మన న్యూస్,తిరుపతి మే 27 :- కడపలో మూడు రోజులపాటు జరుగుతున్న తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమంలో తిరుపతికి చెందిన బి.ఎం.ఆర్ ట్రావెల్స్ అధినేత, ఏర్పేడు మండల టిడిపి బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి గొడుగు మునిరాజా యాదవ్ మొదటిరోజు మంగళవారం హాజరయ్యారు. శ్రీకాళహస్తి నియోజకవర్గం ఏర్పేడు మండలం నుండి తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు పేరం నాగరాజు నాయుడు, కార్యనిర్వక కార్యదర్శి పుప్పాల సుబ్రహ్మణ్యం, మడిపాక మాజీ సర్పంచ్ రవి నాయుడు, టిడిపికి చెందిన దేవేందర్ నాయుడు గుణ యాదవ్, గోల్డ్ మాన్ శివ పార్టీ కార్యకర్తలు భారీగా తరలి వెళ్లినట్లు బొడుగు మునిరాజు యాదవ్ తెలుగు చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *