మన న్యూస్ , గంగాధర నెల్లూరు :- బుధవారం రోజు “మన న్యూస్” చానెల్ ద్వారా గంగాధర్ నెల్లూరు నియోజకవర్గానికి చెందిన ప్రజల అభిప్రాయాలను సేకరించేందుకు ఒక పబ్లిక్ పోలింగ్ నిర్వహించబడింది. ఈ అభిప్రాయ సేకరణలో మొత్తం 1877 మంది ఓటర్లు పాల్గొన్నారు. ప్రతి అభ్యర్థికి వచ్చిన మద్దతు కింది విధంగా ఉంది: వెదురుకుప్పం మండలం :- కిషన్ చందు – 508 ఓట్లు (27.0%) , మోహన్ మురళి – 127 ఓట్లు (6.8%) లోకనాథ్ రెడ్డి – 29 ఓట్లు (1.5%) , మొత్తం ఓట్లు: 664. పాలసముద్రం మండలం :- వాసు నాయుడు – 293 ఓట్లు (15.6%), శివయ్య నాయుడు – 277 ఓట్లు (14.8%) , మొత్తం ఓట్లు: 570. ఎస్ఆర్ పురం మండలం :- మురళి – 189 ఓట్లు (10.1%), రాజశేఖర్ నాయుడు – 28 ఓట్లు (1.5%), జయశంకర్ నాయుడు – 22 ఓట్లు (1.2%), మునివర్ధనాయుడు – 17 ఓట్లు (0.9%), వేమన నాయుడు – 54 ఓట్లు (2.9%), మొత్తం ఓట్లు: 310. పెనుమూరు మండలం :- సతీష్ రెడ్డి – 50 ఓట్లు (2.7%), రుద్రయ్య నాయుడు – 5 ఓట్లు (0.3%), మనోహర్ రెడ్డి (బాబు రెడ్డి) – 4 ఓట్లు (0.2%), హరిబాబు నాయుడు – 11 ఓట్లు (0.6%), కృష్ణమూర్తి నాయుడు – 8 ఓట్లు (0.4%) మొత్తం ఓట్లు: 78. జీడి నెల్లూరు మండలం :- దేవ సుందరం – 31 ఓట్లు (1.6%), శ్రీధర్ యాదవ్ – 6 ఓట్లు (0.3%) , స్వామి దాస్ – 90 ఓట్లు (4.8%), మొత్తం ఓట్లు: 127 .. కార్వేటినగరం మండలం :- రవి యాదవ్ – 13 ఓట్లు (0.7%), సోమశేఖర్ యాదవ్ – 96 ఓట్లు (5.1%), చంగల్ రాయ్ యాదవ్ – 11 ఓట్లు (0.6%), మొత్తం ఓట్లు: 120. మొత్తం విశ్లేషణ :- మొత్తం ఓట్లు: 1877, కిషన్ చందు – 508 ఓట్లు (27.0%), వాసు నాయుడు – 293 ఓట్లు (15.6%), శివయ్య నాయుడు – 277 ఓట్లు (14.8%)

గమనిక:- ఈ అభిప్రాయ సేకరణ ఫలితాలు పూర్తిగా ప్రజల అభిమతాన్ని సూచించే ఓ సామాజిక అధ్యయనం మాత్రమే. ఇది ఎన్నికలు కాదు, అధికారిక ఓటింగ్ కూడా కాదు. టీడీపీ పార్టీ తరఫున అభ్యర్థుల ఎంపికను తుది నిర్ణయించే అధికారం పార్టీ అధిష్టానానికే చెందుతుంది. ప్రజల అభిప్రాయాలను సేకరించడం ద్వారా ప్రస్తుత సమాజ దృక్పథాన్ని గ్రహించేందుకు మా ప్రయత్నం మాత్రమే. ఈ పోల్ లింక్ అందని వారు ఉండవచ్చు, సమాచారం చేరనివారైనా ఉండొచ్చు. టెక్నికల్ పరిమితుల వల్ల కొంతమంది ఈ అభిప్రాయ సేకరణలో పాల్గొనలేకపోయే అవకాశముంది. అందువల్ల ఓట్లలో తక్కువ సంఖ్య వచ్చిన అభ్యర్థులు దీనిని ఒక మైనస్ పాయింట్‌గా కాకుండా, ప్రజల స్పందనను అర్థం చేసుకునే అవకాశంగా భావించాలని కోరుతున్నాం . తుది అభ్యర్థిని నిర్ణయించే అధికారం పూర్తిగా తెలుగుదేశం పార్టీ అధిష్టానానికే చెందినదని మరోసారి స్పష్టంగా తెలియజేస్తున్నాం. ఈ ఫలితాలను ఎవరికీ అపకీర్తి కలిగించాలన్న ఉద్దేశమేమీ లేదు. ఎవరి స్ధానానికి గాని, అభిమానం లేదా మద్దతుకి గాని అంగీహారంగా గానీ తీసుకోకూడదు. ఈ ప్రక్రియ ప్రజలతో ఓ చొరవగా జరిగిన ఒక సృజనాత్మక ప్రజాస్వామ్య చర్య మాత్రమే.

విశేష గమనిక :- ఈ అభిప్రాయ సేకరణ ప్రక్రియలో మొత్తం 1877 ఓట్లు నమోదు అయ్యాయి. వీటిలో 1869 ఓట్లు వ్యాలిడ్ కాగా, 8 ఓట్లు ఇన్వాలిడ్ (అసమృద్ధిగా పూర్తి చేసినవి లేదా స్పష్టత లేని ఎంపికలతో ఉన్నవి)గా గుర్తించబడ్డాయి. ఇంకొంతమంది అభ్యర్థులకు వచ్చిన ఓట్ల శాతం చాలా తక్కువగా ఉండవచ్చు. అయితే, దాన్ని వారి ప్రజాదరణ తక్కువగా ఉందని తేల్చడం సబబు కాదు. దీనికి పలు కారణాలు ఉండవచ్చు.

ఆయా అభ్యర్థుల అనుచరులకు ఈ పోల్ వివరాలు అందకపోయి ఉండవచ్చు, సోషల్ మీడియాలో ప్రచారం తక్కువగా జరిగి ఉండవచ్చు, టెక్నికల్ పరిమితుల వల్ల వారు పాల్గొనలేకపోయి ఉండవచ్చు, పలువురు పోలింగ్ వివరాలను గుర్తించకపోవచ్చు లేదా వాట్సాప్ లింక్ చేరకపోయి ఉండవచ్చు . ఈ కారణాలన్నిటినీ దృష్టిలో ఉంచుకొని, తక్కువ ఓట్లు వచ్చిన అభ్యర్థులపై ఎలాంటి తక్కువ చూపు లేకుండా, ఈ అభిప్రాయ సేకరణను ఒక స్ఫూర్తిగా తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం. ఇది ప్రజల స్పందనను తెలుసుకునే ఓ సామాజిక ప్రయత్నం మాత్రమే, తుది అభ్యర్థుల ఎంపికకు సంబంధించిన అధికారిక ప్రక్రియ కాదని మరోసారి స్పష్టం చేస్తున్నాము .

మన న్యూస్ – ప్రజల అభిప్రాయమే మా శక్తి. సత్యం, నిష్పక్షపాతత, సమగ్రత – మా విలువలు , మన న్యూస్ – ప్రజల మాటనే మా మార్గదర్శకం, నిజాయితీ | పారదర్శకత | బాధ్యతాయుతం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *