శ్రీ కామాక్షితాయి అమ్మవారి బ్రహ్మోత్సవాలకు 2025 సేవా కమిటి ఏర్పాటు

మన న్యూస్, కోవూరు, ఏప్రిల్ 29:- ఎమ్మెల్యే ప్రశాంతమ్మ చొరవతో 12 మందితో ఏర్పడిన కమిటీ.- మే 17 నుంచి 27 వరకు జరగనున్న బ్రహ్మోత్సవాలు.బుచ్చిరెడ్డిపాళెం మండలం జొన్నవాడ క్షేత్రంలోని శ్రీ కామాక్షితాయి అమ్మవారి ఆలయానికి నూతన సేవా కమిటీని ఏర్పాటు చేస్తూ రాష్ట్ర దేవాదాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. రానున్న అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాల నేపథ్యంలో కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి సేవా కమిటీని ఏర్పాటు చేయాలని రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి దృష్టికి తీసుకువెళ్లగా.. ఈ మేరకు కమిటీని ఏర్పాటు చేస్తూ ఆదేశాలు ఇచ్చారు. శ్రీ కామాక్షితాయి అమ్మవారి సేవా కమిటీలో తిరువూరు అశోక్ రెడ్డి, కనపర్తి నాగేంద్ర, నక్కల శివకృష్ణ తిరువాయిపతి నందకుమార్, ముంగర సుధాకర్, శశి శేఖర్ శర్మ (అర్చక), పాలూరు చాముండేశ్వరి, కొల్లపూడి శారద, పెన్నత్తూరు సుమలత, గండ్రకోట రమాదేవి, జొన్నలగడ్డ వరలక్ష్మి, ఇమ్మడిశెట్టి సౌజన్య లక్ష్మి గార్లు ఎన్నికయ్యారు. వీరు మే 17 నుంచి 27 వరకు జరగనున్న అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో సేవలు అందించనున్నారు. ఈ సందర్భంగా సేవా కమిటీ సభ్యులు ఎమ్మెల్యే ప్రశాంతమ్మకు, దేవాదాయ శాఖ మంత్రికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. త్వరలోనే ఈ కమిటీ సభ్యులతో ఎమ్మెల్యే ప్రశాంతమ్మ ప్రత్యేకంగా భేటీ కానున్నారు.

Related Posts

ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

శంఖవరం/ ప్రత్తిపాడు మన ధ్యాస ప్రతినిధి:- కాకినాడ జిల్లా కిర్లంపూడి లో గురువారం రాజమహేంద్రవరం కి చెందిన పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు మాజీ మంత్రి వైసిపి పిఏసి సభ్యులు ముద్రగడ పద్మనాభం ను మర్యాదపూర్వకంగా కలిశారు.…

ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

శంఖవరం మన ధ్యాస ప్రతినిధి:- కాకినాడ పార్లమెంట్ సభ్యులు తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ కృషితో ప్రత్తిపాడు నియోజకవర్గంలో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం ఏర్పాటు చేశారు. వివరాల్లోకెళ్తే.. శంఖవరం మండలంలో గిరిజన గ్రామాలైన వేళంగి,పెదమల్లాపురం తదితర గ్రామాలకు నిలిచిపోయిన ఆర్టీసీ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

నేపాల్ లో చిక్కుకున్న తెలుగు వారిని కాపాడటంలో లోకేష్ బాబు చొరవ చూపర్… రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వ కార్యదర్శి బొల్లినేని వెంకట రామారావు…

  • By NAGARAJU
  • September 12, 2025
  • 2 views
నేపాల్ లో చిక్కుకున్న తెలుగు వారిని కాపాడటంలో లోకేష్ బాబు చొరవ చూపర్… రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వ కార్యదర్శి బొల్లినేని వెంకట రామారావు…

కొత్త జిల్లాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం – అమరావతి కేంద్రంగా అర్బన్‌ జిల్లా..///

  • By NAGARAJU
  • September 12, 2025
  • 3 views
కొత్త జిల్లాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం – అమరావతి కేంద్రంగా అర్బన్‌ జిల్లా..///

నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//

  • By NAGARAJU
  • September 12, 2025
  • 6 views
నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//

ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు