

మన న్యూస్ పాచిపెంట జూన్ 5:= పార్వతిపురం మన్యం జిల్లా పాచిపెంట మండలంలో ఉపాదా హామీ చట్టాన్ని సక్రమంగా అమలు చేయాలి బిల్లులు సకాలంలో చెల్లించాలి పని చేసిన చోట మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ. పాచిపెంట మండలం పనుకువలస గ్రామం లో దేశం తల్లి చెరువు వద్ద ఉపాధి పనులు పరిశీలన చేసి కూలీలతో మాట్లాడటం జరిగింద. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు చెల్లూరి. జగన్నా దం ఆర్ లచ్చయ్య సిఐటియు నాయకులు కోరాడ ఈశ్వరరావు మాట్లాడుతూ పనులు చేసి నెలలు గడుస్తున్న నేటి వరకు కూలి డబ్బులు చెల్లించకపోవడం అన్యాయమని చట్టంలో పనులు చేసిన 14 రోజుల్లో బిల్లులు చెల్లించాలని ఉన్న, అమలు చేయడం లేదని తెలిపారు. వెంటనే చేసిన పనులకు బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేశారు. పనిచేసే చోట నీడ మంచినీళ్లు మందులు వంటి సౌకర్యం లేకపోవడం వలన కూలీలు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉందని ఇటీవల కాలంలో అనేకమంది వడదెబ్బతో చనిపోయిన ఘటనలు జిల్లాలో జరిగాయని తెలిపారు. కావున పని చేసిన చోట మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు. వ్యవసాయంలో పనులు తగ్గిపోవడం వలన కూలీలు పనులు లేక ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉందని సంవత్సరానికి ₹200 రోజులు పని రోజు కూలి 600 రూపాయలు చెల్లించే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని కోరారు. ఉపాధి హామీ పనులు అవినీతి అక్రమాలకు దూరంగా పాదదర్శకంగా అమలు చేసే విధంగా చర్యలు చేపట్టాలని కోరారు. చేసిన పనులకు వెంటనే బిల్లులు చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని లేనియెడల ఆందోళన పోరాటం ఉదృతం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రెయ్య బంగారు రాజు మండల సీతమ్మ నీలాద్రి పారయ్య లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు.