తిరుపతి, కరకంబాడి,మన న్యూస్ , జూలై 10:– అమర రాజా విద్యాలయం, కరకంబాడి క్యాంపస్‌లో గురువారం (10-07-2025) “పేరెంట్ టీచర్ మీటింగ్ 2.0” కార్యక్రమం వైభవంగా నిర్వహించబడింది. ఈ సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో హాజరై, తమ పిల్లల విద్య, ప్రవర్తన, సామాజిక వికాసం తదితర అంశాలపై ఉపాధ్యాయులతో ప్రత్యక్షంగా మాట్లాడారు. ఈ కార్యక్రమం తల్లిదండ్రులు–ఉపాధ్యాయుల మధ్య ఆత్మీయతను పెంచే వేదికగా నిలిచింది.ఈ సమావేశానికి ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి గ్లోరీ దేవప్రియ అధ్యక్షత వహించారు. ఆమె మాట్లాడుతూ, “తల్లిదండ్రులే పిల్లలకు తొలి ఉపాధ్యాయులు. విద్యార్థుల అభివృద్ధి కోసం పాఠశాల మరియు ఇంటి మధ్య బలమైన అనుసంధానం అవసరం. ప్రతి తల్లి, తండ్రి పాఠశాల కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనడం ద్వారా తమ పిల్లల భవిష్యత్తు మరింత మెరుగవుతుంది” అని అన్నారు. కార్యక్రమంలో భాగంగా: విద్యార్థుల ప్రగతిపత్రాల సమీక్ష, విద్యాసంబంధిత తల్లిదండ్రుల సూచనలు, అభిప్రాయాల స్వీకరణ, పాఠశాల నూతన విద్యా విధానాలపై అవగాహన కల్పన, తల్లిదండ్రుల కోసం ప్రత్యేకంగా ఆటలు, సాంస్కృతిక పోటీలు
వంటివి నిర్వహించబడ్డాయి. తల్లిదండ్రులు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ఉపాధ్యాయులతో విభిన్న విషయాలపై చర్చలు జరిపారు. ముఖ్యంగా, హోమ్ వర్క్, బాలల శిక్షణా విధానం, ఆచరణాత్మక బోధన, మానసిక ఆరోగ్యం వంటి అంశాలపై ముఖ్యమైన అభిప్రాయాలను వ్యక్తం చేశారు. తల్లిదండ్రులు పోటీల్లో ఎంతో ఉత్సాహంగా పాల్గొని తమ నైపుణ్యాలను ప్రదర్శించారు. విజేతలకు బహుమతులు పంపిణీ చేయడం జరిగింది. పాఠశాల టీచింగ్, నాన్-టీచింగ్ సిబ్బంది, నిర్వహణ బృందం ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడంలో కీలకపాత్ర పోషించారు. పాఠశాల యాజమాన్యం తల్లిదండ్రుల చురుకైన సహకారానికి కృతజ్ఞతలు తెలిపింది.ఈ తరహా కార్యక్రమాలు విద్యార్థుల వికాసానికి తోడ్పడే విధంగా ఉండే అవకాశం ఉందని ఉపాధ్యాయులు అభిప్రాయపడ్డారు. “ఇది కేవలం సమావేశం కాదు, ఒక కుటుంబ సంబరంలా అనిపించింది,” అని పలువురు తల్లిదండ్రులు వ్యాఖ్యానించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *