

సూపర్ సిక్స్ పథకాల అమలు పై ప్రజల్లో హర్షం వ్యక్తమవుతోంది- సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు, జీడీ నెల్లూరు ఎమ్మెల్యే డాక్టర్ థామస్
ఎస్ఆర్ పురం, మన న్యూస్…కూటమి ప్రభుత్వ సూపరిపాలనతో పల్లె ప్రాంతాలు ప్రశాంతంగా ఉన్నాయని చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాదరావు.., గంగాధర నెల్లూరు శాసనసభ్యులు డాక్టర్ థామస్ అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి పాలనా దక్షతను ప్రజలు మెచ్చుకుంటున్నారనీ వారు తెలిపారు. అంతేకాకుండా సూపర్ సిక్స్ పథకాల అమలు పై ప్రజల్లో హర్షం వ్యక్తమవుతోందన్నారు. గంగాధర నెల్లూరు నియోజకవర్గం.., ఎస్. ఆర్. పురం మండలం, కటిక పల్లెలో నిర్వహించిన సుపరిపాలనలో తొలి అడుగు.., ఇంటింటికి తెలుగుదేశం పార్టీ కార్యక్రమంలో చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు, జీడి నెల్లూరు ఎమ్మెల్యే డాక్టర్ థామస్ పాల్గొన్నారు. అంతకు ముందు.. కటిక పల్లెకు చేరుకున్న ఎంపీ, ఎమ్మెల్యేలకు ఎస్. ఆర్. పురం మండలాధ్యక్షులు గంధమనేని జయశంకర్ నాయుడు నేతృత్వంలో… , బాలాజీ నాయుడు కూటమి నాయకులు కార్యకర్తలు మంగళ వాయిద్యాలు, బాణాసంచా.., గజమాలలతో ఘనంగా స్వాగతం పలికగా.., ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అనంతరం ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు, ఎమ్మెల్యే డాక్టర్ థామస్… కూటమి శ్రేణులతో కలిసి సుపరిపాలాలు తొలి అడుగు, ఇంటింటికి తెలుగుదేశం పార్టీ కార్యక్రమాన్ని నిర్వహించారు. కటికపల్లెలోని ప్రతి గడప కెళ్ళి,.. సుపరిపాలనలో తొలి అడుగు కరపత్రాలను పంచుతూ.., ప్రజలతో ఆప్యాయంగా మాట్లాడుతూ.. సూపర్ సిక్స్ పథకాల అమలు తీరుతెన్నులను అడిగి తెలుసుకున్నారు. అలాగే స్థానికంగా నెలకొన్న సమస్యలను తక్షణం అక్కడికక్కడే పరిష్కరిస్తూ ముందుకు సాగారు. అవ్వా తాతలు, ప్రత్యేక ప్రతిభావంతులు, ఒంటరి మహిళలు, కిడ్నీ బాధితులు, డప్పు కళాకారులకు ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్లు సక్రమంగా అందజేస్తున్నారా లేదా..? అన్న విషయాన్ని వారినే స్వయంగా అడిగి తెలుసుకున్నారు. అవ్వలతో కూర్చొని కూటమి ప్రభుత్వం పని తీరు ఎలా పనిచేస్తుంది..! ఏమైనా లోపాలున్నాయీ..! అని ఆ వయోవృద్ధులను అడగగా..అందుకు వారు సంతృప్తి వ్యక్తం చేశారు. మళ్ళీ మాకు ఏపీ సీఎం చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం రావాలని కోరుకున్నారు. అనంతరం ఎంపీ దగ్గుమళ్ళ, ఎమ్మెల్యే డాక్టర్ థామస్ మాట్లాడుతూ… ఏడాది పాలనలో తాము చేసిన పనులు ప్రజలకు ఏ మేరకు దోహదపడ్డాయో అన్న విషయాలను స్వయంగా తెలుసుకోవడం ఆనందంగా ఉందన్నారు. ప్రజలు కూడా తమకు ఇస్తున్న గౌరవాన్ని బాధ్యతగా భావిస్తామన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ప్రజల ఆశీస్సులతో.., ప్రజల ఆశయాలకు అనుగుణంగా తమ కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ.., గంగాధర నెల్లూరు నియోజకవర్గాన్ని అన్ని రకాల అభివృద్ధి చేస్తామని ఉద్ఘాటించారు. టిడిపి జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి రాజశేఖర్ నాయుడు , బిజెపి నియోజకవర్గ ఇన్చార్జ్ రాజేంద్రన్ ,యాదవ సాధికార సమితి జిల్లా అధ్యక్షుడు శ్రీధర్ యాదవ్, సాఫ్ట్వేర్ బాలు బీసీ సెల్ అధ్యక్షుడు హేమాద్రి యాదవ్ మండల ఉపాధ్యక్షులు నిరంజన్ రెడ్డి, కటిక పల్లి మాజీ సర్పంచులు బాబు నాయుడు, దీప బుజ్జి ,మాజీ ఎంపీటీసీలు వేమా నాయుడు, కే.యం.రవి టిడిపి యువ నాయకుడు పైనేని మురళి, బి కే ఎన్ మునివర్ధనాయుడు మాజీ మండల అధ్యక్షుడు రుద్రప్ప నాయుడు తెలుగు యువత జిల్లా కార్యదర్శి శేఖర్, నియోజకవర్గ ఎస్సీ సెల్ కార్యదర్శి కుమార్ ఆర్టిఐ జిల్లా అధ్యక్షుడు జయరాజ్ డీకే మర్రిపల్లి టిడిపి యువ నాయకుడు నరేష్ ప్రసాద్, బూత్ కమిటీ ఇన్చార్జ్ మాధవ నాయుడు, యువత ప్రధాన కార్యదర్శి బాబు, నోమేష్ రెడ్డి లోకయ్య ఢిల్లీ, తదితరులు పాల్గొన్నారు.
