లంకల గ్రామాన్ని సందడిగా మార్చిన చిన్న పీర్ల ఉత్సవాలు

నారాయణపేట జిల్లా మన న్యూస్ :- నర్వ మండలంలోని లంకల గ్రామంలో 10 రోజులపాటు జరుపుకునే మొహర్రం (చిన్న పీర్ల) మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి.కులమతాలకు అతీతంగా జరిగే ఈ వేడుకలు గ్రామాన్ని పండుగ వాతావరణంలో ముంచెత్తుతున్నాయి. ఉమ్మడి జిల్లాలతోపాటు తెలుగు రాష్ట్రాలు, కర్నాటక నుంచి భక్తులు వేల సంఖ్యలో తరలివస్తున్నారు.ఈ సంవత్సరం మొహర్రం వేడుకల్లో భాగంగా జులై 16 న (బుధవారం) రాత్రి సవారి, జులై 17 న (గురువారం) పగలు సవారి నిర్వహించనున్నట్టు నిర్వాహకులు తెలిపారు. పీర్ల జాతర సందర్భంగా గ్రామంలో ప్రత్యేక అలంకరణలు, భక్తి కార్యక్రమాలు, నినాదాలతో ఊరంతా సందడిగా మారింది.ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా అన్నదాన కార్యక్రమాలు, మతపరమైన చాటుపాటులు, సంప్రదాయ తూర్యనాదాల నడుమ పీర్ల ఊరేగింపు కన్నుల పండువగా కొనసాగనుంది. శాంతియుత వాతావరణంలో సాగే ఈ పండుగకు అధికారులు కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

Related Posts

దత్తాత్రేయ దేవాలయంలో ఘనంగా గురు పౌర్ణమి వేడుకలు.

మన న్యూస్, నారాయణ పేట జిల్లా : పరిధిలోని మక్తల్ మండలం కర్ని గ్రామంలో గురు పౌర్ణమి వేడుకలను శ్రీ మారుతీ దత్తాత్రేయ దేవాలయంలో ఘనంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు బ్రహ్మచారి అయినటువంటి గురువు స్వామివారిని శాలువా పూలమాలతో సత్కరించి అనంతరం…

మానవపాడు గ్రామంలో అంగరంగ వైభవంగా నిర్వహించిన మౌలాలీ స్వామి పీర్ల మొహార్రం వేడుకలలో పాల్గొన్న గ్రామ ప్రజలు

గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి జులై 10 :- జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలకేంద్రంలోని మౌలాలీ స్వామి పీర్ల మొహార్రం సందర్భంగా గ్రామ ప్రజలు కుల ,మతం, భేదాలు లేకుండా అందరూ కలిసిమెలసి మౌలాలీ స్వామి పీర్ల మొహార్రానికీ గ్రామ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

టి బి ముక్త భారత్ కి ప్రతి ఒక్కరు సహకరించాలి.అనుమానం రాగానే వైద్య సేవలు పొందాలి.ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ వైద్యాధికారి ధీరేంద్ర పిలుపు

టి బి ముక్త భారత్ కి ప్రతి ఒక్కరు సహకరించాలి.అనుమానం రాగానే వైద్య సేవలు పొందాలి.ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ వైద్యాధికారి ధీరేంద్ర పిలుపు

ఘనంగా కొండేపి నియోజకవర్గం వైసీపీ కార్యకర్తల సమావేశం

ఘనంగా కొండేపి నియోజకవర్గం వైసీపీ కార్యకర్తల సమావేశం

మీ ప్రాణం మీ భద్రత .ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి సురక్షిత ప్రయాణం చేయాలి .ఎస్సై నాగమల్లేశ్వర రావు పిలుపు.

మీ ప్రాణం మీ భద్రత .ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి సురక్షిత ప్రయాణం చేయాలి .ఎస్సై నాగమల్లేశ్వర రావు పిలుపు.

కూటమి పాలనలో అర్హులైన వారందరికీ సూపర్ సిక్స్ పథకాలు…

కూటమి పాలనలో  అర్హులైన వారందరికీ సూపర్ సిక్స్ పథకాలు…

ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించిన ఆర్ధిక మంత్రి పయ్యావుల కేశవ్.

ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించిన ఆర్ధిక మంత్రి పయ్యావుల కేశవ్.

మంత్రి కేశవ -కాలువ అభివృద్ధి పనుల పరిశీలన.

మంత్రి కేశవ -కాలువ అభివృద్ధి పనుల పరిశీలన.