

మన న్యూస్ మే 29: – పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట ప్రధాన రహదారు వద్ద కాలువలు నిర్మాణం చేపట్టి ప్రజలకు రక్షణ కల్పించాలని కోరుతూ సిఐటియు రైతు సంఘం ఐద్వా ప్రజాసంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు కోరాడ ఈశ్వరరావు మహిళా సంఘం నాయకులు కొరటాల శాంతి కుమారి బొబ్బిలి లతా రమణమ్మ కొరటాల నాగవేణి స్థానికులు చింతగడ రామస్వామి గద్ది పాము రాములు బోను గౌరి నాయుడు ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు కోరాడ ఈశ్వరరావు మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో పాచిపెంట ప్రదానరహదారి నిర్మించారని అప్పటినుండి ఇప్పటివరకు కాలువలు ఏర్పాటు చేస్తామని ప్రభుత్వ అధికారులు చెప్పడమే తప్ప పట్టించుకునే పరిస్థితి లేదు, దీని కారణంగా ఎస్సీ వీధులన్నింటిలో విపరీతంగా నీరు చిన్నపాటి వర్షానికి మీరు చేరిపోయి, నడవడానికి తిరగడానికి,నరకయాతన పడుతున్నారని ప్రతిరోజు చిన్నపాటి వర్షానికి నీరు తోడుకుంటూ తీవ్రమైన ఇబ్బందులు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే అధికారులు యుద్ధ ప్రాతిపదికన స్పందించి కాలువ నిర్మాణం పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని కాలువ నిర్మాణం చేయకపోవడం వలన నీరు నిలవ ఎక్కువ ఉండడం వలన దోమలు చేరి అనేక విషజ్వరాలు డెంగు మలేరియా లాంటి ప్రమాదకరమైన వ్యాధులు ప్రజలు ఇబ్బందులు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.అధికారులు ముఖ్యంగా పంచాయతీ కార్యదర్శి సమస్యలు ఉన్న దగ్గరకు వచ్చి నీటి సమస్య పైన కాలువల సమస్య పైన తెలుసుకున్న రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ కేటాయింపులు చేయాలి కదా అని అధికారులు ఒక్కరే దీనికి బాధ్యత కాదు ప్రభుత్వం దీనికి బడ్జెట్ కేటాయింపులు పెంచి వెంటనే పనులు ప్రారంభించే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. మహిళా సంఘం నాయకులు కొరటాల శాంతి కుమారి మాట్లాడుతూ ప్రతిరోజు నీరు తోడుకుంటూ నరకయాతన పడుతున్నామని దోమలు చేరిపోయి నడవడానికి చాలా ఇబ్బందిగా ఉందని వెంటనే ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలని అన్నారు కాలువలు వెంటనే పూర్తి చేసే విధంగా చర్యలు చేపట్టకపోతే ఎంపీడీవో కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాన్ని చేపడతామని అన్నారు. వెంటనే కాలు నిర్మాణం పై అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని అందరూ కోరారు ఈ కార్యక్రమంలో మహిళలు ప్రజలు పాల్గొన్నారు.