

మన్నెగూడ. మన న్యూస్:– అఖిల భారత యువజన సమాఖ్య ఏఐవైఎఫ్ రంగారెడ్డి జిల్లా సమితి ఆధ్వర్యంలో ఫిట్నెస్ లేని బస్సులను సీజ్ చేయాలని రీజినల్ ట్రాన్స్పోర్ట్ అధికారి సుభాష్ చంద్ర రెడ్డి కి వినతి పత్రం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి పి శివకుమార్ గౌడ్ మాట్లాడుతూ విద్యా సంవత్సరం ప్రారంభం అవుతున్న తరుణంలో ఇబ్రహీంపట్నం నియోజకవర్గ కేంద్రంగా వందల సంఖ్యలో ప్రైవేటు, కార్పొరేటర్ పాఠశాలలు కాలేజీలు ఉన్నాయని, విద్యాసంస్థల యాజమాన్యాలు తమ బస్సులను కచ్చితంగా ఫిట్నెస్ చేయించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని అన్నారు. అంతేకాకుండా బస్సుల్లో ఫైర్ సేఫ్టీ, ప్రైమరీ హెల్త్ చెకప్ కిట్ లు అందుబాటులో ఉంచాలి. కానీ కార్పొరేట్ యాజమాన్యాలు ఇవి ఏమీ పట్టించుకోకుండా యదేచ్ఛగా రోడ్లపైకి వస్తున్నాయనీ వారు తెలిపారు. 15 సంవత్సరాలకు పైబడిన బస్సులు కూడా ఏలాంటి అనుమతులు లేకుండా నడుస్తున్నాయని వారు అన్నారు. డ్రైవర్లకు బస్సు నిర్వహణ పైన అవగాహన కల్పించాలి అదేవిధంగా వాహన వేగ పరిమితీని కూడా తగ్గించి నడిపే విధంగా చూడాలని వారు అన్నారు. పరిమితికి మించి బస్సులో విద్యార్థులను తరలించ వద్దని, విద్యార్థుల సంరక్షణ అందరీ బాధ్యత అని ఆయన గుర్తు చేశారు. మోటార్ వెహికల్ ఆక్ట్ ప్రకారం నియమ నిబంధనలు పాటించని అన్ని ప్రైవేటు కార్పొరేట్ పాఠశాల కళాశాలల బస్సులను వెంటనే సీజ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ నాయకులు గోవర్ధన్, వివేక్, గండికోట శివ, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు