

మన న్యూస్ సాలూరు జూలై 12:- సాలూరు మండలంలోని బాగువలస గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వీకే యూనివర్సల్ ఫ్యామిలీ ఫౌండేషన్ సంస్థ చేపట్టిన కార్యక్రమంలో మంత్రి సంధ్యారాణి పాల్గొన్నారు . అనంతరం విద్యార్థులకు 20 సైకిళ్లను పంపిణీ చేశారు. ఈ సంస్థ మన్యం జిల్లాకు 3లక్షల వ్యయంతో 40 సైకిళ్లను పంపిణీ చేసారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రతినెల జరిగే పోటీ పరీక్షల్లో 80 శాతం దాటిన విద్యార్థులకు ప్రతి ఒక్కరికి వెయ్యి రూపాయలు చొప్పున వారి ఖాతాల్లో జమ చేయనున్నట్లు ఈ సంస్థ ప్రకటించింది అన్నారు అలాగే ఐఐటి ఎన్ఐటి పోటీ పరీక్షల్లో ప్రతిభ కనబరిచిన వారికి ఉచిత విద్య ఏర్పాటు చేస్తారని అన్నారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం మా ప్రభుత్వం తో పాటు స్వచ్ఛంద సంస్థలు కూడా ముందుకు వస్తున్నాయన్నారు. అనంతరం సూపర్ పాలనలో తొలి అడుగు 4.1 లో పాల్గొని ఆ గ్రామంలో ఉన్న ప్రతి గడపకు వెళ్లి ఈ ఏడాది కాలంలో కూటమి ప్రభుత్వం అందించే సంక్షేమాలు అందరికీ అందుతున్నాయా లేదో అడిగి తెలుసుకున్నారు అలాగే మీ గ్రామ అభివృద్ధి ఎలా జరిగిందని అన్నారు. ఆ గ్రామ సమస్యల గురించి అడిగి తెలుసుకుని నివారించాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. వైసీపీ నాయకులు శివరాంపురం బ్రిడ్జి పనులను ఎందుకు చేయించలేకపోయారన్నారు. కూటమి ప్రభుత్వ వచ్చిన వెంటనే శివరాంపురం బ్రిడ్జి పనులు చేయిస్తున్నామన్నారు. వైసీపీ నాయకులు విమర్శలు మాని అభివృద్ధికి సహకరించాలని కోరారు. మహిళని చూడకుండా ప్రశాంతి రెడ్డిపై ప్రసన్నకుమార్ విమర్శలు చేయడం తగదని బహిరంగంగా క్షమాపణ చెప్పాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
