మ‌హిళా సాధికారితే ఎన్డీఏ కూట‌మి ప్ర‌భుత్వం ల‌క్ష్యంః ఎమ్మెల్యే ఆర‌ణి శ్రీనివాసులు

మన న్యూస్,తిరుప‌తిః- మ‌హిళ‌లు సాంకేతిక‌త‌ను అందిపుచ్చుకుని ఆర్థికంగా నిల‌దొక్కుకోవాల‌ని ఎమ్మెల్యే ఆర‌ణి శ్రీనివాసులు కోరారు. మ‌హిళా సాధికారిత కోసం ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు, ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ళ్యాణ్ కృషి చేస్తున్నార‌ని ఆయ‌న చెప్పారు. శుక్ర‌వారం ఉద‌యం సిఎల్ టి సెంట‌ర్ లో మెప్మా ఆర్పీల‌కు ట్యాబ్ ల‌ను ఎమ్మెల్యే ఆర‌ణి శ్రీనివాసులు పంపిణీ చేశారు. 169 ఆర్పీల‌కు గాను 153 మందికి ట్యాబ్ లు ఆయ‌న అంద‌చేశారు. ట్యాబ్ లో 60 యాప్ లు ఉన్నాయ‌ని, అన్నీ ప్ర‌భుత్వ సంక్షేమ ప‌థ‌కాలు, స‌ర్వేల‌కు సంబంధించిన‌వని ఆయ‌న చెప్పారు. ఇక‌పై ప్ర‌భుత్వ సేవ‌ల‌న్నీ వాట్స్ ప్ ద్వారానే అందించాల‌ని సిఎం చంద్ర‌బాబు నాయుడు, డిప్యూటీ సిఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ లు నిర్ణ‌యించార‌ని ఆయ‌న తెలిపారు. ప్ర‌జ‌ల‌కు ప్ర‌భుత్వ అందించే సంక్షేమ ప‌థ‌కాల‌ను పార‌దర్శకంగా చేర‌వేయాల‌ని ఆయ‌న కోరారు. . సాంకేతికంగా వ‌స్తున్న మార్పుల‌ను మ‌హిళ‌ల‌ను త్వ‌రగా నేర్చుకుని పురుష‌ల‌తో పోటీ ప‌డాల‌ని ఆయ‌న సూచించారు. మ‌హిళ‌ల‌కు ఏకాగ్ర‌త ఎంతో ఎక్కువ‌ని ఆయ‌న చెబుతూ మ‌హిళ‌లు అనుకుంటే సాధించ‌లేనిది ఏమి లేద‌ని ఆయ‌న అన్నారు. కాగా 130 మంది డిజీ ల‌క్ష్మీల‌కు బ‌యోమెట్రిక్ డివైజ్ ల‌ను ఆయ‌న అందించారు. స్వ‌యం ఉపాధి, వ్యాపార రంగాల్లో మ‌హిళ‌లు రాణించేందుకు అవ‌స‌ర‌మైన అన్ని చ‌ర్య‌ల‌ను ప్ర‌భుత్వం తీసుకుంద‌ని వాటిని మ‌హిళ‌లు వినియోగించుకోవాల‌ని ఆయ‌న కోరారు. ఈ కార్య‌క్ర‌మంలో సిఎంఎం లు కృష్ణ‌వేణి, సోమశేఖ‌ర్, డిప్యూటీ మేయ‌ర్ ఆర్సీ మునికృష్ణా, జ‌న‌సేన న‌గ‌ర అధ్య‌క్షులు రాజా రెడ్డి, సిఓలు త‌దిత‌రులు పాల్గొన్నారు.

Related Posts

కార్మిక హక్కులు కోసమే సమ్మె

మన న్యూస్ పాచిపెంట, జూన్ 27:- కార్మిక హక్కుల కోసం మనమంతా పోరాడి హక్కులు సాధించుకోవాలని ఎన్ వై నాయుడు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్మిక హక్కులు నాశనం చేసే విధంగా నిర్ణయాలు చేస్తుందని,అలాంటి నిర్ణయాలపై…

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ అధ్యక్షులు బ్రాహ్మ డాక్టర్ చేవూరి రామస్వామి,

మన న్యూస్ సాలూరు జూన్ 27:- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చం నాయుడు ని, పార్వతిపురం మన్యం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వారిని మర్యాదపూర్వకముగా, పంచ వృత్తుల విశ్వబ్రాహ్మణb సంఘం అధ్యక్షులు చెరుకూ ఈశ్వరరావు, అధ్యక్షులు బి…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

నరేంద్ర మోడీ విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమించండి, ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి ఎం. డి కుతుబ్

నరేంద్ర మోడీ విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమించండి, ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి ఎం. డి కుతుబ్

మొహరం పండుగను, సామరస్యంగా భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలి, ఉట్కూర్ ఎస్ఐ రమేష్.

మొహరం పండుగను, సామరస్యంగా భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలి, ఉట్కూర్ ఎస్ఐ రమేష్.

తుర్కయంజాల్లో చిత్రక ఫ్యాబ్రిక్స్ ప్రారంభం

తుర్కయంజాల్లో చిత్రక ఫ్యాబ్రిక్స్ ప్రారంభం

కార్మిక హక్కులు కోసమే సమ్మె

కార్మిక హక్కులు కోసమే సమ్మె

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ అధ్యక్షులు బ్రాహ్మ డాక్టర్ చేవూరి రామస్వామి,

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ అధ్యక్షులు బ్రాహ్మ డాక్టర్ చేవూరి రామస్వామి,

మ‌హిళా సాధికారితే ఎన్డీఏ కూట‌మి ప్ర‌భుత్వం ల‌క్ష్యంః ఎమ్మెల్యే ఆర‌ణి శ్రీనివాసులు

మ‌హిళా సాధికారితే ఎన్డీఏ కూట‌మి ప్ర‌భుత్వం ల‌క్ష్యంః ఎమ్మెల్యే ఆర‌ణి శ్రీనివాసులు