

మన న్యూస్ సాలూరు మే 17:- పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలంలో కుడుమూరు భూ పోరాట కమిటీ కన్వీనర్ అప్పలస్వామిఆధ్వర్యంలో కుడుమూరు మెట్టవలస వద్ద జరిగిన సభ లో సిపిఎం జిల్లా ప్రధాన కార్యదర్శి కొల్లి గంగు నాయుడు మాట్లాడుతూ కుడుమూరు 48 సర్వే నెంబర్ 782 ఎకరాల ప్రభుత్వ భూమి తాతల కాలం నుండి సాగు చేస్తున్న గిరిజనులకు నేటి కూడా పట్టాలు పంపిణీ చేయకపోవడం దుర్మార్గమని దీనికి వెంటనే అధికారులు స్పందించి పట్టాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. దశాబ్ద కాలంగా అనేక పోరాటాలు చేసిన నేటికీ కూడా సర్వేలు జరిపి కూడా పట్టాలు పంపిణీ చేయకపోవడం వలన ఈ భూములను కాజేయడానికి కొంత మంది వ్యక్తులు ప్రయత్నం చేస్తున్నారని, దీని ప్రజలంతా గమనిస్తున్నారని గిరిజనుల అంతా ఐక్యంగా ఉండి తమ భూములకు డి పట్టాలు మంజూరు చేసే వరకు పోరాటాలకు ముందుకు రావాలని తెలిపారు.సిపిఎం పార్టీ గిరిజనులకు ఎప్పుడు అండగా ఉంటుందని పేదలకు అండగా ఉంటుందని అన్నారు. దీనికి నిరసనగా ఈనెల 23 నుండి 25 వరకు మూడు రోజులు పాటు పాదయాత్రలు జరుపుతున్నట్లు తెలిపారు. వెంటనే పట్టాల మంజూరు చేయకపోతే పోరాటాలను మరింత ఉధృతం చేస్తామన్నారు. సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యలు ఎన్ వై నాయుడు మాట్లాడుతూ స్వతంత్రం వచ్చి ఇన్నేళ్లయిన నేటికీ కూడా గిరిజనులకు మౌలిక సదుపాయాలు కరువయ్యాయని పట్టాల కోసం ఇప్పటివరకు దరఖాస్తులు పెట్టుకున్న పట్టించుకోకపోవడం వలన పేదలు భూములు ముఖ్యంగా గిరిజనుల భూములు అన్యాక్రాంతమవుతున్నాయని కుడుమూరు 48 సర్వే నెంబరు లో సాగు చేస్తున్నటువంటి గిరిజనులందరికి కూడా పట్టాలు పంపిణీ చేయకపోతే భవిష్యత్తులో ఎమ్మార్వో కార్యాలయం వద్ద ఆందోళన కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. కుడుమూరు భూ పోరాట కమిటీ కన్వీనర్ అప్పలస్వామి మాట్లాడుతూ ఈ భూములను అనేకమంది పెద్దలు గద్దల్ల వాలి తన్నుకు పోవాలని ప్రయత్నం చేస్తున్నారని గిరిజనులను ఐక్యంగా ఉన్న వారిని విడదీసి ఇబ్బందులు గురి చేస్తున్నారని తప్పుడు కేసులు పెట్టి భయభ్రాంతులకు గురి చేస్తున్నారని వెంటనే పెట్టిన కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు కోరాడ ఈశ్వరరావు అధికారులు వెంటనే స్పందించకపోతే ఎమ్మార్వో కార్యాలయం వద్ద ధర్నా కార్యక్రమాన్ని కూడా చేపడతామని వెంటనే పట్టాలు మంజూరు చేయాలని గత ప్రభుత్వ హయాంలో సర్వేలు చేసినటువంటి వివరాలు నేటి కూడా బహిర్గతం చేయకపోవడం సరైనది కాదని ప్రస్తుత మంత్రివర్యులు గుమ్మిడి సంధ్యారాణి కూడా దీనికి సమాధానం చెప్పాలని ప్రతిపక్ష ఎమ్మెల్సీగా ఉండేటప్పుడు సమస్య పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చిన మంత్రి నేడు హామీ నిలబెట్టుకుని గిరిజనులకు భూములు పంపిణీ విషయంలో కృషి చేయాలని అన్నారు. కోడుమూరు భూ పోరాట కమిటీ సభ్యులు సుర్రు గంగయ్య,మాదల జమ్మరాజు, రామయ్య, గమ్మెల గోపాలు, కొర్ర కళ్యాణ్,కొర్ర శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు, కుడుమూరు సమస్యల పరిష్కారం కై ఈనెల 23 నుండి 25 వరకు మూడు రోజులపాటు జరిగే పాదయాత్రలను జయప్రదం చేయాలని భవిష్యత్ పోరాటానికి గిరిజల్లంత ఐక్యంగా కదిలి సమస్త పరిష్కారం కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు.
