

ఉరవకొండ మన న్యూస్:విడపనకల్లు మండలానికి రెగ్యులర్ తాసిల్దార్ ను నియమించి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ శనివారం స్థానిక తాసిల్దార్ కార్యాలయం ముందు సిపిఐ పార్టీ ఆందోళన చేపట్టింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఐ పార్టీ నియోజకవర్గ నాయకులు చెన్నారాయుడు మాట్లాడుతూ గత అనేక రోజులుగా మండలానికి రెగ్యులర్ తాసిల్దార్ లేకపోవడం వల్ల ఇన్చార్జిలతోనే పాలన కొనసాగిస్తున్నారని అయితే గత 20 రోజులుగా మండలానికి ఇన్చార్జి తాసిల్దార్ కూడా లేకపోవడం వల్ల విద్యార్థులకు రైతులు కావలసిన ధ్రువీకరణ పత్రాలు అందక అనేక ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. 19 గ్రామాల నుంచి ప్రతిరోజు వివిధ పనుల కోసం ప్రజలు తాసిల్దార్ కార్యాలయానికి వస్తున్నారని అయితే పనులు కాక అనేక ఇబ్బందులకి గురవుతున్నారని తెలిపారు. రెగ్యులర్ తాసిల్దారు లేకపోవడం వల్ల కింద స్థాయి సిబ్బంది కూడా కార్యాలయానికి సక్రమంగా హాజరు కావడం లేదన్నారు. 12 గంటలైనా ఏ ఒక్క అధికారి కూడా కార్యాలయానికి రావడం లేదన్నారు. దీనిపై జిల్లా కలెక్టర్ పూర్తి స్థాయిలో స్పందించాలని మండలానికి రెగ్యులర్ తాసిల్దార్ నియమించాలన్నారు.
కర్ణాటక రాష్ట్ర సరిహద్దులో కొంతమంది కాంట్రాక్టర్లు విచ్చలివిడిగా ప్రభుత్వ కొండలను, గుట్టలను తవ్వి మట్టిని రోడ్లకు, పెట్రోల్ బంకుల కు మరియు ఇతర అభివృద్ధి పనులకు యదేక్షగా అక్రమంగా తరలిస్తున్నారని దీనిని అరికట్టాలని అనేకసార్లు రెవిన్యూ కార్యాలయంలో ఫిర్యాదు చేసినప్పటికీ. ఎవరు కూడా స్పందించడం లేదన్నారు. కాంట్రాక్టర్ల తో అధికారులు కుమ్మక్కు కావడం వల్ల కాంట్రాక్టర్లు పెట్రేగిపోతున్నారు అన్నారు. ప్రతిరోజు వందల వాహనాలలో అక్రమంగా మట్టిని తరలిస్తున్నారని జిల్లా ఉన్నతాధికారులైన దీనిపై స్పందించాలన్నారు. మూడు రోజుల్లో మండలం కి రెగ్యులర్ తాసిల్దార్ నియమించకపోతే సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలను నిర్వహిస్తామన్నారు. ఈ ఆందోళన కార్యక్రమంలో వివిధ గ్రామాల నుంచి వచ్చిన పార్టీ నాయకులు, కార్యకర్తలు రైతులు పాల్గొన్నారు.