శాకాంబరిదేవి అమ్మవారి సేవలో పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్..

మన న్యూస్ ఐరాల జులై-10:- కాణిపాకం స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానం అనుబంధ ఆలయమైన మకరధాంభిక సమేత శ్రీ మణికంఠేశ్వర స్వామి ఆలయంలో ఆషాఢ పౌర్ణమిని పురస్కరించుకుని శాకాంబరి దేవి అమ్మవారికి ప్రత్యేక పూజలు శోభాయమానంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మకరధాంభిక అమ్మవారు శాకాంబరి దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. శాకాంబరి దేవి అమ్మవారిని 20 టన్నుల పండ్లు, ఆకుకూరలు, కూరగాయలతో అమ్మవారికి విశేషంగా ఆలయ అర్చకులు అలంకరించారు. ఈ పర్వదినం సందర్భంగా పూతలపట్టు శాసనసభ్యులు డాక్టర్  కలికిరి మురళీమోహన్ ఆలయానికి విచ్చేసి అమ్మవారికి పూజా సామగ్రి సమర్పించి, అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీస్సులు అందుకున్నారు. అనంతరం ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక హోమాది కార్యక్రమాల్లో ఆయన పాల్గోన్నారు. అనంతరం ఆలయ వేద పండితులు ఎమ్మెల్యేకి వేదాశీర్వచనం అందించి అమ్మవారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పవిత్ర ఆషాఢ పౌర్ణమి సందర్భంగా కాణిపాకం మకరధాంభిక సమేత శ్రీ మణికంఠేశ్వర స్వామి ఆలయంలో 20 టన్నుల కూరగాయలు, పండ్లు, ఆకుకూరలతో అలంకరించిన శాకాంబరి దేవి అలంకారాన్ని దర్శించడం నిజంగా ఒక ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించిందన్నారు. శాకాంబరి దేవి అమ్మవారికి ప్రత్యేకపూజలు నిర్వహించడం పుణ్యఫలంగా భావిస్తున్నాని, అమ్మవారి ఆశీస్సులతో పూతలపట్టు నియోజకవర్గం అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని కోరుకున్నట్లు ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాణిపాకం ఆలయ ఈవో పెంచల కిషోర్, పూతలపట్టు నియోజకవర్గం పరిశీలకులు బొమ్మన శ్రీధర్, రాష్ట్ర కార్యదర్శి వెంకటేష్ చౌదరి, ఐరాల మండల అధ్యక్షులు గంగారపు హరిబాబు నాయుడు, బంగారుపాళ్యం మండల అధ్యక్షులు ఎన్.పి.ధరణీ నాయుడు, కాణిపాకం మాజీ ఆలయ ఛైర్మన్ మణినాయుడు, మాజీ జెడ్పీటీసీ లతా బాబునాయుడు, నాయకులు గోపి యాదవ్, మద్దిపాట్లపల్లె చౌదరి, జైకుమార్, సొప్పా నాని తదితరులు పాల్గోన్నారు.

Related Posts

మండలంలో విద్యార్థులతో మెగా పేరెంట్స్ టీచర్స్ ఆత్మీయ సమావేశాలు…

శంఖవరం మన న్యూస్ ప్రతినిధి;- కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం శంఖవరం మండలంలోని మండల ప్రజా పరిషత్తు ప్రాధమిక పాఠశాలలు, మండల‌ పరిషత్తు ప్రాధమికోన్నత పాఠశాలలు, గిరిజన సంక్షేమ ప్రాధమిక పాఠశాలు, జిల్లా ప్రజా పరిషత్తు ఉన్నత పాఠశాలలు, గిరిజన సంక్షేమ…

ఉన్నతమైన విద్య భావితరాల భవిష్యత్తు రూపుదిద్దుకుంటుంది..

_ రెఫరల్ చైర్మన్ స్లెస్సర్ బాబు శంఖవరం మన న్యూస్ ప్రతినిధి:- విద్యార్థులకు ఉన్నతమైన విద్య భావితరాల భవిష్యత్తు రూపుదిద్దుకుంటుందని అని కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం శంఖవరం మండలం సీతయ్యమ్మపేట రూరల్ ఇండియా సెల్ఫ్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఛైర్మన్, రెఫరల్…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

మండలంలో విద్యార్థులతో మెగా పేరెంట్స్ టీచర్స్ ఆత్మీయ సమావేశాలు…

మండలంలో విద్యార్థులతో మెగా పేరెంట్స్ టీచర్స్ ఆత్మీయ సమావేశాలు…

ఉన్నతమైన విద్య భావితరాల భవిష్యత్తు రూపుదిద్దుకుంటుంది..

ఉన్నతమైన విద్య భావితరాల భవిష్యత్తు రూపుదిద్దుకుంటుంది..

భక్తిశ్రద్ధలతో గురు పౌర్ణమి వేడుకలు

భక్తిశ్రద్ధలతో గురు పౌర్ణమి వేడుకలు

గురు పౌర్ణమి వేడుకల్లో పాల్గొన్న ముద్రగడ

గురు పౌర్ణమి వేడుకల్లో పాల్గొన్న ముద్రగడ

చల్లగా చూడవయ్యా..కరుణను చూపవయ్యా..కావాగారవయ్య శ్రీ సాయిబాబా.!సాయిబాబా మందిరంలో ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ప్రత్యేక పూజలు.!!

చల్లగా చూడవయ్యా..కరుణను చూపవయ్యా..కావాగారవయ్య శ్రీ సాయిబాబా.!సాయిబాబా మందిరంలో ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ప్రత్యేక పూజలు.!!

పిల్లల బంగారు భవిష్యత్తు కోసం.. బడివైపు ఒక అడుగు..!లక్ష్యం ఉంటే పేదరికం చదువుకు అడ్డు కాదు..మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 2.0 లో ఎమ్మెల్యే కాకర్ల సురేష్..!

పిల్లల బంగారు భవిష్యత్తు కోసం.. బడివైపు ఒక అడుగు..!లక్ష్యం ఉంటే పేదరికం చదువుకు అడ్డు కాదు..మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 2.0 లో ఎమ్మెల్యే  కాకర్ల సురేష్..!