థుల రాస్తారోకో…కుల ధ్రువీకరణ పత్రాలు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్న తహసీల్దార్..

కొండేపి నియోజకవర్గంలో బాలినేని ప్రణీత్ రెడ్డి ఆధ్వర్యంలో 10 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ చెక్కులు పంపిణీ

  • By JALAIAH
  • September 10, 2025
  • 9 views
కొండేపి నియోజకవర్గంలో బాలినేని ప్రణీత్ రెడ్డి  ఆధ్వర్యంలో 10 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ చెక్కులు పంపిణీ