108, 102, 1962 అంబులెన్సుల తనిఖీ – సేవలపై దృష్టి – ప్రథమ చికిత్సలో లోపాలుంటే కఠిన చర్యలు,హెచ్చరికలు

నారాయణపేట, మన న్యూస్ జూలై 11 :- జిల్లాలోని వివిధ మండలాల్లో సేవలందిస్తున్న 108 (వైద్య అంబులెన్స్), 102 (అమ్మ ఒడి), 1962 (మొబైల్ వెటర్నరీ) అంబులెన్సులపై అకస్మాత్తుగా తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో భాగంగా అంబులెన్సుల్లో ఉన్న రికార్డులు, మందులు, అత్యవసర వైద్య పరికరాలను పరిశీలించారు.ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ఈఎంఆర్ఐ సంస్థ స్టోర్ అధికారి సత్యనారాయణ స్వయంగా పర్యవేక్షించారు. అంబులెన్స్‌లో తగిన మందులు ఉండేలా చూసుకోవడంతో పాటు, అత్యవసర సమయంలో ప్రజలకు సకాలంలో సేవలు అందేలా ప్రథమ చికిత్సకు అన్ని ఏర్పాట్లు ఉండాలంటూ సిబ్బందికి స్పష్టమైన సూచనలు చేశారు.ఈ తనిఖీలో ఉమ్మడి జిల్లా ప్రోగ్రాం మేనేజర్ రవికుమార్, నారాయణపేట జిల్లా ఈఎంఈ రాఘవేంద్ర, అలాగే అంబులెన్స్ సిబ్బంది పాల్గొన్నారు. ప్రజల ఆరోగ్యభద్రత కోసం ఇటువంటి తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని అధికారులు పేర్కొన్నారు.

Related Posts

టి బి ముక్త భారత్ కి ప్రతి ఒక్కరు సహకరించాలి.అనుమానం రాగానే వైద్య సేవలు పొందాలి.ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ వైద్యాధికారి ధీరేంద్ర పిలుపు

మన న్యూస్ సింగరాయకొండ:- ఆరోగ్య సంరక్షణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ ఉన్నత శ్రేణి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డా.ధీరేంద్ర పిలుపు ఇచ్చారు.సింగరాయకొండ చంద్రబాబు నాయుడు కాలనీ లోని ఉమర్…

ఘనంగా కొండేపి నియోజకవర్గం వైసీపీ కార్యకర్తల సమావేశం

మన న్యూస్ సింగరాయకొండ:- ప్రకాశం జిల్లా, కొండపి: మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ పీఏసీ సభ్యులు, కొండపి నియోజకవర్గ సమన్వయకర్త డా. ఆదిమూలపు సురేష్ గారి ఆధ్వర్యంలో “బాబు ష్యూరిటీ మోసం – గ్యారెంటీ” పేరుతో నిర్వహించిన విశేష సమావేశం ఘనంగా జరిగింది.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

టి బి ముక్త భారత్ కి ప్రతి ఒక్కరు సహకరించాలి.అనుమానం రాగానే వైద్య సేవలు పొందాలి.ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ వైద్యాధికారి ధీరేంద్ర పిలుపు

టి బి ముక్త భారత్ కి ప్రతి ఒక్కరు సహకరించాలి.అనుమానం రాగానే వైద్య సేవలు పొందాలి.ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ వైద్యాధికారి ధీరేంద్ర పిలుపు

ఘనంగా కొండేపి నియోజకవర్గం వైసీపీ కార్యకర్తల సమావేశం

ఘనంగా కొండేపి నియోజకవర్గం వైసీపీ కార్యకర్తల సమావేశం

మీ ప్రాణం మీ భద్రత .ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి సురక్షిత ప్రయాణం చేయాలి .ఎస్సై నాగమల్లేశ్వర రావు పిలుపు.

మీ ప్రాణం మీ భద్రత .ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి సురక్షిత ప్రయాణం చేయాలి .ఎస్సై నాగమల్లేశ్వర రావు పిలుపు.

కూటమి పాలనలో అర్హులైన వారందరికీ సూపర్ సిక్స్ పథకాలు…

కూటమి పాలనలో  అర్హులైన వారందరికీ సూపర్ సిక్స్ పథకాలు…

ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించిన ఆర్ధిక మంత్రి పయ్యావుల కేశవ్.

ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించిన ఆర్ధిక మంత్రి పయ్యావుల కేశవ్.

మంత్రి కేశవ -కాలువ అభివృద్ధి పనుల పరిశీలన.

మంత్రి కేశవ -కాలువ అభివృద్ధి పనుల పరిశీలన.