శాకాంబరిదేవి అమ్మవారి సేవలో పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్..

మన న్యూస్ ఐరాల జులై-10:- కాణిపాకం స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానం అనుబంధ ఆలయమైన మకరధాంభిక సమేత శ్రీ మణికంఠేశ్వర స్వామి ఆలయంలో ఆషాఢ పౌర్ణమిని పురస్కరించుకుని శాకాంబరి దేవి అమ్మవారికి ప్రత్యేక పూజలు శోభాయమానంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మకరధాంభిక అమ్మవారు శాకాంబరి దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. శాకాంబరి దేవి అమ్మవారిని 20 టన్నుల పండ్లు, ఆకుకూరలు, కూరగాయలతో అమ్మవారికి విశేషంగా ఆలయ అర్చకులు అలంకరించారు. ఈ పర్వదినం సందర్భంగా పూతలపట్టు శాసనసభ్యులు డాక్టర్  కలికిరి మురళీమోహన్ ఆలయానికి విచ్చేసి అమ్మవారికి పూజా సామగ్రి సమర్పించి, అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీస్సులు అందుకున్నారు. అనంతరం ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక హోమాది కార్యక్రమాల్లో ఆయన పాల్గోన్నారు. అనంతరం ఆలయ వేద పండితులు ఎమ్మెల్యేకి వేదాశీర్వచనం అందించి అమ్మవారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పవిత్ర ఆషాఢ పౌర్ణమి సందర్భంగా కాణిపాకం మకరధాంభిక సమేత శ్రీ మణికంఠేశ్వర స్వామి ఆలయంలో 20 టన్నుల కూరగాయలు, పండ్లు, ఆకుకూరలతో అలంకరించిన శాకాంబరి దేవి అలంకారాన్ని దర్శించడం నిజంగా ఒక ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించిందన్నారు. శాకాంబరి దేవి అమ్మవారికి ప్రత్యేకపూజలు నిర్వహించడం పుణ్యఫలంగా భావిస్తున్నాని, అమ్మవారి ఆశీస్సులతో పూతలపట్టు నియోజకవర్గం అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని కోరుకున్నట్లు ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాణిపాకం ఆలయ ఈవో పెంచల కిషోర్, పూతలపట్టు నియోజకవర్గం పరిశీలకులు బొమ్మన శ్రీధర్, రాష్ట్ర కార్యదర్శి వెంకటేష్ చౌదరి, ఐరాల మండల అధ్యక్షులు గంగారపు హరిబాబు నాయుడు, బంగారుపాళ్యం మండల అధ్యక్షులు ఎన్.పి.ధరణీ నాయుడు, కాణిపాకం మాజీ ఆలయ ఛైర్మన్ మణినాయుడు, మాజీ జెడ్పీటీసీ లతా బాబునాయుడు, నాయకులు గోపి యాదవ్, మద్దిపాట్లపల్లె చౌదరి, జైకుమార్, సొప్పా నాని తదితరులు పాల్గోన్నారు.

Related Posts

చల్లగా చూడవయ్యా..కరుణను చూపవయ్యా..కావాగారవయ్య శ్రీ సాయిబాబా.!సాయిబాబా మందిరంలో ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ప్రత్యేక పూజలు.!!

వరికుంటపాడు,,మనన్యూస్: గురు పౌర్ణమిని పురస్కరించుకొని ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ మండల కేంద్రంలోని వరికుంటపాడు గ్రామంలో శ్రీ సాయిబాబా మందిరంలో ఉదయగిరి నియోజకవర్గ ప్రజలను చల్లగా చూడాలని, కరుణా కటాక్షాలు కలగాలని, వేగంగా పనులు జరగాలని ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు.…

పిల్లల బంగారు భవిష్యత్తు కోసం.. బడివైపు ఒక అడుగు..!లక్ష్యం ఉంటే పేదరికం చదువుకు అడ్డు కాదు..మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 2.0 లో ఎమ్మెల్యే కాకర్ల సురేష్..!

కలిగిరి, మన న్యూస్ : పిల్లల బంగారు భవిష్యత్తు కోసం. బడివైపు ఒక అడుగు పేరుతో రాష్ట్రవ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ 2.0 కార్యక్రమం ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో విద్యాశాఖ మంత్రి శ్రీ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

చల్లగా చూడవయ్యా..కరుణను చూపవయ్యా..కావాగారవయ్య శ్రీ సాయిబాబా.!సాయిబాబా మందిరంలో ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ప్రత్యేక పూజలు.!!

చల్లగా చూడవయ్యా..కరుణను చూపవయ్యా..కావాగారవయ్య శ్రీ సాయిబాబా.!సాయిబాబా మందిరంలో ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ప్రత్యేక పూజలు.!!

పిల్లల బంగారు భవిష్యత్తు కోసం.. బడివైపు ఒక అడుగు..!లక్ష్యం ఉంటే పేదరికం చదువుకు అడ్డు కాదు..మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 2.0 లో ఎమ్మెల్యే కాకర్ల సురేష్..!

పిల్లల బంగారు భవిష్యత్తు కోసం.. బడివైపు ఒక అడుగు..!లక్ష్యం ఉంటే పేదరికం చదువుకు అడ్డు కాదు..మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 2.0 లో ఎమ్మెల్యే  కాకర్ల సురేష్..!

ఒకే మహిళకు రెండు మరణ ధృవీకరణ పత్రాలు.. ఉరవకొండలో అధికారుల నిర్లక్ష్యం బయటపడింది

ఒకే మహిళకు రెండు మరణ ధృవీకరణ పత్రాలు.. ఉరవకొండలో అధికారుల నిర్లక్ష్యం బయటపడింది

గురువే దైవం: ఉరవకొండలో గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు

గురువే దైవం: ఉరవకొండలో గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు

రెల్లివలసలో అగ్రిఫీల్డ్స్ ఉచిత ఆరోగ్య శిబిరం మరియు పాఠశాల క్రీడా దినోత్సవాన్ని నిర్వహిస్తుంది

రెల్లివలసలో అగ్రిఫీల్డ్స్ ఉచిత ఆరోగ్య శిబిరం మరియు పాఠశాల క్రీడా దినోత్సవాన్ని నిర్వహిస్తుంది

పేరెంట్స్ డే సందర్భంగా బింగినపల్లిలో పాఠశాల అభివృద్ధి కార్యక్రమాలు

పేరెంట్స్ డే సందర్భంగా బింగినపల్లిలో పాఠశాల అభివృద్ధి కార్యక్రమాలు