నానో ఎరువులతో అధిక ప్రయోజనాలు – వ్యవసాయ శాఖ అధికారి కే తిరుపతిరావు

మన న్యూస్ పాచిపెంట జూలై 8:- రైతులు సాంప్రదాయ ఎరువులకు బదులుగా నానో ఎరువులను వాడుకుంటే అధిక ప్రయోజనాలు ఉంటాయని వ్యవసాయ అధికారి కే తిరుపతిరావు అన్నారు తాడూరు గ్రామంలో పొలం పిలుస్తోంది కార్యక్రమంలో మాట్లాడుతూ రైతులు సాంప్రదాయ రసాయన ఎరువులైన యూరియా డిఏపి పొటాష్ ఎరువులకు బదులుగా నానో యూరియా నానో డీఏపీలను వినియోగిస్తే ఖర్చు బాగా తగ్గడమే కాకుండా పంటలలో ఎరువుల వినియోగ శక్తి పెరుగుతుందని తద్వారా అధిక దిగుబడులు వస్తాయని అన్నారు. నానో ఎరువులు మిగిలిన రసాయన పురుగు మందులతో కలిపి కూడా వాడుకోవచ్చని డ్రోన్ ద్వారా పిచికారి చేయడానికి అత్యంత అనువైన ఎరువులు అని తెలిపారు,భూమిలో వేసిన బస్తాలతో కూడిన ఎరువులు ముఖ్యంగా యూరియా అనేక రూపాలుగా నష్టపోతుందని భూమిలో వేసిన ఎరువులలో సుమారు 40 శాతం రసాయన ఎరువులు పంటకు అందకుండా వివిధ మార్గాలలో నష్టపోతామని అంతే కాకుండా అధిక మోతాదులో వేసినప్పుడు భూ స్వభావం కూడా దెబ్బతిని పర్యావరణ కాలుష్యం నీటి కాలుష్యం నేల కాలుష్యం ఏర్పడతాయని వీటి స్థానంలో నానో ఎరువులను వినియోగించినట్లయితే ఎరువుల వినియోగ శక్తి పెరుగుతుందని పర్యావరణానికి ఎలాంటి హాని జరగదని నేల స్వభావం కూడా దెబ్బ తినకుండా ఉంటుందని అంతేకాకుండా పురుగులు తెగుళ్లు ఆశించకుండా ఉంటాయని తెలిపారు ముఖ్యంగా వర్షం పడిన తర్వాత భూమిలో వేసే ఎరువు కంటే పిచికారి చేసే ఎరువుల ద్వారా ఫలితాలు అందుతాయని కాబట్టి రైతులు నానో ఎరువులు వాడి అధిక ప్రయోజనాలు పొందాలని కోరారు ఈ కార్యక్రమంలో గ్రామ వ్యవసాయ సహాయకులు దినేష్ కుమార్ ప్రకృతి సేద్య సిఆర్పి తిరుపతి నాయుడు మరియు రైతులు పాల్గొన్నారు.

Related Posts

జిల్లా సచివాలయంలో పునరుద్ధరించిన వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్

చిత్తూరు,మన ధ్యాస, అక్టోబర్ 29ప్రభుత్వ ఉద్యోగులు తమ విధులను నిర్వర్తించడానికి అనువైన కార్యస్థానం అవసరమని, జిల్లా సచివాలయం నుండి వర్చువల్ విధానంలో సమీక్షలు నిర్వహించడానికి, పరిస్థితులను పరిశీలించడానికి అనువుగా ప్రస్తుతం ఉన్న వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను…

జగనన్న కాలనీలో పర్యటించిన కాకాణి పూజిత”

మన ధ్యాస ,వెంకటాచలం, అక్టోబర్ 29:సర్వేపల్లి నియోజకవర్గం, వెంకటాచలం మండల కేంద్రంలోని జగనన్న లేఔట్ ను పరిశీలించి,భారీ వర్షాల కారణంగా కాలని వాసులు పడుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్న రాష్ట్ర మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత. కాలనీవాసులకు బ్రెడ్లు,…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

భారీ వర్షాలకు కుప్పకూలిన రేకుల ఇల్లు..బోరున విలపిస్తున్న బాధ్యులు..ఘటన స్థలాలను పరిశీలించిన మండల స్థాయి అధికారులు..!!

భారీ వర్షాలకు కుప్పకూలిన రేకుల ఇల్లు..బోరున విలపిస్తున్న బాధ్యులు..ఘటన స్థలాలను పరిశీలించిన మండల స్థాయి అధికారులు..!!

జిల్లా సచివాలయంలో పునరుద్ధరించిన వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్

జిల్లా సచివాలయంలో పునరుద్ధరించిన వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్

జగనన్న కాలనీలో పర్యటించిన కాకాణి పూజిత”

జగనన్న కాలనీలో పర్యటించిన కాకాణి పూజిత”

సోమరాజుపల్లి, టిపి నగర్ వరద బాధితులకు ఆహార పంపిణీ

  • By JALAIAH
  • October 29, 2025
  • 4 views
సోమరాజుపల్లి, టిపి నగర్ వరద బాధితులకు ఆహార పంపిణీ

అల్యూమినియం ఉత్పత్తిలోA1 ఆధారిత మిషన్ హీయరింగ్ మరియు విజన్ టెక్నాలజీలను పరిచయం చేసింది

అల్యూమినియం ఉత్పత్తిలోA1 ఆధారిత మిషన్ హీయరింగ్ మరియు విజన్ టెక్నాలజీలను పరిచయం చేసింది

వింజమూరు మండలంలో తుఫాన్ ప్రభావానికి నిండిన 17 చెరువులు..!

వింజమూరు మండలంలో తుఫాన్ ప్రభావానికి నిండిన 17 చెరువులు..!