నవ ధాన్యాల సాగుతో రైతులకు సిరులు పంట -అధికారులుతో రైతుల విజయ గాధలు

మన న్యూస్ పాచిపెంట,ఏప్రిల్ 26:- నవధాన్యాల సాగు మూడు నుండి ఐదు సంవత్సరాల పాటు చేపట్టడం ద్వారా ఎలాంటి ఎరువులు వాడకుండానే రసాయన ఎరువులు సగానికి తగ్గించి అధిక దిగుబడులు పొందవచ్చని పాచిపెంట మండల రైతులు రేయి వెంకట్రావు,లండ నారాయణరావు తెలిపారు.శనివారం నాడు ప్రకృతి వ్యవసాయ ప్రాంతీయ శిక్షకులు హేమ సుందర్ వద్ద తమ అనుభవాలను వివరించారు.గత మూడు సంవత్సరాలుగా వేసవిలో పీఎండీఎస్ నవధాన్య విత్తనాలను వేసి పత్తి మరియు మొక్కజొన్న మూడు ఎకరాలలో సాగు చేస్తున్నానని భూమి ఆరోగ్యం మెరుగుపడటం వలన రసాయన ఎరువులపై పెట్టుబడి తగ్గడమే కాకుండా ప్రస్తుతం దిగుబడి కూడా పెరిగిందని అమ్మ వలస గ్రామ రైతు రెయ్యి వెంకట్రావు అన్నారు. అనంతరం కర్రివలసలో తమ వరి వ్యవసాయ క్షేత్రంలో గత ఐదు సంవత్సరాలుగా పీఎండిఎస్ నవధాన్య విత్తనాలను సాగు చేస్తున్నానని ప్రస్తుతం ఎలాంటి రసాయన ఎరువులు వాడకపోయినా చుట్టుపక్కల రైతుల కంటే ఎక్కువగానే దిగబడి వస్తుందని దీనిని చూసి ఈ సంవత్సరం ఆ రైతులందరూ నవధాన్యాల సాగుకు ముందుకు వస్తున్నారని తాను కూడా తన పది ఎకరాల పత్తి మరియు మొక్కజొన్న క్షేత్రాలలో ప్రస్తుతం పీఎండీఎస్ నవధాన్యాల వేస్తున్నానని తెలిపారు. దీనివలన కలుపు రాకుండా ఉంటుందని పంట ఆరోగ్యంగా ఎదగడమే కాకుండా అధిక దిగుబడి వస్తుందని రైతు లండా నారాయణరావు తెలిపారు.ఈ సందర్భంగా ప్రకృతి వ్యవసాయ ప్రాంతీయ శిక్షకులు హేమ సుందర్ మాట్లాడుతూ మండలంలో రైతులు కొన్ని సంవత్సరాలుగామొక్కజొన్న తర్వాత మరల మొక్కజొన్న సాగు చేస్తూ ఉండడం వల్ల ప్రస్తుత మొక్కజొన్న పంట రసాయన ఎరువులకు స్పందించడం తగ్గడం వలన దిగుబడులు తగ్గుముఖం పట్టాయని దీనిని నివారించాలంటే ఏకైక మార్గం పీఎండీఎస్ నవధాన్యాలు విత్తనాలు సాగు చేసి కలియ దున్ని మొక్కజొన్నతో పాటుగా బహుళ పంటలు వేసుకుంటే దిగుబడులు గణనీయంగా పెరగడమే కాకుండా భూమి యొక్క భౌతిక స్వభావం మెరుగుపడి భూమిలో ఉన్న సూక్ష్మజీవుల వృద్ధి జరిగి పంటకు కావలసిన అన్ని రకాల పోషకాలు అందుతాయని అంతేకాకుండా మిత్ర పురుగుల వృద్ధి జరుగుతుందని భూమి యొక్క నీటి నిల్వ సామర్థ్యం పెరుగుతుందని వేసవిలో సారవంతమైన మట్టి కొట్టుకొని పోకుండా ఉంటుందని నేలలో సేంద్రియ కర్బన శాతం పెరగడం వల్ల రసాయన ఎరువులపై ఖర్చు తగ్గుతుందని కాబట్టి రైతులందరూ తప్పనిసరిగా పీఎండిఎస్ నవధాన్య విత్తనాలను కలియదున్నారని కోరారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారి తిరుపతిరావు ప్రకృతి సేద్య సిఆర్పిలు విజయ్ తిరుపతి నాయుడు శ్రీను సురేష్ కుమార్ మరియు సుమలత పాల్గొన్నారు.

Related Posts

అనధికారిక లేఔట్లను ఎల్.ఆర్.ఎస్ ద్వారా రెగ్యులైజ్ చేయించుకోండి…… కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

మన ధ్యాస,కోవూరు, సెప్టెంబర్ 12: అక్రమ లేఅవుట్లను ఆదిలోనే అడ్డుకునే విషయంలో అధికారులు కఠినంగా వ్యవహరించాలి .కోవూరు నియోజకవర్గ పరిధిలో నుడా నిబంధనలు పాటించని అనధికార లే అవుట్ల యజమానులు 2025 అక్టోబర్ 30వ తేదీ లోపు అపరాధ రుసుం చెల్లించి…

ప్రజల అవసరాలు గుర్తించి పరిపాలన చేసే మానవతావాది చంద్రబాబు నాయుడు………. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

మన ధ్యాస ,ఇందుకూరుపేట ,సెప్టెంబర్ 12:. జగదేవి పేటలో 50 లక్షలతో సిసి రోడ్ల ప్రారంభోత్సవం. – మరో 50 లక్షల నుడా నిధులతో డ్రైన్ల నిర్మాణానికి శ్రీకారం .అభివృద్ధి, సంక్షేమం ఏకకాలంలో అమలు చేసే పాలనా దక్షత ముఖ్యమంత్రి చంద్రబాబు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

అనధికారిక లేఔట్లను ఎల్.ఆర్.ఎస్ ద్వారా రెగ్యులైజ్ చేయించుకోండి…… కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

అనధికారిక లేఔట్లను ఎల్.ఆర్.ఎస్ ద్వారా రెగ్యులైజ్  చేయించుకోండి…… కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

ప్రజల అవసరాలు గుర్తించి పరిపాలన చేసే మానవతావాది చంద్రబాబు నాయుడు………. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

ప్రజల అవసరాలు గుర్తించి పరిపాలన చేసే మానవతావాది చంద్రబాబు నాయుడు………. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

మరోసారి మానవత్వం చాటుకున్న గంగవరం ఆడపడుచులు…

మరోసారి మానవత్వం చాటుకున్న గంగవరం ఆడపడుచులు…

అచ్చంనాయుడుది నోరేనా ………మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి

అచ్చంనాయుడుది  నోరేనా ………మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి

ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆటో డ్రైవర్లు పండుగ వాతావరణంలో ఉన్నారు…….. షేక్ అబ్దుల్ అజీజ్, కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి

ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆటో డ్రైవర్లు పండుగ వాతావరణంలో ఉన్నారు……..  షేక్ అబ్దుల్ అజీజ్, కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి

నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా ఆంధ్రప్రదేశ్ సమాచార మరియు ప్రజా సంబంధాల (ఐ అండ్ పి ఆర్) శాఖ డైరెక్టర్ హిమాన్షు శుక్లా