ప్రసన్న కుమార్ రెడ్డి పై జగన్ రెడ్డి చర్యలు తీసుకోవాలి…మహిళలను కించపరిచే విధంగా మాట్లాడటం తగదు-మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ..

మన న్యూస్,తిరుపతి :– కొవ్వూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి పై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి పై జగన్ రెడ్డి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర గ్రీనరీ అండ్ బ్యూటీఫికేషన్ కార్పొరేషన్ చైర్మన్ మన్నూరు సుగుణమ్మ తెలిపారు. ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి పై ప్రసన్నకుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా మంగళవారం సుగుణమ్మ ఇంటిముందు పార్టీ నాయకులు కార్యకర్తలతో ప్లకార్డులు చేతపట్టి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సుగుణమ్మ మాట్లాడుతూ వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన వాక్యాలు వైసిపి దిగజారుడుతనానికి పరాకాష్టాన్ని దుయ్యపెట్టారు. మహిళల వ్యక్తిత్వ హననానికి పాల్పడుతూ ప్రసన్నకుమార్ రెడ్డి చేసిన అస్లీల పదజాలాన్ని ఖండించడానికి కూడా జగన్ రెడ్డి ముందుకు రాకపోవడం మహిళలను అవమానించడమే అన్నారు. ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను సొంత కుటుంబ సభ్యులు స్వాగతిస్తారా అని ప్రశ్నించారు. మహిళలను కించపరిచే అడుగడుగున అవమానపరిచే నీచ సంస్కృతి జగన్ రెడ్డి పార్టీకే తగునని పేర్కొన్నారు. సొంత చెల్లెలు షర్మిల చీర కట్టుకోవడం పైన జగన్ రెడ్డి అండ్ కో విమర్శలు చేశారని గుర్తు చేశారు. మహిళల ఆత్మగౌరవాన్ని ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసేలా మాట్లాడిన వైసిపి నేతలపై ప్రభుత్వం చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.రాష్ట్ర నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ రుద్రకోటి సదాశివం మాట్లాడుతూ రాజకీయాలలో మహిళలు లాగే సంస్కృతి వైసిపి తోనే మొదలైందని ప్రజలు తగిన బుద్ధి చెప్పి 11 సీట్లకే పరిమితం చేసిన వారికి బుద్ధి రాలేదన్నారు. మహిళలపై నీచంగా వ్యాఖ్యలు చేసిన వైసిపి నేతలపై ఏనాడు ఆ పార్టీ ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. జగన్ రెడ్డి సొంత బాబాయ్ హత్య కేసులో న్యాయం చేయమని ప్రశ్నించినందుకు వైయస్ సునీత రెడ్డి పై ఆస్తిలో న్యాయబద్ధమైన వాటా అడిగినందుకు వైయస్ షర్మిలపై సోషల్ మీడియాలో అత్యంత నీచంగా పోస్టులు పెట్టించారన్నారు. వైసీపీ నేత ప్రసన్నకుమార్ రెడ్డి చేసిన వాక్యాలకు జగన్ రెడ్డి బేసరత్తుగా మహిళలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో రాష్ట్ర రజక కార్పొరేషన్ డైరెక్టర్ కరాటే చంద్ర, టిడిపి తిరుపతి పార్లమెంట్ అధికార ప్రతినిధి మునిశేఖర రాయల్, టౌన్ బ్యాంక్ మాజీ డైరెక్టర్లు బాలసుబ్రమణ్యం రెడ్డి, రామ్మూర్తి రాయల్, రజక సంఘం నేత అశోక్, మేడికుర్తి విశ్వనాథ్ మహిళలు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

Related Posts

ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

శంఖవరం/ ప్రత్తిపాడు మన ధ్యాస ప్రతినిధి:- కాకినాడ జిల్లా కిర్లంపూడి లో గురువారం రాజమహేంద్రవరం కి చెందిన పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు మాజీ మంత్రి వైసిపి పిఏసి సభ్యులు ముద్రగడ పద్మనాభం ను మర్యాదపూర్వకంగా కలిశారు.…

ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

శంఖవరం మన ధ్యాస ప్రతినిధి:- కాకినాడ పార్లమెంట్ సభ్యులు తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ కృషితో ప్రత్తిపాడు నియోజకవర్గంలో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం ఏర్పాటు చేశారు. వివరాల్లోకెళ్తే.. శంఖవరం మండలంలో గిరిజన గ్రామాలైన వేళంగి,పెదమల్లాపురం తదితర గ్రామాలకు నిలిచిపోయిన ఆర్టీసీ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

  • By JALAIAH
  • September 11, 2025
  • 3 views
విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…