

మన న్యూస్, వెదురుకుప్పం:- ఆదివారం వెదురుకుప్పం మండలం చవట గుంట బిజెపి పార్టీ కార్యాలయం దగ్గర 45 వ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. వెదురుకుప్పం మండలం అధ్యక్షుడు బి అశోక్ రెడ్డి మరియు ఉపాధ్యక్షులు సోమశేఖర్ రాజు, మోహన్ రెడ్డి, శంకర్ రెడ్డి అధ్యక్షతన పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది, ఈ కార్యక్రమానికి జీడి నెల్లూరు నియోజకవర్గం అసెంబ్లీ ఇంచార్జ్ జి రాజేంద్రన్,రాష్ట్ర కౌన్సిల్ మెంబరు హనుమంత్ రెడ్డి,పార్టీ సీనియర్ నాయకులు చెంగారెడ్డి, ప్రభాకర్ రాజు, మండల ప్రధాన కార్యదర్శి బాలాజీ రెడ్డి,ఎస్సీ మోక్ష అధ్యక్షుడు ప్రకాష్, సోషల్ మీడియా ఇన్ఛార్జ్ బి గుణశేఖర్ రెడ్డి, మండల కార్యదర్శి ఎస్ రాజేందర్ రెడ్డి, కిషన్మోర్చా అధ్యక్షుడు నరసింహారెడ్డి, మండల కార్యవర్గ సభ్యులు టి సుబ్రమణ్యం రెడ్డి , మురళి,పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు , పాల్గొన్నారు.
