కూటమి నేతల ఆధ్వర్యంలో తెట్టుగుంటపల్లి గ్రామంలో ఒక్కరోజు ముందే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ – ప్రజల్లో హర్షం

వెదురుకుప్పం , మన న్యూస్ :- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు గౌరవనీయులు నారా చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకు, అలాగే ప్రభుత్వ విప్ మరియు గంగాధర నెల్లూరు నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ వి.ఎం. థామస్ సూచనలతో, ఈ రోజు వెదురుకుప్పం మండలం బొమ్మాయపల్లి పంచాయతీ తెట్టుగుంటపల్లి గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకంను ఒక్కరోజు ముందుగానే అమలు చేశారు. ఈ కార్యక్రమం కూటమి నాయకుల సమన్వయంతో జరగడం విశేషం. పెన్షన్లు ముందుగా అందడంతో లబ్ధిదారులు పూర్తి సంతృప్తి వ్యక్తం చేశారు. వృద్ధులు, దివ్యాంగులు, విధవులు ఇలా అనేక లబ్ధిదారులు తమ అభినందనలు తెలిపారు. ఒక లబ్ధిదారుడు మాట్లాడుతూ – “ఇప్పుడే మాకు పెన్షన్ వచ్చింది. మేము ప్రభుత్వానికి ఎంతో కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఇదొక గొప్ప నిర్ణయం.” అన్నారు. ఈ కార్యక్రమం ప్రజా భాగస్వామ్యంతో, స్థానిక నేతల చొరవతో విజయవంతంగా పూర్తయ్యింది. ప్రభుత్వ సంకల్పం, కూటమి నాయకుల సేవా దృక్పథం కలసి గ్రామీణ అభివృద్ధికి తోడ్పడుతున్నాయనడానికి ఇది ఒక చక్కటి ఉదాహరణ. ఈ కార్యక్రమంలో గురుసాల కిషన్ చంద్ – నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు , బట్టె చాణిక్య ప్రతాప్ – వాణిజ్య విభాగ అధ్యక్షులు , పాముల శేషాద్రి కుమార్ – బిజెపి ఎస్సీ మోచన్ ప్రధాన కార్యదర్శి , పవన్ & ప్రసాద్ – బూత్ కన్వీనర్లు , సుబ్రహ్మణ్యం – బొమ్మయపల్లి ప్రధాన కార్యదర్శి, ముని వెంకటప్ప, మునిశేఖర్ – గ్రామ నేతలు , యువ నాయకులురెడ్డి కుమార్, నాగార్జున, సురేష్, కరుణ శ్రావణ్, అజిత్ రెడ్డి, మహిళా పోలీస్ శ్వేత, అంగన్వాడి టీచర్ విశాలాక్షి తదితరులు పాల్గొన్నారు.

Related Posts

ఆర్థిక సాయం అందజేసిన జనసేన పార్టీ నా సేన కోసం నా వంతు రాష్ట్ర కమిటీ మెంబర్ బోగినేని కాశీరావు….///

సీతారామపురం :(మన ద్యాస న్యూస్ ):ప్రతినిధి నాగరాజు ://// కంటి సంబంధిత అనారోగ్య సమస్యల కారణంగా చూపుకోల్పోయి వైద్య చికిత్సలు చేయించుకుంటున్న సీతారామపురం లోని సినిమా హాల్ వీధి కి చెందిన ఎడమకంటి సుబ్రహ్మణ్యం అనే నిరుపేదకు వైద్య ఖర్చుల నిమిత్తం…

కొండాపురం లో జనసేన మండల అధ్యక్షులు ఆకుల వెంకట్ ఆదర్వం లో జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభం…

కొండాపురం : (మన ద్యాస న్యూస్ ):ప్రతినిధి,నాగరాజు :///// వేములపాటి అజయ్ కుమార్ సూచనల మేరకు కొట్టే వెంకటేశ్వర్లు గారి సారథ్యంలో కొండాపురం మండలం జనసేన పార్టీ అధ్యక్షులు ఆకుల వెంకట్ ఆధ్వర్యంలో నూతన పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమం ఈరోజు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

ఆర్థిక సాయం అందజేసిన జనసేన పార్టీ నా సేన కోసం నా వంతు రాష్ట్ర కమిటీ మెంబర్ బోగినేని కాశీరావు….///

  • By NAGARAJU
  • September 12, 2025
  • 2 views
ఆర్థిక సాయం అందజేసిన జనసేన పార్టీ నా సేన కోసం నా వంతు రాష్ట్ర కమిటీ మెంబర్ బోగినేని కాశీరావు….///

బీసీలకిచ్చిన ఎన్నికల వాగ్దానాలు అమలు పరచాలి:రాష్ట్ర జేఏసీ చైర్మన్ జ్ఞాన జగదీష్

బీసీలకిచ్చిన ఎన్నికల వాగ్దానాలు అమలు పరచాలి:రాష్ట్ర జేఏసీ చైర్మన్ జ్ఞాన జగదీష్

కొండాపురం లో జనసేన మండల అధ్యక్షులు ఆకుల వెంకట్ ఆదర్వం లో జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభం…

  • By NAGARAJU
  • September 12, 2025
  • 5 views
కొండాపురం లో జనసేన మండల అధ్యక్షులు ఆకుల వెంకట్ ఆదర్వం లో జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభం…

నేపాల్ లో చిక్కుకున్న తెలుగు వారిని కాపాడటంలో లోకేష్ బాబు చొరవ చూపర్… రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వ కార్యదర్శి బొల్లినేని వెంకట రామారావు…

  • By NAGARAJU
  • September 12, 2025
  • 4 views
నేపాల్ లో చిక్కుకున్న తెలుగు వారిని కాపాడటంలో లోకేష్ బాబు చొరవ చూపర్… రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వ కార్యదర్శి బొల్లినేని వెంకట రామారావు…

కొత్త జిల్లాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం – అమరావతి కేంద్రంగా అర్బన్‌ జిల్లా..///

  • By NAGARAJU
  • September 12, 2025
  • 5 views
కొత్త జిల్లాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం – అమరావతి కేంద్రంగా అర్బన్‌ జిల్లా..///

నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//

  • By NAGARAJU
  • September 12, 2025
  • 8 views
నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//