కూటమి ప్రభుత్వంతోనే సూపరిపాలన – మండల టీడీపీ అధ్యక్షులు యుగంధర్

మన న్యూస్ పాచిపెంట,జూలై 8:- పార్వతిపురం మన్యం జిల్లా పాచిపెంట మండలంలో కూటమి ప్రభుత్వంతోనే సుపరిపాలన సాధ్యమని, ఏడాది పాలనలో ఇచ్చిన హామీలు నెరవేర్చే దిశగా ప్రభుత్వం పరుగులు తీస్తోందని పాచిపెంట తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు గూడెపు యుగంధర్ అన్నారు. మంగళవారం నాడు పాచి పెంట మండలం మిర్తి వలస పంచాయతీ తోట వలస గ్రామంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం లో భాగంగా ఇంటింటికి ఏడాదిలో జరిగిన అభివృద్ధి పథకాలను ప్రజలకు వివరించారు. సుపరిపాలనే ప్రభుత్వ లక్ష్యమని ఆ దిశగా కూటమి ప్రభుత్వం ముందుకు నడుస్తోందని ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు మీకు అందుతున్నాయా..లేదా అని అక్కడ ఉన్న ప్రజలను ప్రశ్నించారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెల్లే బాధ్యత మనందరిపై ఉందని కార్యక్రమానికి హాజరైన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులకు కోరారు. గత ప్రభుత్వం హయాంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమం మన ప్రభుత్వంలో జరిగిన సంక్షేమం,అభివృద్ధి గురించి తేడా అడిగి తెలుసుకున్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం నుంచి సంక్షేమ పథకాలు తప్పనిసరిగా అందుతాయని ఆయన ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. సాలూరు మార్కెట్ కమిటీ చైర్మన్ ముఖి సూర్యనారాయణ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో అభివృద్ధి లేదని తెలుగుదేశం ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా భావించి సమపాలల్లో పరిపాలన అందిస్తున్నామని మీరంతా సహకరించాలని కోరారు. రాబోయే స్థానిక ఎన్నికలకు మనమంతా సిద్ధం కావాలని పార్టీకి ఘన విజయం అందించాలని కోరారు. ఈ కార్యక్రమానికి పార్టీ ఉపాధ్యక్షులు కొత్తల పోలినాయుడు, పార్టీ మండల ప్రధాన కార్యదర్శి మతల బలరాము,ఏ ఎం సి డైరెక్టర్ పి నర్సింగరావు, మిర్తి వలస సర్పంచ్ కే సత్యవతి,ఎం మజ్జా రావు,దండి మోహనరావు, తదితరులు హాజరయ్యారు.

Related Posts

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

శంఖవరం/ అన్నవరం మన ధ్యాస ప్రతినిధి (అపురూప్):-జాతీయ రహదారి పై ప్రమాదాలను నివారించేందుకు భారీ కసరత్తు చేపడుతున్నారు.శ్రీ కాకినాడ జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్ ఐపీఎస్ సూచనల మేరకు మరియు పెద్దాపురం డి.ఎస్.పి డి శ్రీహరి రాజు ఆదేశాలతో ప్రత్తిపాడు…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

శంఖవరం మన ధ్యాస ప్రతినిధి (అపురూప్):- విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణంగా బోధన జరగాలని ఉపాధ్యాయులకు సమగ్ర శిక్ష (కెజిబివి) కార్యదర్శి డి దేవానందరెడ్డి సూచించారు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం మండల కేంద్రం శంఖవరం కస్తూర్భా గాంధీ బాలికా విద్యాలయ (కెజిబివి)…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

ప్రైవేటీకరణతో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో: సిపిఐ

ప్రైవేటీకరణతో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో: సిపిఐ

దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

  • By NAGARAJU
  • September 10, 2025
  • 3 views
దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్ సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

  • By NAGARAJU
  • September 10, 2025
  • 5 views
అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్  సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///