త్రీ స్టార్స్‌తో కోల్‌కతా కొత్త జెర్సీ

మన న్యూస్ :- మరో 18 రోజుల్లో ఐపీఎల్‌ 18వ ఎడిషన్‌ (IPL 2025) పోటీలు ప్రారంభం కానున్నాయి. ఛాంపియన్స్ ట్రోఫీ ముగిసిన రెండు వారాల్లోపే క్రికెట్ అభిమానులను సందడి చేయనుంది.కోల్‌కతా నైట్‌రైడర్స్, దిల్లీ క్యాపిటల్స్‌ మినహా మిగతా జట్లకు సారథి ఎవరనేది తేలిపోయింది. దిల్లీ మాత్రం కేఎల్ లేదా అక్షర్ పటేల్‌లో ఒకరిని కెప్టెన్‌గా నియమించే అవకాశం లేకపోలేదు. మరోవైపు కేకేఆర్‌ మాత్రం ఇంకా ఎటూ తేల్చుకోలేకపోతోంది. ఈక్రమంలో తమ జట్టు కొత్త జెర్సీని కోల్‌కతా(Kolkata Knight Riders) ఆవిష్కరించింది. జెర్సీపై మూడు స్టార్లకు చోటు కల్పించింది. ఈమేరకు సోషల్‌మీడియాలో స్పెషల్ వీడియోను కేకేఆర్‌ పోస్టు చేసింది.”జెర్సీ మీద మేం మూడు స్టార్లకు స్థానం కల్పించాం. కేకేఆర్‌ మూడు టైటిళ్లను సొంతం చేసుకుంది. మే 27, 2012, జూన్ 1, 2014, మే 26, 2024న మేం విజేతలుగా నిలిచాం. మిథున రాశి రోజునే ఇవన్నీ జరిగాయి. చివరిగా వచ్చిన మూడో స్టార్ మమ్మల్ని మళ్లీ అగ్రస్థానానికి చేర్చింది. ఈసారి కూడా అదే ఉత్సాహం ప్రదర్శిస్తాం. మూడు టైటిళ్లకు కర్బో, లోర్బో, జీత్బో అని నామకరణం చేశాం. బెంగాలీ పదాలైన వీటికి ప్రదర్శన, పోరాటం, గెలుపు అని అర్థం. ఇది కేవలం మా ఉద్దేశం మాత్రమే కాకుండా.. ఛాంపియన్‌ వారసత్వాన్ని కొనసాగించేందుకు స్ఫూర్తిగా నిలుస్తాయి” అని కేకేఆర్ చీఫ్‌ మార్కెటింగ్‌ ఆఫీసర్ బిందా దే వెల్లడించారు.కెప్టెన్‌ ఎవరో..?:- డిఫెండింగ్‌ ఛాంపియన్‌కు సారథి ఎవరనేది చిక్కు ప్రశ్నగా మారింది. గత ఐపీఎల్‌ టైటిల్‌ను అందించిన శ్రేయస్‌ అయ్యర్‌ను మేనేజ్‌మెంట్ రిటైన్ చేసుకోలేదు. మెగా వేలంలోనూ తీసుకోలేదు. యువ బ్యాటర్ వెంకటేశ్‌ అయ్యర్‌కు భారీ మొత్తం వెచ్చించింది. అనూహ్యంగా వెటరన్ ఆటగాడు అజింక్యా రహానెను తీసుకుంది. రింకు సింగ్‌ కూడా కెప్టెన్సీ రేసులో ఉన్నాడు. కానీ, వెంకటేశ్‌ లేదా రహానెలో ఒకరికి సారథ్యం అప్పగించే అవకాశం ఉందనే వార్తలు వస్తున్నాయి. కొత్త సీజన్‌కు మరిన్ని రోజులు కూడా లేకపోవడంతో కేకేఆర్‌ నిర్ణయం ఎలా ఉంటుందోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Related Posts

రాష్ట్ర స్థాయి ఓపెన్ అండర్ 13, 15 టోర్నమెంట్ లో అద్భుతంగా రాణించిన మణికొండ మ్యాచ్ పాయింట్ అకాడమీ క్రీడాకారులు

నాగోల్ మన న్యూస్ ;- తెలంగాణ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పిజెఆర్ జిహెచ్ఎంసి ఇండోర్ స్టేడియంలో రాష్ట్ర స్థాయి ఓపెన్ అండర్ 13, అండర్ 15 టోర్నమెంట్ లో మణికొండ మ్యాచ్ పాయింట్ కు చెందిన బ్యాడ్మింటన్ ప్లేయర్స్ తమ సత్తా…

సమ్మర్ క్రికెట్ టోర్నమెంట్ విజేతగా పెద్ద తయ్యూరు జట్టు

మన న్యూస్,ఎస్ఆర్ పురం:-సమ్మర్ క్రికెట్ టోర్నమెంట్ విజేతగా పెద్ద తయ్యూరు జట్టు విజేతగా నిలిచి 40 వేల రూపాయలు గెలుపు పొందడం జరిగింది. ఎస్ఆర్ పురం మండలం u.m. పురం గ్రామంలో నిర్వహించిన సమ్మర్ క్రికెట్ టోర్నమెంట్లో యు.ఎం. పురం క్రికెట్…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

అమరావతి రాజధాని మహిళల పట్ల సాక్షి ఛానల్ లో మాట్లాడిన మాటలను ఖండించాలి.

అమరావతి రాజధాని మహిళల పట్ల సాక్షి ఛానల్ లో మాట్లాడిన మాటలను ఖండించాలి.

కావలిలో టిడిపికి మద్దతు పలికిన జనిగర్ల మహేంద్ర యాదవ్

రాబోయే కాలంలో నారా లోకేష్ ముఖ్యమంత్రి అవ్వడం ఖాయం… కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకటకృష్ణారెడ్డి

రాబోయే కాలంలో నారా లోకేష్ ముఖ్యమంత్రి అవ్వడం ఖాయం… కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకటకృష్ణారెడ్డి

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేతుల మీదుగా విజయవాడలో ‘సెలూన్ కొనికి’ లాంచ్

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేతుల మీదుగా విజయవాడలో ‘సెలూన్ కొనికి’ లాంచ్

AP ప్రాక్టిసింగ్ అడ్వకేట్స్ వెల్ఫేర్ సొసైటీ నూతన కార్యవర్గ ప్రెసిడెంట్ గా పిఠాపురం న్యాయవాది బొలిశెట్టి గౌరిమణి.

AP ప్రాక్టిసింగ్ అడ్వకేట్స్ వెల్ఫేర్ సొసైటీ నూతన కార్యవర్గ ప్రెసిడెంట్ గా పిఠాపురం న్యాయవాది బొలిశెట్టి గౌరిమణి.

ఎండియు వాహనాలను కొనసాగించాలి, సిఐటియు నాయకుడు కోరాడ ఈశ్వరరావు

ఎండియు వాహనాలను కొనసాగించాలి, సిఐటియు నాయకుడు కోరాడ ఈశ్వరరావు