విత్తనాలను బీజామృతం తో శుద్ధి చేయాలి – రైతు అభివృద్ధిసాధ్యం.. ఏ ఓ తిరుపతి రావు

మన న్యూస్ పాచిపెంట, జూలై 6:- విత్తనాలను బీజామృతంతో శుద్ధి చేసిన తరువాత మాత్రమే విత్తనాలను నారు పోసుకుంటే భూమి ద్వారా విత్తనం ద్వారా వ్యాపించే శిలీంద్రాల నుండి తెగుళ్ల నుండి పంటకు రక్షణ కల్పించవచ్చని ఏపీ సిఎన్ ఎఫ్ జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ ఎం శ్రావణ్ కుమార్ అన్నారు. ఆదివారం నాడు మండలం పాంచాలి గ్రామంలో సామూహిక విత్తన శుద్ధి కార్యక్రమంలో మాట్లాడుతూ బీజామృతంతో విత్తనాలను శుద్ధి చేయడం వలన తెగుళ్ళ నుండి రక్షణ పొందడమే కాకుండా విత్తన మొలక శాతం కూడా పెరుగుతుందని తెలిపారు. 100 లీటర్ల నీటికి ఐదు లీటర్ల ఆవు మూత్రం కలిపి దానిలో 10 కేజీల ఆవు పేడను ఒక గుడ్డ సంచిలో మునిగి ఉండేటట్లు ఒక రోజంతా ఉంచి మరుసటి రోజు ఆ ద్రావణానికి 250 గ్రాముల సున్నం కలిపి సరిపడినంత విత్తనానికి పిచికారీ చేసుకుంటూ ద్రావణాన్ని బాగా పట్టించి రెండు గంటలు ఆరబెట్టిన తర్వాత నారు పోసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న గ్రామ సర్పంచ్ యుగంధర్ మాట్లాడుతూ ఎలాంటి ఖర్చు లేకుండా తయారయ్యే బీజామృతం రైతులకు ఎంతగానో ఉపయోగపడుతుందని కేవలం 10 నిమిషాల శ్రమతో మన పంటలను రక్షించుకోవచ్చు అని కాబట్టి రైతులందరూ ఈ విధానాన్ని తప్పక పాటించాల్సిన అవసరం ఉందని తెలిపారు.విత్తనాల బేజామృత శుద్ధి అనంతరం నారు శుద్ధి కూడా బేజామృతం లో ముంచి చేసుకుంటే మరింత ఫలితాలు వస్తాయని వ్యవసాయ అధికారి కే తిరుపతిరావు అన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ వ్యవసాయ సహాయకులు ఈదిబిల్లి శ్రీను ప్రకృతి సేద్య ప్రతినిధులు యశోదమ్మ తిరుపతి నాయుడు మరియు రైతులు పాల్గొన్నారు.

Related Posts

అనధికారిక లేఔట్లను ఎల్.ఆర్.ఎస్ ద్వారా రెగ్యులైజ్ చేయించుకోండి…… కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

మన ధ్యాస,కోవూరు, సెప్టెంబర్ 12: అక్రమ లేఅవుట్లను ఆదిలోనే అడ్డుకునే విషయంలో అధికారులు కఠినంగా వ్యవహరించాలి .కోవూరు నియోజకవర్గ పరిధిలో నుడా నిబంధనలు పాటించని అనధికార లే అవుట్ల యజమానులు 2025 అక్టోబర్ 30వ తేదీ లోపు అపరాధ రుసుం చెల్లించి…

ప్రజల అవసరాలు గుర్తించి పరిపాలన చేసే మానవతావాది చంద్రబాబు నాయుడు………. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

మన ధ్యాస ,ఇందుకూరుపేట ,సెప్టెంబర్ 12:. జగదేవి పేటలో 50 లక్షలతో సిసి రోడ్ల ప్రారంభోత్సవం. – మరో 50 లక్షల నుడా నిధులతో డ్రైన్ల నిర్మాణానికి శ్రీకారం .అభివృద్ధి, సంక్షేమం ఏకకాలంలో అమలు చేసే పాలనా దక్షత ముఖ్యమంత్రి చంద్రబాబు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

అనధికారిక లేఔట్లను ఎల్.ఆర్.ఎస్ ద్వారా రెగ్యులైజ్ చేయించుకోండి…… కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

అనధికారిక లేఔట్లను ఎల్.ఆర్.ఎస్ ద్వారా రెగ్యులైజ్  చేయించుకోండి…… కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

ప్రజల అవసరాలు గుర్తించి పరిపాలన చేసే మానవతావాది చంద్రబాబు నాయుడు………. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

ప్రజల అవసరాలు గుర్తించి పరిపాలన చేసే మానవతావాది చంద్రబాబు నాయుడు………. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

మరోసారి మానవత్వం చాటుకున్న గంగవరం ఆడపడుచులు…

మరోసారి మానవత్వం చాటుకున్న గంగవరం ఆడపడుచులు…

అచ్చంనాయుడుది నోరేనా ………మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి

అచ్చంనాయుడుది  నోరేనా ………మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి

ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆటో డ్రైవర్లు పండుగ వాతావరణంలో ఉన్నారు…….. షేక్ అబ్దుల్ అజీజ్, కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి

ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆటో డ్రైవర్లు పండుగ వాతావరణంలో ఉన్నారు……..  షేక్ అబ్దుల్ అజీజ్, కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి

నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా ఆంధ్రప్రదేశ్ సమాచార మరియు ప్రజా సంబంధాల (ఐ అండ్ పి ఆర్) శాఖ డైరెక్టర్ హిమాన్షు శుక్లా