నేలతల్లి ఆరోగ్యమే మన ఆరోగ్యం

పాచిపెంట,,మన న్యూస్ , జూలై 9:- పార్వతిపురం మన్యం జిల్లా పాచిపెంట మండలంలోపంటలు పండించే భూమి ఆరోగ్యంగా ఉంటే ఆ పంటలు తినే మనుషులు ఆరోగ్యంగా ఉంటారని పాంచాలి సర్పంచ్ గూడెపు యుగంధర్ అన్నారు. బుధవారం నాడు మండలం పాంచాలి గ్రామంలో నిర్వహించిన పొలం పిలుస్తోంది కార్యక్రమంలో మాట్లాడుతూ ప్రతి రైతు దిగుబడుల కోసం ఆలోచించకుండా కనీసం తాను తినే తిండి గింజల వరకైనా ప్రకృతి సేద్య పద్ధతులలో వ్యవసాయం కొనసాగించాలని లేనియెడల ఆరోగ్యం దెబ్బతిని హాస్పిటల్స్ కు బిల్లులు చెల్లించాల్సి వస్తుందని అన్నారు. అలాగే విచక్షణ రహితంగా ఎరువులు వాడొద్దని దాని వలన పంట భూములు చౌడుబారుతాయని,ఘన, ద్రవ,జీవామృతాలు తయారు చేసుకోవాలని ఒక ఆవు ఉంటే కనీసం ఐదు ఎకరాలు పండించుకోవచ్చని ప్రకృతి సేద్య నిపుణులు చెబుతున్నారని అన్నారు.ఈ సందర్భంగా వ్యవసాయ అధికారి కే తిరుపతిరావు మాట్లాడుతూ ప్రతి రైతు పంటల బీమా నమోదు చేసుకోవాలని వాతావరణ ఆధారిత పంటల భీమా పథకానికి పత్తి పంటకు1923 రూపాయలు అరటి పంటకు 3000 రూపాయలు ఒక ఎకరానికి చెల్లించుకోవాలని ఆఖరి తేదీ జూలై 15 అని అలాగే ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం కింద మొక్కజొన్న పంటకు 334 జూలై 31 వ తారీకు లోగా వరి పంటకు ఎనిమిది వందల రూపాయలు ఆగస్టు 15వ తారీకు లోగా చెల్లించుకుని నమోదు చేసుకోవాలని తెలిపారు. గ్రామ సచివాలయం లేదా కామన్ సర్వీస్ సెంటర్లు లేదా పోస్ట్ ఆఫీసుల్లో నమోదు చేసుకోవచ్చని తెలిపారు.అనంతరం అధిక మోతాదులో ఎరువులు ఎరువులు వేస్తే వానపాములు ఎంత తొందరగా చనిపోతాయో ప్రయోగాన్ని చేసి చూపించారు అనంతరం గట్లపై మరియు అంతర్పంటలుగా ప్రభుత్వం ద్వారా 100 శాతం రాయితీపై వచ్చే కంది విత్తనాలను గ్రామ సర్పంచ్ గూడెపు యుగంధర్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ వ్యవసాయ సహాయకులు ఈదిబిల్లి శ్రీను సి ఆర్ పి తిరుపతి నాయుడు మరియు రైతులు పాల్గొన్నారు.

Related Posts

ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఒన్ సైడ్ గా గెలిపించండి

సూపర్ సిక్స్ విజయోత్సవ వేదికగా ఆటో డ్రైవర్లకు  కానుక దసరాకు ఆటో డ్రైవర్లకు రూ.15వేల ఆర్ధిక సాయం చేస్తామని ప్రకటించిన సీఎం రప్పారప్పా అంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరిక వైసీపీ నాయకుడిది దృతరాష్ట్ర కౌగిలి అని ఎద్దేవా చేసిన ముఖ్యమంత్రి  సీమ…

వాతావరణ మార్పుల ప్రభావం–ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి: శివ కిషోర్

ఉరవకొండ మన ధ్యాస: వజ్రకరూరు మండల కేంద్రంలోని స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బుధవారం క్లైమేట్ కేర్ ఛాంపియన్స్ ప్రోగ్రాం (స్వస్తి ) బృందం తనిఖీ చేశారు. శివ కిషోర్ స్టేట్ ప్రోగ్రాం మేనేజర్, డాక్టర్ తన్మయి మేనేజర్ వేదిక అసోసియేట్…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

  • By NAGARAJU
  • September 10, 2025
  • 3 views
దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్ సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

  • By NAGARAJU
  • September 10, 2025
  • 4 views
అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్  సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఒన్ సైడ్ గా గెలిపించండి

ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఒన్ సైడ్ గా గెలిపించండి

ఎన్నికల్లో హామీలు ఇచ్చాం ఎన్ని కష్టాలు వచ్చినా తీర్చాం.

ఎన్నికల్లో హామీలు ఇచ్చాం ఎన్ని కష్టాలు వచ్చినా తీర్చాం.

వాతావరణ మార్పుల ప్రభావం–ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి: శివ కిషోర్

వాతావరణ మార్పుల ప్రభావం–ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి: శివ కిషోర్

ఉపరాష్ట్రపతి ఎన్నిక కేవలం వ్యక్తి ఎన్నిక కాదు

ఉపరాష్ట్రపతి ఎన్నిక కేవలం వ్యక్తి ఎన్నిక కాదు