విడపనకల్లుకు రెగ్యులర్ తాసిల్దార్ ను నియమించాలని సిపిఐ ఆందోళన

ఉరవకొండ మన న్యూస్:విడపనకల్లు మండలానికి రెగ్యులర్ తాసిల్దార్ ను నియమించి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ శనివారం స్థానిక తాసిల్దార్ కార్యాలయం ముందు సిపిఐ పార్టీ ఆందోళన చేపట్టింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఐ పార్టీ నియోజకవర్గ నాయకులు చెన్నారాయుడు మాట్లాడుతూ గత అనేక రోజులుగా మండలానికి రెగ్యులర్ తాసిల్దార్ లేకపోవడం వల్ల ఇన్చార్జిలతోనే పాలన కొనసాగిస్తున్నారని అయితే గత 20 రోజులుగా మండలానికి ఇన్చార్జి తాసిల్దార్ కూడా లేకపోవడం వల్ల విద్యార్థులకు రైతులు కావలసిన ధ్రువీకరణ పత్రాలు అందక అనేక ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. 19 గ్రామాల నుంచి ప్రతిరోజు వివిధ పనుల కోసం ప్రజలు తాసిల్దార్ కార్యాలయానికి వస్తున్నారని అయితే పనులు కాక అనేక ఇబ్బందులకి గురవుతున్నారని తెలిపారు. రెగ్యులర్ తాసిల్దారు లేకపోవడం వల్ల కింద స్థాయి సిబ్బంది కూడా కార్యాలయానికి సక్రమంగా హాజరు కావడం లేదన్నారు. 12 గంటలైనా ఏ ఒక్క అధికారి కూడా కార్యాలయానికి రావడం లేదన్నారు. దీనిపై జిల్లా కలెక్టర్ పూర్తి స్థాయిలో స్పందించాలని మండలానికి రెగ్యులర్ తాసిల్దార్ నియమించాలన్నారు.
కర్ణాటక రాష్ట్ర సరిహద్దులో కొంతమంది కాంట్రాక్టర్లు విచ్చలివిడిగా ప్రభుత్వ కొండలను, గుట్టలను తవ్వి మట్టిని రోడ్లకు, పెట్రోల్ బంకుల కు మరియు ఇతర అభివృద్ధి పనులకు యదేక్షగా అక్రమంగా తరలిస్తున్నారని దీనిని అరికట్టాలని అనేకసార్లు రెవిన్యూ కార్యాలయంలో ఫిర్యాదు చేసినప్పటికీ. ఎవరు కూడా స్పందించడం లేదన్నారు. కాంట్రాక్టర్ల తో అధికారులు కుమ్మక్కు కావడం వల్ల కాంట్రాక్టర్లు పెట్రేగిపోతున్నారు అన్నారు. ప్రతిరోజు వందల వాహనాలలో అక్రమంగా మట్టిని తరలిస్తున్నారని జిల్లా ఉన్నతాధికారులైన దీనిపై స్పందించాలన్నారు. మూడు రోజుల్లో మండలం కి రెగ్యులర్ తాసిల్దార్ నియమించకపోతే సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలను నిర్వహిస్తామన్నారు. ఈ ఆందోళన కార్యక్రమంలో వివిధ గ్రామాల నుంచి వచ్చిన పార్టీ నాయకులు, కార్యకర్తలు రైతులు పాల్గొన్నారు.

Related Posts

వాతావరణ మార్పుల ప్రభావం–ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి: శివ కిషోర్

ఉరవకొండ మన ధ్యాస: వజ్రకరూరు మండల కేంద్రంలోని స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బుధవారం క్లైమేట్ కేర్ ఛాంపియన్స్ ప్రోగ్రాం (స్వస్తి ) బృందం తనిఖీ చేశారు. శివ కిషోర్ స్టేట్ ప్రోగ్రాం మేనేజర్, డాక్టర్ తన్మయి మేనేజర్ వేదిక అసోసియేట్…

ఉపరాష్ట్రపతి ఎన్నిక కేవలం వ్యక్తి ఎన్నిక కాదు

ఉరవకొండ మన ధ్యాస: నిమ్న వర్గాల గౌరవానికి సంబంధించిన విషయం బలహీనవర్గాల విజయం అని తెలియజేసిన భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు యల్.నాగేంద్ర కుమార్ భారత రాజ్యాంగ పరిరక్షణ, ప్రజాస్వామ్యం, సామాజిక న్యాయం ఉప రాష్ట్రపతి బాధ్యతలలో…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

ఎన్నికల్లో హామీలు ఇచ్చాం ఎన్ని కష్టాలు వచ్చినా తీర్చాం.

ఎన్నికల్లో హామీలు ఇచ్చాం ఎన్ని కష్టాలు వచ్చినా తీర్చాం.

వాతావరణ మార్పుల ప్రభావం–ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి: శివ కిషోర్

వాతావరణ మార్పుల ప్రభావం–ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి: శివ కిషోర్

ఉపరాష్ట్రపతి ఎన్నిక కేవలం వ్యక్తి ఎన్నిక కాదు

ఉపరాష్ట్రపతి ఎన్నిక కేవలం వ్యక్తి ఎన్నిక కాదు

సింగరాయకొండ మండలంలో అధికారులతో సమీక్షా సమావేశం

  • By JALAIAH
  • September 10, 2025
  • 2 views
సింగరాయకొండ మండలంలో అధికారులతో సమీక్షా సమావేశం

పాకల జడ్పీహెచ్ఎస్‌లో మహిళాభివృద్ధి శాఖ అవగాహన కార్యక్రమం

  • By JALAIAH
  • September 10, 2025
  • 3 views
పాకల జడ్పీహెచ్ఎస్‌లో మహిళాభివృద్ధి శాఖ అవగాహన కార్యక్రమం

మదర్ ల్యాండ్ సొసైటీ స్వచంద సంస్థ ఆధ్వర్యం హెచ్ ఐ వి/ ఎయిడ్స్ , మత్తు పదార్దాల వినియోగం పై అవగాహన కార్యక్రమం

  • By JALAIAH
  • September 10, 2025
  • 3 views
మదర్ ల్యాండ్ సొసైటీ స్వచంద సంస్థ ఆధ్వర్యం హెచ్ ఐ వి/ ఎయిడ్స్ , మత్తు పదార్దాల వినియోగం పై అవగాహన కార్యక్రమం