మన న్యూస్ పాచిపెంట జూలై 8:- రైతులు సాంప్రదాయ ఎరువులకు బదులుగా నానో ఎరువులను వాడుకుంటే అధిక ప్రయోజనాలు ఉంటాయని వ్యవసాయ అధికారి కే తిరుపతిరావు అన్నారు తాడూరు గ్రామంలో పొలం పిలుస్తోంది కార్యక్రమంలో మాట్లాడుతూ రైతులు సాంప్రదాయ రసాయన ఎరువులైన యూరియా డిఏపి పొటాష్ ఎరువులకు బదులుగా నానో యూరియా నానో డీఏపీలను వినియోగిస్తే ఖర్చు బాగా తగ్గడమే కాకుండా పంటలలో ఎరువుల వినియోగ శక్తి పెరుగుతుందని తద్వారా అధిక దిగుబడులు వస్తాయని అన్నారు. నానో ఎరువులు మిగిలిన రసాయన పురుగు మందులతో కలిపి కూడా వాడుకోవచ్చని డ్రోన్ ద్వారా పిచికారి చేయడానికి అత్యంత అనువైన ఎరువులు అని తెలిపారు,భూమిలో వేసిన బస్తాలతో కూడిన ఎరువులు ముఖ్యంగా యూరియా అనేక రూపాలుగా నష్టపోతుందని భూమిలో వేసిన ఎరువులలో సుమారు 40 శాతం రసాయన ఎరువులు పంటకు అందకుండా వివిధ మార్గాలలో నష్టపోతామని అంతే కాకుండా అధిక మోతాదులో వేసినప్పుడు భూ స్వభావం కూడా దెబ్బతిని పర్యావరణ కాలుష్యం నీటి కాలుష్యం నేల కాలుష్యం ఏర్పడతాయని వీటి స్థానంలో నానో ఎరువులను వినియోగించినట్లయితే ఎరువుల వినియోగ శక్తి పెరుగుతుందని పర్యావరణానికి ఎలాంటి హాని జరగదని నేల స్వభావం కూడా దెబ్బ తినకుండా ఉంటుందని అంతేకాకుండా పురుగులు తెగుళ్లు ఆశించకుండా ఉంటాయని తెలిపారు ముఖ్యంగా వర్షం పడిన తర్వాత భూమిలో వేసే ఎరువు కంటే పిచికారి చేసే ఎరువుల ద్వారా ఫలితాలు అందుతాయని కాబట్టి రైతులు నానో ఎరువులు వాడి అధిక ప్రయోజనాలు పొందాలని కోరారు ఈ కార్యక్రమంలో గ్రామ వ్యవసాయ సహాయకులు దినేష్ కుమార్ ప్రకృతి సేద్య సిఆర్పి తిరుపతి నాయుడు మరియు రైతులు పాల్గొన్నారు.