

మన న్యూస్,తిరుపతిః- మహిళలు సాంకేతికతను అందిపుచ్చుకుని ఆర్థికంగా నిలదొక్కుకోవాలని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు కోరారు. మహిళా సాధికారిత కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కృషి చేస్తున్నారని ఆయన చెప్పారు. శుక్రవారం ఉదయం సిఎల్ టి సెంటర్ లో మెప్మా ఆర్పీలకు ట్యాబ్ లను ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు పంపిణీ చేశారు. 169 ఆర్పీలకు గాను 153 మందికి ట్యాబ్ లు ఆయన అందచేశారు. ట్యాబ్ లో 60 యాప్ లు ఉన్నాయని, అన్నీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు, సర్వేలకు సంబంధించినవని ఆయన చెప్పారు. ఇకపై ప్రభుత్వ సేవలన్నీ వాట్స్ ప్ ద్వారానే అందించాలని సిఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ లు నిర్ణయించారని ఆయన తెలిపారు. ప్రజలకు ప్రభుత్వ అందించే సంక్షేమ పథకాలను పారదర్శకంగా చేరవేయాలని ఆయన కోరారు. . సాంకేతికంగా వస్తున్న మార్పులను మహిళలను త్వరగా నేర్చుకుని పురుషలతో పోటీ పడాలని ఆయన సూచించారు. మహిళలకు ఏకాగ్రత ఎంతో ఎక్కువని ఆయన చెబుతూ మహిళలు అనుకుంటే సాధించలేనిది ఏమి లేదని ఆయన అన్నారు. కాగా 130 మంది డిజీ లక్ష్మీలకు బయోమెట్రిక్ డివైజ్ లను ఆయన అందించారు. స్వయం ఉపాధి, వ్యాపార రంగాల్లో మహిళలు రాణించేందుకు అవసరమైన అన్ని చర్యలను ప్రభుత్వం తీసుకుందని వాటిని మహిళలు వినియోగించుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో సిఎంఎం లు కృష్ణవేణి, సోమశేఖర్, డిప్యూటీ మేయర్ ఆర్సీ మునికృష్ణా, జనసేన నగర అధ్యక్షులు రాజా రెడ్డి, సిఓలు తదితరులు పాల్గొన్నారు.
