వడ్రాంపల్లెలో పండుగలా సుపరిపాలనతో తొలి అడుగు కార్యక్రమం..

ప్రజల మద్దతు కూడగట్టుకుని ఇంటింటి ప్రచారం చేస్తున్న పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్..

ప్రతి కుటుంబాన్ని కలిసి ఏడాది పాలనలో కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమాల అమలును వివరిస్తున్న ఎమ్మెల్యే..

మన న్యూస్ ఐరాల జులై-2

పూతలపట్టు నియోజకవర్గం, ఐరాల మండలం, వడ్రాంపల్లె పంచాయతీ పరిధిలో *“సుపరిపాలనతో తొలి అడుగు”* ఇంటింటి కార్యక్రమం పండుగలా జరిగింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తైన సందర్భంగా *“రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు”* ఆదేశాల మేరకూ పూతలపట్టు నియోజకవర్గంలో బుధవారం నుండి ప్రారంభమైన సుపరిపాలనతో తొలి అడుగు కార్యక్రమాన్ని ప్రజల మద్దతు కూడగట్టుకుని ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్న *“పూతలపట్టు శాసనసభ్యులు డాక్టర్ కలికిరి మురళీమోహన్కి”* ప్రజల కర్పూర నీరాజనాలతో స్వాగతం పలుకుతున్నారు. వడ్రాంపల్లె, దామరగుంట, మిట్టిండ్లు, లింగారెడ్డి యిండ్లు గ్రామాల్లో ప్రతి ఇంటికి వెళ్ళి ఏడాది కాలంలో కూటమి ప్రభుత్వం సాధించిన అభివృద్ధి, అమలులో ఉన్న సంక్షేమ పథకాలపై ప్రజలకు వివరించి కరపత్రాలు అందజేశారు. అనంతరం వడ్రాంపల్లె గ్రామంలో ప్రజల నుండి విన్నతులు స్వీకరించారు. గ్రామంలోని సమస్యలు అడిగి తెలుసుకుని త్వరలోనే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. అనంతరం
తామరగుంట గ్రామంలో ఉన్న ఎంపీపీ పాఠశాలకి ఆకస్మికంగా చేరుకున్న ఎమ్మెల్యే మురళీమోహన్ విద్యార్థులతో ముచ్చటించి వారి విద్యా స్థితిగతులపై ఆరా తీశారు. రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న వసతులపై విద్యార్ధులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు, ఉపాధ్యాయులతో సంభాషిస్తూ ప్రభుత్వ సేవలు సకాలంలో అందుతున్నాయా అనే అంశంపై చర్చించారు. ప్రభుత్వం ప్రతి హామీని నెరవేరుస్తోందని, ప్రజల మద్దతుతోనే ఈ మార్పు సాధ్యమవుతుంది” అని ఎమ్మెల్యే మురళీమోహన్ అన్నారు. ఈ కార్యక్రమంలో ఐరాల మండల అధ్యక్షులు హరిబాబు నాయుడు, మాజీ మండల అధ్యక్షులు గురిధర్ బాబు మరియు పూతలపట్టు నియోజకవర్గం ప్రజాప్రతినిధులు, మరియు మండల నాయకులు, కార్యకర్తలు, ప్రజలు,‌ మహిళలు పెద్ద ఎత్తున పాల్గోన్నారు.

Related Posts

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

చిత్తూరు,మనధ్యాస,సెప్టెంబర్11 చిత్తూరు లో ఘనంగా పెదిరెడ్డి మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు.తనను నమ్మిన వారికోసం ఎంతదాకైనా పోరాడే మా జగనన్న సైన్యాధిపతి, పెద్దాయన మానసపుత్రుడు, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి జన్మదిన వేడుకలు హరిణి రెడ్డి ఆధ్వర్యంలో 5…

విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

సైబర్ మోసాల కి గురి కావద్దు అప్రమత్తంగా ఉండాలి. ప్రతి ఒక్కరూ సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలి సంబంధం లేని వ్యక్తుల నుండి వచ్చే మెసేజ్ ల కు స్పందించవద్దు మన ధ్యాస రిపోర్టర్ పసుమర్తి జాలయ్య సింగరాయకొండ:- దేశం…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

  • By JALAIAH
  • September 11, 2025
  • 3 views
విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..