10వ తరగతి మూల్యాంకనం రెమ్యునరేషన్ సొమ్ము చెల్లించండి: ఎస్టియూ డిమాండ్

మన న్యూస్ చిత్తూరు జులై-18:- ఈరోజు చిత్తూరు జిల్లా విద్యాశాఖ కార్యాలయం నందు గౌరవ ఏడి వెంకటేశ్వరరావుని కలిసి వినతి పత్రం సమర్పించడం అయినది. పదవ తరగతి పరీక్షలు పూర్తయి మూడు మాసాలైనా ఇంతవరకు పేపర్లు దిద్దిన ఉపాధ్యాయులకు ఇవ్వవలసిన రెమ్యునరేషన్  చెల్లించలేదని వెంటనే చెల్లించడానికి చర్యలు చేపట్టాలని తెలియజేయడమైనది. అలాగే చిత్తూరు జిల్లాలో బదిలీలకు ముందు ఇచ్చిన ప్రమోషన్లలో సోషల్ స్టడీస్, గణితం, బయాలజీ సబ్జెక్టులకు సంబంధించి పదోన్నతుల పోస్టులు మిగిలిపోయాయని , వెంటనే మిగిలిన పోస్టులను పదోన్నతి ద్వారా భర్తీ చేసినట్లయితే  సబ్జెక్టు నిపుణుల కొరత ఉన్న పాఠశాలలకు న్యాయం జరుగుతుందని తెలిపారు. అలాగే స్కూల్ అసిస్టెంట్ స్పెషల్ ఎడ్యుకేషన్ పోస్టులను కూడా పదోన్నతి ద్వారా భర్తీ చేయాలని తెలపడం అయినది. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకం అమల్లో భాగంగా వివిధ ప్రాథమిక పాఠశాలలకు నేరుగా సరఫరా చేయకుండా క్లస్టర్ కేంద్రాల్లో  సన్న బియ్యం, రాగి పిండి ఇస్తున్నారని దీనివలన ప్రాథమిక పాఠశాలల కేంద్రాలకు తీసుకు వెళ్లడానికి ఉపాధ్యాయులు ఇబ్బంది పడుతున్నారని కావున నేరుగా క్లస్టర్ పాఠశాలల్లో కాకుండా సరఫరా చేయవలసిన పాఠశాలలకు  నేరుగా పంపిణీ చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్టియూ రాష్ట్ర అసోసియేట్ అద్యక్షులు ఘంటా మోహన్, చిత్తూరు జిల్లా శాఖ అధ్యక్షులు మదన్ మోహన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి మోహన్ యాదవ్ మరియు సంఘ నాయకులు  లింగమూర్తి యాదవ్, నరేంద్ర తదితరులు పాల్గొన్నారు.

Related Posts

విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

సైబర్ మోసాల కి గురి కావద్దు అప్రమత్తంగా ఉండాలి. ప్రతి ఒక్కరూ సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలి సంబంధం లేని వ్యక్తుల నుండి వచ్చే మెసేజ్ ల కు స్పందించవద్దు మన ధ్యాస రిపోర్టర్ పసుమర్తి జాలయ్య సింగరాయకొండ:- దేశం…

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

శంఖవరం/ అన్నవరం మన ధ్యాస ప్రతినిధి (అపురూప్):-జాతీయ రహదారి పై ప్రమాదాలను నివారించేందుకు భారీ కసరత్తు చేపడుతున్నారు.శ్రీ కాకినాడ జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్ ఐపీఎస్ సూచనల మేరకు మరియు పెద్దాపురం డి.ఎస్.పి డి శ్రీహరి రాజు ఆదేశాలతో ప్రత్తిపాడు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

ఎల్బీనగర్లో ప్రమాదం

ఎల్బీనగర్లో ప్రమాదం

విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

  • By JALAIAH
  • September 11, 2025
  • 2 views
విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

ప్రైవేటీకరణతో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో: సిపిఐ

ప్రైవేటీకరణతో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో: సిపిఐ