16వ సచివాలయంలో P4 అవగాహనా సదస్సు – పాల్గొన్న మాజీ కౌన్సిలర్ లు చెంచురామయ్య, ఇశ్రాయేల్ కుమార్

గూడూరు, మన న్యూస్ :- రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన P4 కార్యక్రమం గూర్చి అవగాహన సదస్సు 16వ సచివాలయం లో వార్డు ఎడ్యుకేషన్ సెక్రటరీ శ్రీరాములు అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఆ ఏరియా మాజీ కౌన్సిలర్లు బిల్లు చెంచురామయ్య, తాతపూడి ఇశ్రాయేల్ కుమార్ లు ముఖ్య అతిథులుగా పాల్గొని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన P4 కార్యక్రమం ప్రజలు, ప్రభుత్వం దాతలు కలసి రాష్ట్రంలో దారిద్యరేఖకు దిగువన ఉన్న 20 శాతం మంది ప్రజలకు ఆర్థికంగా ఎదిగేందుకు విద్య, ఉపాధి అవకాశాలు అందించేందుకు ధనవంతులైన వారు వ్యక్తిగతంగా కానీ వారి సంస్థల ద్వారా గాని సహకారం అందించి రాబోవు 2047వ సంవత్సరం లోపల పేదరికం రాష్ట్రంలో పూర్తిగా నిర్మూలించే బృహత్తర కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు చేపట్టారని , దానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని, సచివాలయం సిబ్బంది మీ వార్డు పరిధిలోని పేదలను గుర్తించి, సరైన లబ్దిదారుల జాబితాను తయారు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులైన ఎస్సీ సెల్ పట్టణ వైస్ ప్రెసిడెంట్ వేల్పుల రమేష్ కుమార్, 17వ యూనిట్ ఇంచార్జ్ ఆవుల వెంకటేశ్వర్లు , పట్టణ తెలుగు యువత ఉపాధ్యక్షుడు యదనపర్తి మధురెడ్డి, 26వ వార్డు టిడిపి అధ్యక్షుడు నరసరాజు, టిఎన్ఎస్ఎఫ్ నాయకుడు లల్లు ప్రసాద్ యాదవ్, 16వ సచివాలయ సిబ్బంది మరియు సచివాలయ పరిధిలోని ఎగువ వీరారెడ్డిపల్లి, మాళవ్య నగర్, ఇందిరా నగర్ ప్రజలు పాల్గొన్నారు.

Related Posts

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

చిత్తూరు,మనధ్యాస,సెప్టెంబర్11 చిత్తూరు లో ఘనంగా పెదిరెడ్డి మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు.తనను నమ్మిన వారికోసం ఎంతదాకైనా పోరాడే మా జగనన్న సైన్యాధిపతి, పెద్దాయన మానసపుత్రుడు, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి జన్మదిన వేడుకలు హరిణి రెడ్డి ఆధ్వర్యంలో 5…

విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

సైబర్ మోసాల కి గురి కావద్దు అప్రమత్తంగా ఉండాలి. ప్రతి ఒక్కరూ సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలి సంబంధం లేని వ్యక్తుల నుండి వచ్చే మెసేజ్ ల కు స్పందించవద్దు మన ధ్యాస రిపోర్టర్ పసుమర్తి జాలయ్య సింగరాయకొండ:- దేశం…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

  • By JALAIAH
  • September 11, 2025
  • 3 views
విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..