ఆటోనగర్ అభివృద్ధికి సహకరించిన ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు – ఎస్కే చాంద్ బాషా

గూడూరు. మన న్యూస్ :- పట్టణంలో ఆటోనగర్ ఏర్పడినప్పటి నుంచి దాన్ని అభివృద్ధి కొరకు పట్టుదలతో కృషి చేయడం జరిగిందని, నేడు ఆటోనగర్ అభివృద్ధి కి బాటలు వేయడం సంతోషకరమని, ఆటోనగర్ యూనియన్ సభ్యులు ఎస్కే చాంద్ బాషా పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక డివిజనల్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో సంబంధిత డిప్యూటీ మేనేజర్ చంద్రశేఖర్ రెడ్డి నెల్లూరు నుండి గూడూరు రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వచ్చిన సందర్భంగా ఆటోనగర్ యూనియన్ సభ్యులు ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను ఆటోనగర్ ఏర్పడినప్పటి నుంచి యూనియన్ సభ్యులతో కలిసి ఆటోనగర్ అభివృద్ధికి సహకరించాలని సంబంధిత అధికారులను, ప్రజా ప్రతినిధులను కలిసి వినతులు సమర్పించడం జరిగిందని, ఆటోనగర్ 2020 ప్రారంభమైందని, అప్పటి నుండి 120 ప్లాట్లు అలాట్మెంట్ అయ్యాయని, అందులో భాగంగా నేడు ఐదు ప్లాట్ లకు రిజిస్ట్రేషన్లు జరిగాయని, మిగిలిన వాటికి కూడా రిజిస్ట్రేషన్లు త్వరలో పూర్తి చేయడం జరుగుతుందని ఆశ భావం వ్యక్తం చేశారు. ఆటోనగర్ అభివృద్ధికి స్థానిక ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ సంబంధిత ఉన్నతాధికారుల దృష్టికి తమ సమస్యను తీసుకళ్లడం జరిగిందని, ఉన్నత స్థాయి అధికారులతో పాటు, స్థానిక అధికారులతో కూడా ఆటోనగర్ అభివృద్ధి కోసం ఎమ్మెల్యే పలు దఫాలుగా చర్చించడం జరిగిందని, ఆటోనగర్ అభివృద్ధికి సహకరించిన ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ కు ఆటోనగర్ యూనియన్ తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని, అలాగే రిజిస్ట్రేషన్ కు సహకరించిన అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మిర్చి పల సుబ్రహ్మణ్యం, ఆటో నగర్ యూనియన్ సభ్యు పాల్గొన్నారు.

Related Posts

ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

శంఖవరం/ ప్రత్తిపాడు మన ధ్యాస ప్రతినిధి:- కాకినాడ జిల్లా కిర్లంపూడి లో గురువారం రాజమహేంద్రవరం కి చెందిన పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు మాజీ మంత్రి వైసిపి పిఏసి సభ్యులు ముద్రగడ పద్మనాభం ను మర్యాదపూర్వకంగా కలిశారు.…

ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

శంఖవరం మన ధ్యాస ప్రతినిధి:- కాకినాడ పార్లమెంట్ సభ్యులు తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ కృషితో ప్రత్తిపాడు నియోజకవర్గంలో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం ఏర్పాటు చేశారు. వివరాల్లోకెళ్తే.. శంఖవరం మండలంలో గిరిజన గ్రామాలైన వేళంగి,పెదమల్లాపురం తదితర గ్రామాలకు నిలిచిపోయిన ఆర్టీసీ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

  • By JALAIAH
  • September 11, 2025
  • 3 views
విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…