బలవంతపు పాఠశాలల విలీనం ఆపాలి..కె.వి.పి.యస్.సి.ఐ.టి.యు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన.

గూడూరు, మన న్యూస్ :- తిరుపతి జిల్లా గూడూరు మండలం పరిధిలోని నెర్నూరు ఎస్సీ,ఎస్టీ,కాలనీలలో గురువారం నాడు కె.వి.పి.యస్.సి.ఐ.టి.యు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో “ఎస్సీ, ఎస్టీ బలహీన వర్గాల పేద పిల్లలను చదువులకు దూరం చేయొద్దు – బలవంతపు పాఠశాలల విలీనం ఆపాలి”అంటూ కరపత్రాలను పంపిణీ చేయడం జరిగింది. అనంతరం విస్తృతంగా పర్యటించి పాఠశాలలకు దూరం అయిన విద్యార్థులు తల్లిదండ్రులు కలవడం జరిగింది. అనంతరం నాయకులు మాట్లాడుతూ కూ టమి ప్రభుత్వం పాఠశాలల విలీనం ప్రక్రియతో జిల్లా,రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థుల తల్లిదండ్రులు అయోమయ పరిస్థితిని ఎదుర్కొనడం జరిగింది. విద్యాహక్కు చట్టం – 2009 కి తూట్లు పొడుస్తూ గత వైసిపి ప్రభుత్వానికి వంత పాడుతూ జిల్లాలో సుమారు 580 ప్రాథమిక పాఠశాలలను విలీనం చేస్తున్నారు అని, పిల్లలను రాజ్యాంగ విరుద్ధంగా కిలోమీటర్ల దూరంలో ఉండే గ్రామాలకు తరలిస్తూ బలవంతంగా మూడు, నాలుగు,ఐదు, తరగతులు పిల్లలను విలీనం చేయడం వల్ల ఎస్సీ,ఎస్టీ బలహీన వర్గాలకు సంబంధించిన వందలాదిమంది పిల్లలు చదువుకు దూరం అవుతున్నారని, దూర ప్రాంతాలకు తమ చిన్న పిల్లలను పంపలేక తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు, “మా బడిలోనే – మా పిల్లలను ఉంచాలని” రోడ్లమీదకు వచ్చి నెల రోజులుగా ఆందోళన చేస్తున్నారని, అప్ర జాస్వామికంగా చేస్తున్న పాఠశాలల విలీనాన్ని ఆపాలని విద్యార్థి మరియు ప్రజా సంఘాలు, నెలరోజుల నుండి నిరసనలు ధర్నాలు చేస్తూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి. ఈ బలవంతపు పాఠశాలల విలీనం వలన పసిపిల్లలను రెండు నుండి మూడు కిలోమీటర్ల దూరం వెళ్లే పరిస్థితి లేదు, రోడ్లు, కాలువలు, హైవేలు, దాటి స్కూళ్లకు వెళ్లే పరిస్థితి లేదు. మూడు,నాలుగు, ఐదు, తరగతులు పిల్లలు వెళితే ఒకటి,రెండు,తరగతి పిల్లలు తగినంత మంది లేక జిల్లాలో వందలాది పాఠశాలలు మూత పడతాయని, క్రమేపి పాఠశాల మూసివేతను ఈ ప్రభుత్వం కోరుకుంటుంది. కార్పొరేట్ విద్య, కొనసాగలేక, ప్రభుత్వ విద్య అంధక పేద విద్యార్థులు చదువులు ‘ డ్రాప్ అవుట్’ దిశగా అడుగులు వేయక తప్పదని, వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ప్రజాభిప్రాయానికి ఏ మాత్రం విలువ ఇచ్చినా వెంటనే పురా ఆలోచించి, తీసుకున్న నిర్ణయాన్ని మార్చుకోవాలని, వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కెవిపిఎస్ నాయకులు అడపాల ప్రసాద్ గూడూరు ప్రాంతీయ కార్యదర్శి జోగి శివకుమార్, గూడూరు పట్టణ సి.ఐ.టి.యు ప్రధాన కార్యదర్శి బి.వి.రమణయ్య,దర్శి. నాగభూషణం, పుట్టా శంకరయ్య,రమేష్, ఏంభేటీ చంద్రయ్య, బి.చంద్రయ్య,ఆర్.చంద్రమోహన్ తదితరులు పాల్గొన్నారు.

Related Posts

భక్తిశ్రద్ధలతో గురు పౌర్ణమి వేడుకలు

శంఖవరం/ ప్రత్తిపాడు మన న్యూస్ ప్రతినిధి మండలంలో గురు పౌర్ణమి సందర్భంగా భక్తిశ్రద్ధలతో సాయినాధుని ఆలయాల్లో భక్తులు భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. రౌతుపాలెం గ్రామంలో గురు పౌర్ణమి సందర్భంగా సాయినాధుని ఆలయంలో ప్రత్తిపాడు నియోజకవర్గ సిబిఎన్ కోఆర్డినేటర్ యాళ్ళ జగదీశ్…

గురు పౌర్ణమి వేడుకల్లో పాల్గొన్న ముద్రగడ

శంఖవరం/ప్రత్తిపాడు మన న్యూస్ ప్రతినిధి నియోజకవర్గంలో గురు పౌర్ణమి సందర్భంగా సాయినాధుని ఆలయాలు భక్తులతో కిక్కిరి సాయి. సాయినాధుని పర్వదినం గురువారం కావడంతో భక్తులు ఉదయం నుండి ఆలయాల్లో ప్రత్యేక పూజలు అభిషేకాలతో సాయినాధునికి పూజలు నిర్వహించారు. ప్రత్తిపాడు మండలం రౌతుపాలెం…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

భక్తిశ్రద్ధలతో గురు పౌర్ణమి వేడుకలు

భక్తిశ్రద్ధలతో గురు పౌర్ణమి వేడుకలు

గురు పౌర్ణమి వేడుకల్లో పాల్గొన్న ముద్రగడ

గురు పౌర్ణమి వేడుకల్లో పాల్గొన్న ముద్రగడ

చల్లగా చూడవయ్యా..కరుణను చూపవయ్యా..కావాగారవయ్య శ్రీ సాయిబాబా.!సాయిబాబా మందిరంలో ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ప్రత్యేక పూజలు.!!

చల్లగా చూడవయ్యా..కరుణను చూపవయ్యా..కావాగారవయ్య శ్రీ సాయిబాబా.!సాయిబాబా మందిరంలో ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ప్రత్యేక పూజలు.!!

పిల్లల బంగారు భవిష్యత్తు కోసం.. బడివైపు ఒక అడుగు..!లక్ష్యం ఉంటే పేదరికం చదువుకు అడ్డు కాదు..మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 2.0 లో ఎమ్మెల్యే కాకర్ల సురేష్..!

పిల్లల బంగారు భవిష్యత్తు కోసం.. బడివైపు ఒక అడుగు..!లక్ష్యం ఉంటే పేదరికం చదువుకు అడ్డు కాదు..మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 2.0 లో ఎమ్మెల్యే  కాకర్ల సురేష్..!

ఒకే మహిళకు రెండు మరణ ధృవీకరణ పత్రాలు.. ఉరవకొండలో అధికారుల నిర్లక్ష్యం బయటపడింది

ఒకే మహిళకు రెండు మరణ ధృవీకరణ పత్రాలు.. ఉరవకొండలో అధికారుల నిర్లక్ష్యం బయటపడింది

గురువే దైవం: ఉరవకొండలో గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు

గురువే దైవం: ఉరవకొండలో గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు