పంచాయతీ ఎన్నికల బందోబస్తు నిర్వహణలో పోలీసుల సేవలు ప్రశంసనీయం.

మన ధ్యాస, నారాయణ పేట జిల్లా: నారాయణపేట జిల్లా కోస్గి, గుండుమల్, మద్దూర్, కొత్తపల్లి మండలాల పరిధిలో జరుగుతున్న గ్రామపంచాయతీ మొదటి విడత ఎన్నికల సందర్భంగా పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తుతో పాటు ప్రజలకు సహాయం చేస్తూ పోలీసులు తమ సేవలను మరింత విస్తరించారు.ఎన్నికల కోసం పోలింగ్ కేంద్రాలకు వచ్చిన వృద్ధ, వికలాంగ ఓటర్లు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఉండేందుకు పోలీసులు ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. కర్రలు పట్టుకుని నెమ్మదిగా వచ్చేవారికి చేయి పట్టుకొని సహాయం చేయడం, వీల్‌చైర్‌పై వచ్చిన వికలాంగులను బూత్ వరకు తీసుకెళ్లడం, నీళ్లు అందించడం, క్యూలో నిలబడలేని వారికి ముందుగా సహాయం చేసేలా మార్గనిర్దేశం చేయడం వంటి సేవాభావంతో విధులు నిర్వహిస్తున్నారు.జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ ఆదేశాల మేరకు సిబ్బంది చురుకుగా వ్యవహరిస్తూ, శాంతియుత మరియు నిష్పక్షపాత ఎన్నికల నిర్వహణకు కట్టుబడి ఉన్నారు. ఎన్నికల విధుల్లో పాటించాల్సిన కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌ను పూర్తి స్థాయిలో పాటిస్తూ, ప్రజలు ఎటువంటి భయం లేదా ఒత్తిడి లేకుండా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా అన్ని చర్యలు చేపట్టారు.వృద్ధులు, వికలాంగులకు పోలీసుల ఈ సేవలు స్థానిక ప్రజల ప్రశంసలు అందుకుంటున్నాయి. ఎన్నికల రోజున బందోబస్తుతో పాటు మానవతా సేవలందించడం ద్వారా పోలీసులు ప్రజలకు చేరువైన సేవాస్ఫూర్తిని మరొకసారి చాటిచెప్పారు.

Related Posts

ఎన్నికల విధుల పట్ల నిర్లక్ష్యం,74 మందికి షోకాజ్ నోటీసులు జారీ చేసిన జిల్లా కలెక్టర్ సిక్త పట్నాయక్.

మన ధ్యాస నారాయణ పేట జిల్లా: ఎన్నికల విధుల పట్ల నిర్లక్ష్యం వహించి గైర్హాజరు అయిన 74 మంది ఎన్నికల సిబ్బందికి గురువారం షోకాస్ నోటీసులు జారీ చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి/జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ తెలిపారు. గురువారం జరిగిన…

విజయోత్సవ ర్యాలీలు పూర్తిగా నిషేధం: ఎస్పీ డాక్టర్ వినీత్.

మన ధ్యాస, నారాయణ పేట జిల్లా: ఎన్నికల ప్రక్రియ మొత్తం మూడు దశలు పూర్తిగా ముగిసే వరకు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (MCC) పూర్తి స్థాయిలో అమల్లోనే ఉంటుందని నారాయణపేట జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ తెలిపారు.మొదటి దశలో నారాయణపేట…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

ఎన్నికల విధుల పట్ల నిర్లక్ష్యం,74 మందికి షోకాజ్ నోటీసులు జారీ చేసిన జిల్లా కలెక్టర్ సిక్త పట్నాయక్.

ఎన్నికల విధుల పట్ల నిర్లక్ష్యం,74 మందికి  షోకాజ్ నోటీసులు జారీ చేసిన  జిల్లా కలెక్టర్ సిక్త పట్నాయక్.

విజయోత్సవ ర్యాలీలు పూర్తిగా నిషేధం: ఎస్పీ డాక్టర్ వినీత్.

విజయోత్సవ ర్యాలీలు పూర్తిగా నిషేధం: ఎస్పీ డాక్టర్ వినీత్.

పంచాయతీ ఎన్నికల బందోబస్తు నిర్వహణలో పోలీసుల సేవలు ప్రశంసనీయం.

పంచాయతీ ఎన్నికల బందోబస్తు నిర్వహణలో పోలీసుల సేవలు ప్రశంసనీయం.

ఎలక్షన్ సరళి, పోలీసు బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించిన: జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్.

ఎలక్షన్ సరళి, పోలీసు బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించిన: జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్.

ప్రతి విద్యార్ది ఉన్నత శిఖరాలకు చేరుకోవాలి. డి సునీత

ప్రతి విద్యార్ది ఉన్నత శిఖరాలకు చేరుకోవాలి. డి సునీత

ఏలేశ్వరం గురుకుల పాఠశాలలో మట్టి నమూనా సేకరణ పరీక్ష ల పై అవగాహన

ఏలేశ్వరం గురుకుల పాఠశాలలో మట్టి నమూనా సేకరణ పరీక్ష ల పై అవగాహన