గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారం పంపిణీ

మన న్యూస్ సింగరాయకొండ:-సాంఘిక సంక్షేమ శాఖ ప్రభుత్వ వసతి గృహాలకు వార్డెన్ గా పనిచేసి ఎ. ఎస్. డబ్ల్యూ.ఓ రిటైర్డ్ అయిన మేడికొండ లక్ష్మీనరుసు నాలుగవ వర్ధంతి సందర్భంగా శ్రీశ్రీ విద్యార్థి ఫౌండేషన్ చైర్మన్ గుడిమెట్ల శ్రీనివాసులు, ఆధ్వర్యంలో పాత సింగరాయకొండ పంచాయతీ పరిధిలోని బాలిరెడ్డి నగర్ అంగన్వాడి కేంద్రం నందు చిన్నారులకు మరియు గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారం పంపిణీ చేశారు. గుడిమెట్ల శ్రీనివాసులు మాట్లాడుతూ ఎంతోమంది పేద విద్యార్థులకు దిశానిర్దేశం చేసిన తమ గురువుకి ఈ విధంగా నివాళి అర్పించడం ఆనందంగా ఉన్నదని,పేద విద్యార్థులకు విద్యాపరమైన ప్రోత్సాహం అందించుటకు తమ వంతు సహకారం ఎల్లప్పుడు ఉంటుందన్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిధిగా పాల్గొన్న న్యాయవాది పంతగాని వెంకటేశ్వర్లు ఈ సందర్భంగా మాట్లాడుతూ తమతో పాటుగా సింగరాయకొండ ప్రభుత్వ హాస్టల్లో వసతి పొంది ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యసించిన ఎందరో విద్యార్థులు నేడు దేశంలోని నలుమూలల వివిధ ప్రభుత్వ శాఖలలో, ప్రైవేట్ రంగంలో ఉన్నత స్థానం పొందిఉన్నారన్నారు. అదేవిధంగా చిన్నతనం నుండే సర్దుబాటుతనం,విద్యలో పోటీతత్వం,నాయకత్వ లక్షణాలు, తమ తోటి వారితో మసులుకొనే విధానం,తమ హక్కులను సాధించుటకు పోరాడే తత్వం,వ్యవస్థలోని కట్టుబాటులకు లోబడి జీవించే విధానం లాంటి లక్షణాలను అలవాటు చేసుకోవటంతో పాటుగా ఎంతోమంది స్నేహితులను అందించిన సాంఘిక సంక్షేమ హాస్టళ్ల లోని జీవన విధానం తమకు ఉన్నతమైనదన్నారు.తమ గురువు లక్ష్మీనరసుకి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో ఐసిడిఎస్ సూపర్వైజర్ షేక్ రిజ్వానా, ప్రభుత్వ హాస్టల్ పూర్వ విద్యార్థులు బొందు ప్రసాద్,పులి అంకయ్య మరియు అంగన్వాడి సిబ్బంది పాల్గొన్నారు.

Related Posts

ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

శంఖవరం/ ప్రత్తిపాడు మన ధ్యాస ప్రతినిధి:- కాకినాడ జిల్లా కిర్లంపూడి లో గురువారం రాజమహేంద్రవరం కి చెందిన పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు మాజీ మంత్రి వైసిపి పిఏసి సభ్యులు ముద్రగడ పద్మనాభం ను మర్యాదపూర్వకంగా కలిశారు.…

ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

శంఖవరం మన ధ్యాస ప్రతినిధి:- కాకినాడ పార్లమెంట్ సభ్యులు తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ కృషితో ప్రత్తిపాడు నియోజకవర్గంలో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం ఏర్పాటు చేశారు. వివరాల్లోకెళ్తే.. శంఖవరం మండలంలో గిరిజన గ్రామాలైన వేళంగి,పెదమల్లాపురం తదితర గ్రామాలకు నిలిచిపోయిన ఆర్టీసీ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

కొత్త జిల్లాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం – అమరావతి కేంద్రంగా అర్బన్‌ జిల్లా..///

  • By NAGARAJU
  • September 12, 2025
  • 2 views
కొత్త జిల్లాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం – అమరావతి కేంద్రంగా అర్బన్‌ జిల్లా..///

నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//

  • By NAGARAJU
  • September 12, 2025
  • 4 views
నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//

ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి