

గూడూరు, మన న్యూస్:- ప్రతి విద్యార్థి తమ జీవితాలను ఉన్నత స్థాయికి చేరుకోవడానికి లక్ష్యాన్ని ఎంచుకొని ఆ లక్ష్యం దిశగా ముందుకు సాగాలని రాజనేని రామానాయుడు చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక అధినేత రాజనేని శ్రీనివాసరావు నాయుడు తెలియజేశారు. 2024-25 విద్యా సంవత్సరంలో పదవ తరగతిలో ప్రతిభ కనబరిచి, 500 పైగా మార్కులు సాధించిన మండలంలోని 27మంది విద్యార్థులకు నగదుతో పాటు ప్రోత్సాహ బహుమతులను అందజేశారు. చిల్లకూరు మండలంలోని తిక్కవరం జడ్పీ హైస్కూల్లో సోమవారం రాజనేని రామానాయుడు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ట్రస్ట్ వ్యవస్థాపక అధినేత రాజనేని శ్రీనివాసులు నాయుడు దాత్రుత్వంతో రాజనేని వారి ప్రతిభ పురస్కారం కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి 2024-25 విద్యా సంవత్సరంలో మండలంలో 500 పైగా మార్కులు సాధించిన 27 మంది విద్యార్థిని,విద్యార్థులకు మొదటి బహుమతిగా 584 మార్కులు సాధించిన నెలబల్లి రెట్టుపల్లి హైస్కూల్ విద్యార్థి ఎం. శేఖర్ కు 20వేల రూపాయలు, రెండవ బహుమతిగా 573 మార్కులు సాధించిన వరగలి హై స్కూల్ కు చెందిన పి.పురుషోత్తం కు పదివేల రూపాయలను, మూడవ బహుమతిగా 565 మార్కులు సాధించిన ఎన్ ఆర్ పల్లి హైస్కూల్ కు చెందిన పి.నవీన్ కుమార్ పదివేల రూపాయలను, అలాగే మిగిలిన విద్యార్థుల ఒక్కొక్కరికి 5000 రూపాయల వంతున అందజేశారు. ఈ సందర్భంగా ట్రస్ట్ వ్యవస్థాపక అధినేత రాజనేని శ్రీనివాసులు నాయుడు మాట్లాడుతూ…ప్రతి విద్యార్థి తమ జీవితాలను ఉన్నత స్థాయికి చేరుకోవడానికి లక్ష్యాన్ని ఎంచుకొని ఆ లక్ష్యం దిశగా ముందుకు సాగాలని తెలియజేశారు.విద్యకు పేదరికం ఎప్పుడు అడ్డు కాదని, లక్ష సాధనలో అనేక అవాంతరాలు ఎదురైనప్పటికీ వాటిని అధిగమించి లక్ష్యాన్ని చేదించాలని,విద్యార్థులకు విద్యను, పేదవారికి వైద్య సహాయం అందించడంలో మా ట్రస్ట్ ఎప్పుడు ఉందంటుందని తెలిపారు.అనంతరం మండలంలోని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు,విద్యార్థులు ఆయన్ను ఘనంగా సన్మానించి, సత్కరించారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు అర్బన్ విద్యాశాఖ అధికారి అబ్దుల్ హమీద్, ట్రస్ట్ కార్యదర్శి రామయ్య నాయుడు, తిక్కవరం, చింతవరం, తడివేడు, రెట్టపల్లి, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పి.రమణయ్య, శివ సుబ్రహ్మణ్యం, శ్రీనివాసులు, విజయలక్ష్మి, చంద్రశేఖర్, పివి కృష్ణారెడ్డి, ప్రజేంద్రరెడ్డి, బాబు తదితరులు పాల్గొన్నారు.

