నానో ఎరువులతో అధిక ప్రయోజనాలు – వ్యవసాయ శాఖ అధికారి కే తిరుపతిరావు

మన న్యూస్ పాచిపెంట జూలై 8:- రైతులు సాంప్రదాయ ఎరువులకు బదులుగా నానో ఎరువులను వాడుకుంటే అధిక ప్రయోజనాలు ఉంటాయని వ్యవసాయ అధికారి కే తిరుపతిరావు అన్నారు తాడూరు గ్రామంలో పొలం పిలుస్తోంది కార్యక్రమంలో మాట్లాడుతూ రైతులు సాంప్రదాయ రసాయన ఎరువులైన యూరియా డిఏపి పొటాష్ ఎరువులకు బదులుగా నానో యూరియా నానో డీఏపీలను వినియోగిస్తే ఖర్చు బాగా తగ్గడమే కాకుండా పంటలలో ఎరువుల వినియోగ శక్తి పెరుగుతుందని తద్వారా అధిక దిగుబడులు వస్తాయని అన్నారు. నానో ఎరువులు మిగిలిన రసాయన పురుగు మందులతో కలిపి కూడా వాడుకోవచ్చని డ్రోన్ ద్వారా పిచికారి చేయడానికి అత్యంత అనువైన ఎరువులు అని తెలిపారు,భూమిలో వేసిన బస్తాలతో కూడిన ఎరువులు ముఖ్యంగా యూరియా అనేక రూపాలుగా నష్టపోతుందని భూమిలో వేసిన ఎరువులలో సుమారు 40 శాతం రసాయన ఎరువులు పంటకు అందకుండా వివిధ మార్గాలలో నష్టపోతామని అంతే కాకుండా అధిక మోతాదులో వేసినప్పుడు భూ స్వభావం కూడా దెబ్బతిని పర్యావరణ కాలుష్యం నీటి కాలుష్యం నేల కాలుష్యం ఏర్పడతాయని వీటి స్థానంలో నానో ఎరువులను వినియోగించినట్లయితే ఎరువుల వినియోగ శక్తి పెరుగుతుందని పర్యావరణానికి ఎలాంటి హాని జరగదని నేల స్వభావం కూడా దెబ్బ తినకుండా ఉంటుందని అంతేకాకుండా పురుగులు తెగుళ్లు ఆశించకుండా ఉంటాయని తెలిపారు ముఖ్యంగా వర్షం పడిన తర్వాత భూమిలో వేసే ఎరువు కంటే పిచికారి చేసే ఎరువుల ద్వారా ఫలితాలు అందుతాయని కాబట్టి రైతులు నానో ఎరువులు వాడి అధిక ప్రయోజనాలు పొందాలని కోరారు ఈ కార్యక్రమంలో గ్రామ వ్యవసాయ సహాయకులు దినేష్ కుమార్ ప్రకృతి సేద్య సిఆర్పి తిరుపతి నాయుడు మరియు రైతులు పాల్గొన్నారు.

Related Posts

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

శంఖవరం/ అన్నవరం మన ధ్యాస ప్రతినిధి (అపురూప్):-జాతీయ రహదారి పై ప్రమాదాలను నివారించేందుకు భారీ కసరత్తు చేపడుతున్నారు.శ్రీ కాకినాడ జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్ ఐపీఎస్ సూచనల మేరకు మరియు పెద్దాపురం డి.ఎస్.పి డి శ్రీహరి రాజు ఆదేశాలతో ప్రత్తిపాడు…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

శంఖవరం మన ధ్యాస ప్రతినిధి (అపురూప్):- విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణంగా బోధన జరగాలని ఉపాధ్యాయులకు సమగ్ర శిక్ష (కెజిబివి) కార్యదర్శి డి దేవానందరెడ్డి సూచించారు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం మండల కేంద్రం శంఖవరం కస్తూర్భా గాంధీ బాలికా విద్యాలయ (కెజిబివి)…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

ప్రైవేటీకరణతో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో: సిపిఐ

ప్రైవేటీకరణతో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో: సిపిఐ

దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

  • By NAGARAJU
  • September 10, 2025
  • 4 views
దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్ సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

  • By NAGARAJU
  • September 10, 2025
  • 5 views
అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్  సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///