

గద్వాల్ మన న్యూస్ : నియోజకవర్గంలోని కేటి దొడ్డి మండల పరిధిలోని గువ్వల దీన్నే యుపిఎస్ గువ్వలదిన్నె పాఠశాలల్లో శుక్రవారం కేటి దొడ్డి మండల విద్యాశాఖ అధికారి వెంకటేశ్వరరావు చేతుల మీదుగా విద్యార్థి విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు స్కూల్ యూనిఫామ్స్ అందజేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ : జూన్ 12 నుంచి పాఠశాలలు పునఃప్రారంభం అయ్యాయి కావున ప్రతి ఒక్క విద్యార్థి బడిలో ఉండాలి అని అన్నారు అదే విదంగా ఎవ్వరు కూడా కాటన్ సీడ్ పత్తి కి పోకుండ గా ప్రతిరోజు పాఠశాలకు హాజరుకావాలని ఉపాధ్యాయులు చెప్పే పాఠాలు శ్రద్ధతో విని అర్థం చేసుకోగల సామర్ధ్యాలను రూపొందించుకోవాలని విద్యార్థులకు తెలియజేశారు అదే విదంగా ప్రధానోపాధ్యాయురాలు నజియ మాట్లాడుతూ : బడి ఈడు పిల్లలు ఎవరైనా ఉంటే మా దృష్టికి తీసుకొని రావాలని విద్యార్థులకు తెలియజేశారు అదే విదంగా మీ స్నేహితులను కూడా పాఠశాలకు తీసుకురావాలని కోరారు గ్రామంలో ఉన్న విద్యార్థులు చదువుకుంటేనే ఉన్నత స్థాయిలో ఉండగలమని విద్యార్థులకు తెలియజేశారు ఈ కార్యక్రమంలో కేటి దొడ్డి మండల విద్యాశాఖ అధికారి వెంకటేశ్వరరావు ప్రధానోపాధ్యాయురాలు నజియ పాఠశాల ఉపాధ్యాయుల బృందం పాల్గొన్నారు