ఆదివాసి ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది…డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్

మన న్యూస్,తిరుపతి:
రాష్ట్రంలోని ఆదివాసీ ప్రాంతాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర హస్తకళల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ చెప్పారు. శనివారం ప్రపంచ ఆదివాసి దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏర్పాటుచేసిన సభలో జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ తో పాటు రాష్ట్ర హస్తకళల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఆదివాసీల సంక్షేమానికి ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎనలేని కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ ఇటీవల పలు సంక్షేమ కార్యక్రమాలను ఆదివాసీల కోసం ప్రారంభించారని గుర్తు చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు రవాణా సౌకర్యాలు లేని ఎన్నో ఆదివాసి గ్రామాలకు రహదారి సదుపాయాలు కల్పించేందుకు ప్రత్యేక ప్రణాళికలను రూపొందించారు అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సహకారంతో ఆయా ఆదివాసి ప్రాంతాలకు రహదారుల పనులు ప్రారంభమయ్యాయి అని చెప్పారు. వర్షాకాలం, శీతాకాలంలలో ఆదివాసీలు ఎదుర్కొంటున్న కష్టాలను గుర్తించి వారికి కావాల్సిన అన్ని మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఇటీవల ఆదివాసి కుటుంబాలకు ఉచితంగా పాదరక్షలు పంపిణీ చేయడం జరిగిందన్నారు. ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన సొంత నిధులతో పాదరక్షలు పంపిణీ చేశారని పేర్కొన్నారు. ఆదివాసీల జీవనోపాధి సంస్కృతి అభివృద్ధికి కట్టుబడి ఉన్న పవన్ కళ్యాణ్ స్థానికంగా తయారు చేసే వస్తువులు హస్తకళలకు సరైన ధరలు రావాలని అందుకు తాము అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామన్నారు. శ్రీకాకుళంలో ఇటీవల జరిగిన ఒక కార్యక్రమంలో స్వయంగా ఆదివాసి చిత్రికలను ప్రోత్సహించారన్నారు. ఈ కార్యక్రమంలో యాదవ్ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్, గిరిజన సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు. అంతకుముందు ఆదివాసి మహిళలు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.

Related Posts

ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఒన్ సైడ్ గా గెలిపించండి

సూపర్ సిక్స్ విజయోత్సవ వేదికగా ఆటో డ్రైవర్లకు  కానుక దసరాకు ఆటో డ్రైవర్లకు రూ.15వేల ఆర్ధిక సాయం చేస్తామని ప్రకటించిన సీఎం రప్పారప్పా అంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరిక వైసీపీ నాయకుడిది దృతరాష్ట్ర కౌగిలి అని ఎద్దేవా చేసిన ముఖ్యమంత్రి  సీమ…

వాతావరణ మార్పుల ప్రభావం–ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి: శివ కిషోర్

ఉరవకొండ మన ధ్యాస: వజ్రకరూరు మండల కేంద్రంలోని స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బుధవారం క్లైమేట్ కేర్ ఛాంపియన్స్ ప్రోగ్రాం (స్వస్తి ) బృందం తనిఖీ చేశారు. శివ కిషోర్ స్టేట్ ప్రోగ్రాం మేనేజర్, డాక్టర్ తన్మయి మేనేజర్ వేదిక అసోసియేట్…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

  • By NAGARAJU
  • September 10, 2025
  • 2 views
దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్ సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

  • By NAGARAJU
  • September 10, 2025
  • 3 views
అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్  సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఒన్ సైడ్ గా గెలిపించండి

ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఒన్ సైడ్ గా గెలిపించండి

ఎన్నికల్లో హామీలు ఇచ్చాం ఎన్ని కష్టాలు వచ్చినా తీర్చాం.

ఎన్నికల్లో హామీలు ఇచ్చాం ఎన్ని కష్టాలు వచ్చినా తీర్చాం.

వాతావరణ మార్పుల ప్రభావం–ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి: శివ కిషోర్

వాతావరణ మార్పుల ప్రభావం–ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి: శివ కిషోర్

ఉపరాష్ట్రపతి ఎన్నిక కేవలం వ్యక్తి ఎన్నిక కాదు

ఉపరాష్ట్రపతి ఎన్నిక కేవలం వ్యక్తి ఎన్నిక కాదు