బాబు షూరిటీ మోసం గ్యారంటీ – మాజీ డిప్యూటీ సీఎం పిడికి రాజన్న దొర

మన న్యూస్ సాలూరు జూలై 21:- పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలంలో చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో అబద్ధపు హామీలు ఇచ్చి గెలిచారని మాజీ డిప్యూటీ సీఎం పిడికిరాజన్న దొర అన్నారు. నేను మాట ఇస్తే తప్పకుండా ఆ మాటకు కట్టుబడి పనిచేసే తీరుతానని అన్నారు. బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా సోమవారం కురుకూటి గ్రామాన్ని సందర్శించారు. ఆ గ్రామానికి చేరుకున్న రాజన్నకు గ్రామస్తులు ఆదివాసీలు నృత్యాలతో అలరించిన పిదప, మహిళలు మంగళ హారతులిచ్చి పూలమాలలతో స్వాగింతించారు. ఈ సందర్భంగా రాజన్న దొర మాట్లాడుతూ, ఎన్నికలలో చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు అబద్ధాలు చెప్పి ఓట్లు వేయించుకున్నారని అన్నారు. తీరా గెలిచిన తర్వాత ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా మోసం చేశారన్నారు. అలాగే మంత్రి సంధ్యారాణి ఈ గ్రామంలో ఏం చేశారని అన్నారు. 2015 నుండి 2021 వరకు ఎమ్మెల్సీగా ఉన్న ఆరేళ్లలో సంధ్యారాణి నియోజవర్గ అభివృద్ధికై ఏ విధంగా పాటుపడ్డారో తెలియజేయాలన్నారు. ప్రజలకు హామీలిచ్చి వెళ్ళిపోవడం కాదన్నారు. హామీలు ఇస్తే తప్పక నెరవేర్చాలన్నారు. అలాగే నేను నాలుగు తరాలు ఎమ్మెల్యేగా ఒకసారి మంత్రిగా ఉన్నప్పుడు నియోజకవర్గానికి తన వంతుగా అభివృద్ధి కోసం ఏ విధంగా కృషి చేశానో నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసన్నారు. పార్టీలకతీతంగా అందరికీ సేవ చేస్తూ నియోజకవర్గ అభివృద్ధి కోసం కృషి చేశాను కనుకా నన్ను నాలుగు దపాలు మీరందరూ గెలిపించారన్నారు. అనంతరం చంద్రబాబునాయుడు చేసిన మోసాల జాబితా తాలుకా కరపత్రాలను ప్రతి ఇంటికి ఇచ్చి ప్రజలకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ రెడ్డి సురేష్, భరత్ శ్రీనివాస్, దండి శీను తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Related Posts

ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

శంఖవరం/ ప్రత్తిపాడు మన ధ్యాస ప్రతినిధి:- కాకినాడ జిల్లా కిర్లంపూడి లో గురువారం రాజమహేంద్రవరం కి చెందిన పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు మాజీ మంత్రి వైసిపి పిఏసి సభ్యులు ముద్రగడ పద్మనాభం ను మర్యాదపూర్వకంగా కలిశారు.…

ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

శంఖవరం మన ధ్యాస ప్రతినిధి:- కాకినాడ పార్లమెంట్ సభ్యులు తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ కృషితో ప్రత్తిపాడు నియోజకవర్గంలో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం ఏర్పాటు చేశారు. వివరాల్లోకెళ్తే.. శంఖవరం మండలంలో గిరిజన గ్రామాలైన వేళంగి,పెదమల్లాపురం తదితర గ్రామాలకు నిలిచిపోయిన ఆర్టీసీ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

నేపాల్ లో చిక్కుకున్న తెలుగు వారిని కాపాడటంలో లోకేష్ బాబు చొరవ చూపర్… రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వ కార్యదర్శి బొల్లినేని వెంకట రామారావు…

  • By NAGARAJU
  • September 12, 2025
  • 2 views
నేపాల్ లో చిక్కుకున్న తెలుగు వారిని కాపాడటంలో లోకేష్ బాబు చొరవ చూపర్… రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వ కార్యదర్శి బొల్లినేని వెంకట రామారావు…

కొత్త జిల్లాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం – అమరావతి కేంద్రంగా అర్బన్‌ జిల్లా..///

  • By NAGARAJU
  • September 12, 2025
  • 3 views
కొత్త జిల్లాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం – అమరావతి కేంద్రంగా అర్బన్‌ జిల్లా..///

నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//

  • By NAGARAJU
  • September 12, 2025
  • 6 views
నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//

ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు