గూడూరు ప్రజల తీర్పుని అవమానపరిచే హక్కు వైసీపీకి లేదు!

గూడూరు, మన న్యూస్ :- గూడూరులో ఓటమిని తట్టుకోలేక… ఓటమిని గౌరవించలేక… ప్రజల తీర్పును తుంచేసే స్థాయికి వైసీపీ నేతలు మాటలు ద్వారా దిగజారారని తిరుపతి జిల్లా తెలుగు యువత అధికార ప్రతినిధి కుంచం దయాకర్ విమర్శించారు.. శుక్రవారం ఆయన మాట్లాడుతూ ప్రజల ఓటుతో గెలిచిన ఎమ్మెల్యే డాక్టర్ పాశం సునీల్ కుమార్ ది “యమధర్మ పాలన” అంటారా? అంటే గూడూరు ప్రజలు యముని గెలిపించారా? ఇది ప్రజలపై చేసిన అగౌరవం కాదు అంటారా? వాస్తవానికి గత ప్రభుత్వ ఐదేళ్ల పాలనలో వైసీపీ నేతలే గూడూరును నరకం చేశారు. గంజాయి మాఫియా, మైనింగ్ మాఫియా, ఇసుక మాఫియా, రియల్ ఎస్టేట్ మాఫియా, మద్యం మాఫియా, సెటిల్‌మెంట్లు, బెదిరింపులు… ప్రజలు ఇంట్లో భయంతో ఉండే రోజులు మీరే తీసుకొచ్చారు. అసలు “యమధర్మ పాలన” అంటే అదే. …ప్రజలు మీ పాలనను తిరస్కరించి మార్పు కోసమే టీడీపీకి అధిక మెజారిటీ ఇచ్చారు. మీకు నీతి గురించి మాట్లాడే అర్హత లేదు. ఎమ్మెల్యే గెలిచిన నెల రోజుల్లోనే శాంతి చేకూర్చి, అవినీతికి అడ్డుకట్ట వేసే పాలన అందిస్తుంటే దాన్ని చూడలేక బిక్కుబిక్కుమంటున్నారు.. ప్రజల సాక్షిగా చెబుతున్నాం – వైసీపీకి ప్రజల తీర్పును అవమానించడమో, దానికి వ్యతిరేకంగా విష ప్రచారం చేయడమో ఆఖరి పరిణామం కలుగుతుంది. ఇకనైనా వైసీపీ నేతలు తమ మాటలకు అద్దం చూపించుకోవాలి. లేకపోతే గూడూరు ప్రజలే తగిన బుద్ధి చెబుతారు.. గతంలో నియోజకవర్గంలోని దళితులను ఇబ్బంది పెట్టే వారిని ఇప్పుడు ఆ పరిస్థితి లేదని కొంతమంది వైసిపి నాయకులు సునీల్ కుమార్ ని ఎత్తి పెట్టుకో ఉన్నారని ఇకనైనా వైసీపీ నేతలు బుద్ధి మార్చుకుని ప్రభుత్వానికి సహకరించి నియోజకవర్గం అభివృద్ధి బాటలో నడిచేందుకు తోడ్పాటు అందించాలని దయాకర్ కోరారు

Related Posts

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

శంఖవరం/ అన్నవరం మన ధ్యాస ప్రతినిధి (అపురూప్):-జాతీయ రహదారి పై ప్రమాదాలను నివారించేందుకు భారీ కసరత్తు చేపడుతున్నారు.శ్రీ కాకినాడ జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్ ఐపీఎస్ సూచనల మేరకు మరియు పెద్దాపురం డి.ఎస్.పి డి శ్రీహరి రాజు ఆదేశాలతో ప్రత్తిపాడు…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

శంఖవరం మన ధ్యాస ప్రతినిధి (అపురూప్):- విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణంగా బోధన జరగాలని ఉపాధ్యాయులకు సమగ్ర శిక్ష (కెజిబివి) కార్యదర్శి డి దేవానందరెడ్డి సూచించారు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం మండల కేంద్రం శంఖవరం కస్తూర్భా గాంధీ బాలికా విద్యాలయ (కెజిబివి)…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

ప్రైవేటీకరణతో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో: సిపిఐ

ప్రైవేటీకరణతో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో: సిపిఐ

దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

  • By NAGARAJU
  • September 10, 2025
  • 4 views
దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్ సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

  • By NAGARAJU
  • September 10, 2025
  • 5 views
అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్  సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///