

మన న్యూస్,తిరుపతి, : రాష్ట్ర హస్తకళల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ గురువారం మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ కు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ మర్యాదపూర్వకంగా శాలువతో సత్కరించి చేతి కళలతో తయారుచేసిన ఏనుగు ప్రతిమను అందజేశారు. అనంతరం పవన్ కళ్యాణ్ ఆశీస్సులను డాక్టర్ హరిప్రసాద్ స్వీకరించారు.