అమెరికా వ్యవసాయోత్పత్తులపై చైనా గురి: గ్లోబల్‌ టైమ్స్‌ వెల్లడి

Mana News :- అమెరికా టారిఫ్‌లకు ప్రతి స్పందించేందుకు చైనా కూడా సిద్ధమైనట్లు గ్లోబల్‌ టైమ్స్‌ పత్రిక వెల్లడించింది. ఫెంటనిల్‌ ఎగుమతులకు ప్రతిగా తాము బీజింగ్‌పై అదనపు సుంకాలు విధిస్తున్నట్లు వాషింగ్టన్‌ గతంలో పేర్కొంది. దీనికి ప్రతిగా జిన్‌పింగ్‌ సర్కారు అమెరికా ఉత్పత్తులపై టారిఫ్‌లు, టారిఫేతర చర్యలకు కూడా సిద్ధమైంది. చైనా టార్గెట్‌లో అమెరికా వ్యవసాయ, ఆహారోత్పత్తులు ఉండే అవకాశం ఉందని గ్లోబల్‌ టైమ్స్‌ పేర్కొంది. అమెరికా ఏకపక్షంగా వ్యవహరించి టారిఫ్‌లు, ఇతర చర్యలు చేపడితే.. బీజింగ్‌ బలంగా ప్రతిస్పందిస్తుందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించినట్లు గ్లోబల్‌ టైమ్స్‌ కథనంలో పేర్కొంది. గత గురువారం ట్రంప్‌ సోషల్‌మీడియా వేదికగా స్పందిస్తూ.. మెక్సికో, కెనడాపై మార్చి 4వ తేదీ నుంచి అదనపు సుంకాలు విధిస్తున్నామని వెల్లడించారు. అదే సమయంలో చైనాపై కూడా 10శాతం టారిఫ్‌లు అమల్లోకి వస్తాయని చెప్పారు. దీనిని జిన్‌పింగ్‌ కార్యవర్గంలోని పలువురు మంత్రులు తీవ్రంగా వ్యతిరేకించారు. బీజింగ్‌లోని వాణిజ్యశాఖ కార్యదర్శి స్పందిస్తూ.. ”చైనా మత్తుపదార్థాలను నిర్మూలించేందుకు విధానపరంగా, నిర్ణయాల అమలులో కఠినంగా ఉంటోంది. ఇందుకోసం అమెరికా సహా అన్ని దేశాలతో కలిసి పనిచేస్తోంది. అమెరికా తన తప్పును పునరావృతం చేయదని ఆశిస్తున్నాం. సంప్రదింపుల మార్గంలో అభిప్రాయభేదాలను పరిష్కరించుకొంటుందని ఆశిస్తున్నాం. అమెరికా తాను అనుకొన్న మార్గంలో వెళితే మాత్రం.. చైనా తన ప్రయోజనాలను కాపాడుకొనేందుకు తగినవిధంగా ప్రతిచర్యలు తీసుకొంటుంది” అని వెల్లడించారు. ‘టారిఫ్‌ ఒత్తిడిలు, బ్లాక్‌మెయిల్‌ కోసం ఫెంటనిల్‌ అంశాన్ని అమెరికా వాడుకుంటోంది. ఈ పరిణామాలు తీవ్ర ప్రభావం చూపడమే కాకుండా, ఒత్తిడి, నిర్బంధం, మాదకద్రవ్యాల నియంత్రణలో ఇరుదేశాల మధ్య చర్చలు, సంప్రదింపులకు ముప్పుగా మారుతుంది” అని చైనా విదేశాంగశాఖ అధికార ప్రతినిధి లిన్‌ జియాంగ్‌ పేర్కొన్నారు. అమెరికాతో ఏ వాణిజ్య విభేదాలు వచ్చినా.. బీజింగ్‌ ముందు ఆ దేశ వ్యవసాయరంగాన్ని లక్ష్యంగా చేసుకొంటుంది. 2018 వరకు అమెరికా వ్యవసాయోత్పత్తులకు చైనా అతిపెద్ద మార్కెట్‌గా ఉంది. అప్పట్లో బీజింగ్‌ సోయాబీన్‌, బీఫ్‌, పోర్క్‌, గోధుమ, మొక్కజొన్న వంటి వాటిపై 25శాతం సుంకాలు విధించింది. దీంతో మెల్లగా ఆ మార్కెట్‌పై అమెరికా పట్టు కోల్పోతూ వస్తోంది. ఇక 2024లో అమెరికా నుంచి 29.25 బిలియన్‌ డాలర్ల విలువైన ఉత్పత్తులను చైనా కొనుగోలు చేసింది. అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఇది 14శాతం తక్కువ.

Related Posts

ఎండియు వాహనాలు కొనసాగించాలని డ్రైవర్ల ఆందోళన

గొల్లప్రోలు మే 24 మన న్యూస్ :– రాష్ట్ర ప్రభుత్వం ప్రజా పంపిణీకి వినియోగించే ఎండియు వాహనాలను తొలగించడంపై డ్రైవర్లు గురువారం గొల్లప్రోలు ఎంపీడీవో కార్యాలయం వద్ద ఆందోళన నిర్వహించారు.ఎండియు వాహనాలను రద్దు చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడంపై గొల్లప్రోలు పట్టణ,మండల…

ఐక్యరాజ్యసమితిలో పాకిస్థాన్‌ను నోరు మెదపకుండా చేసిన భారత్..!

Mana News :- పాకిస్తాన్‌ను మరోసారి ఐక్యరాజ్యసమితిలో నోరు మెదపకుండా చేసింది భారతదేశం. జమ్మూ కాశ్మీర్ అంశాన్ని పదే పదే లేవనెత్తడం వల్ల ప్రపంచం ముందు అవమానాన్ని ఎదుర్కోవలసి వస్తుంది. అయినప్పటికీ తన కార్యకలాపాలను ఆపాడంలేదు. జమ్మూ కాశ్మీర్ గురించి మాట్లాడుతూనే…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

ఎండియు వాహనాలను కొనసాగించాలి, సిఐటియు నాయకుడు కోరాడ ఈశ్వరరావు

ఎండియు వాహనాలను కొనసాగించాలి, సిఐటియు నాయకుడు కోరాడ ఈశ్వరరావు

సిసి రోడ్డు ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా రాగుల వెంకటేశ్వర్ రెడ్డి

సిసి రోడ్డు  ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా రాగుల వెంకటేశ్వర్ రెడ్డి

వి వి సి టాటా సేల్స్ అండ్ సర్వీస్ ప్రారంభం

వి వి సి టాటా సేల్స్ అండ్ సర్వీస్ ప్రారంభం

యూని కిడ్స్ ఫ్రీ స్కూల్ ను ప్రారంభించిన మర్రి నిరంజన్ రెడ్డి

యూని కిడ్స్ ఫ్రీ స్కూల్ ను ప్రారంభించిన మర్రి నిరంజన్ రెడ్డి

చీటింగ్ చేసిన ఓ వ్యక్తి అరెస్ట్

చీటింగ్ చేసిన ఓ వ్యక్తి అరెస్ట్

ఏబికేఎంఎస్ – 1897 జాతీయ అధ్యక్షులు మనీష్ కుమార్ సింగ్ కు ఘన సన్మానం – ఏపీ అధ్యక్ష కార్యదర్శులు చంద్రశేఖర్ రాజు, కోనేటి రవిరాజు లచే సత్కారం

ఏబికేఎంఎస్ – 1897 జాతీయ అధ్యక్షులు మనీష్ కుమార్ సింగ్ కు ఘన సన్మానం – ఏపీ అధ్యక్ష కార్యదర్శులు చంద్రశేఖర్ రాజు, కోనేటి రవిరాజు లచే సత్కారం